ఏపీలో మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ మహాపాదయాత్ర చేస్తున్నారు. 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ పాదయాత్ర నవంబర్ 1 తేదిన ప్రారంభించారు. డిసెంబర్ 15న తిరుమలకు చేరుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వర్షాల్లో ఇబ్బందులు పడుతూ పాదయాత్ర చేస్తున్న రైతులు ప్రకాశం జిల్లాకు చేరుకున్నారు. భారీ వర్షాలతో పాదయాత్ర…
ఏపీలో కాపుల జనాభా కోటి మంది ఉన్నారని ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా కాపు అభ్యర్థి ఉండాలని తిరుపతి కాంగ్రెస్ మాజీ ఎంపి చింతా మోహన్ వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 70 ఏళ్ల లో కాపులు ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలేదని, కాపులు ముఖ్యమంత్రి అవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా, వారిలో చైతన్యం అవసరమని ఆయన అన్నారు. అంతేకాకుండా అన్ని పార్టీలను కలిసి కాపులను ముఖ్యమంత్రి చేయాలని కొరతానన్నారు. దేశంతో పాటు రాష్ట్రంలో పరిస్థితులు…
నెల్లూరు కార్పోరేషన్తో పాటు 12 మున్సిపాలిటీ, నగరపంచాయతీలకు ఎన్నికలు జరుగగా నిన్న ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే నెల్లూరులోని 49,50 డివిజన్లకు టీడీపీ తరుపున ఇంచార్జీగా వ్యవహరించిన కప్పిర శ్రీనివాస్ అరమీసం, అరగుండుతో దర్శనమిచ్చారు. ఎన్నికల ప్రచారంలో 49,50 డివిజన్లలో టీడీపీ గెలవపోతే అరగుండు, అరమీసం తీయించుకుంటానని సవాల్ చేశారు శ్రీనివాస్.. ఈ మాటకు కట్టుబడి ఎన్నికల ఫలితాల అనంతరం ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నెల్లూరు కార్పోరేషన్లో 54 డివిజన్లకు 54…
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి రూరల్, రామచంద్రాపురం, చంద్రగిరి,పాకాల మండలాల్లో వర్ష భీభత్సం సృష్టించింది. నక్కలేరు వాగు ప్రవాహంతో కొత్తనెన్నూరు గ్రామం ప్రమాదంలో చిక్కుకుంది. పంటపొలాలను ముంచెత్తుతూ ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామచంద్రాపురం నుంచి తిరుపతికి రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తిరుచానూరు సమీపంలోని నక్కలకాలనీ నీట మునిగింది. దీంతో షికారీలు జాతీయ…
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు మహాపాదయాత్ర చేపట్టారు. 45 రోజుల పాటు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ ఈ మహాపాదయాత్రం సాగనుంది. అయితే నేడు 18వ రోజు ప్రకాశం జిల్లా గుడ్లూరులో మహాపాదయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం నెల్లూరు జిల్లా రాజువారి చింతలపాలెం వద్ద నేటి పాదయాత్ర ముగియనుంది. 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ పాదయాత్ర డిసెంబర్ 15న తిరుమలకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీలో భారీ వర్షాలు…
ఏపీలో నెల్లూరు కార్పోరేషన్తో పాటు పెండింగ్లో మరో 12 మున్సిపాలిటీలు, నగరపంచాయతీలకు పోలింగ్ జరిగిన విషయం తెలసిందే. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే తాజాగా ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ని టీడీపీ కైవసం చేసుకుంది. వైసీపీ-టీడీపీ మధ్య హోరాహోరీగా ఎన్నికల పోరు సాగింది. మొత్తం 20 వార్డులకు గాను టీడీపీ 13 వార్డులు గెలుచుకొని దర్శి నగర పంచాయతీ చైర్మన్…
ఏపీ ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పంలో వైసీపీ విజయకేతనం ఎగురవేస్తోంది. కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులకు ఎన్నికలు జరుగగా నేడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ 14 స్థానాల్లో గెలుపొందింది. టీడీపీ అభ్యర్థులు 2 స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిననాటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీ జెండా ఎగరవేయాలని అధికార పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. అనుకున్న విధంగానే వైసీపీ అభ్యర్థులు…
ఏపీలోని 12 మున్సిపాలిటీలు, నగరపంచాయతీల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కడప జిల్లాలోని కమలాపురం నగర పంచాయతీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. కమలాపురం మునిసిపాలిటీలోని 20 వార్డుల్లో 15 వైసీపీ, 5 వార్డుల్లో టీడీపీ గెలుపొందింది. 01, 06, 12, 13, 19 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. Also Read:బద్దలైన చంద్రబాబు కంచుకోట.. కుప్పంలో వైసీపీ దూకుడు.. 2, 3, 4, 5, 7, 8, 9, 10, 11, 14,15,…
ఏపీ వ్యాప్తంగా నకిలీ చలాన్ల స్కామ్ సంచలనం సృష్టించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన పలువురు సబ్ రిజిస్ట్రార్లపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ధర్మనా కృష్ణదాస్ మాట్లాడుతూ.. 51 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలాన్ల ద్వారా లావాదేవీలు జరిగాయని వెల్లడించారు. ఈ నకిలీ చలాన్ల వల్ల రూ.12 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. Also Read: షాకిచ్చిన ఆకివీడు పోస్టల్ బ్యాలెట్ అంతేకాకుండా రూ.9.34 కోట్లు రికవరీ చేసినట్లు…
ఎన్ని చట్టాలు చేసినా మృగాళ్లు మాత్రం భయపడడం లేదు. చిన్నాపెద్దా అని తేడా లేకుండా చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. అయితే తాజాగా మరో కీచకుడి ఉదంతం బయట పడింది. విశాఖపట్నం జిల్లా చోడవరంలో ఎలక్ట్రికల్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి.. గత మూడు నెలల క్రితం బదిలీపై వచ్చిన ఓ మహిళా సబ్ ఇంజనీర్ను లైంగికంగా వేధించాడు. ఏఈ వెకిలి చేష్టలు శృతిమించడంతో సదరు మహిళా సబ్ ఇంజనీర్…