తిరుపతి జిల్లాలోని బాలిరేడ్డిపాలెంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీచౌంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పారు.
వర్షాలు ఆగి రెండు రోజులైనా పొలాలన్నీ ఇంకా నీటిలోనే ఉన్నాయి.. కాలువలు ఆధునీకరించి ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు అని ఆరోపించారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న చూపు ఉంది.. రైతులు తీవ్ర నిస్పృహలో ఉన్నారు.. ఆత్మహత్యలే శరణ్యమని రైతులు భావిస్తున్నారు.. నష్టపోయిన ప్రతి రైతుకి ఏకరనికి 50 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అని పురంధేశ్వరి డిమాండ్ చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మిచౌంగ్ తుఫాన్ తో పంట నష్టపోయిన రైతాంగాన్నివెంటనే ఆదుకోవాలి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కోరారు. రైతులకు ఉదారంగా ఆర్ధిక సహకారం అందించాలి అని ఆమె తెలిపారు.
మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం చిత్తశుద్దితో పని చేస్తుంది అని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. విపత్కర పరిస్దితులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాం.. ప్రతీ రెండు గంటలకు అప్ డేట్స్ తీసుకుని తీర ప్రాంత వాసులను అప్రమత్తం చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి... మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కోస్తా తీరం వెంబడి అధికారులు తగిన చర్యలు చేపట్టారు .. తుఫాను తీవ్రతరం అవుతుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకాధికారులను నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. రెండు రాష్ట్రాల పోలీసులే కాదు.. చివరకు సీఆర్పీఎఫ్ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది.. అయితే, జలం జగడంపై కృష్ణా రివర్ బోర్డుకు లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మరి కొద్ది నెలల్లో రాష్ట్రంలో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో కొత్త ఇనిషియేటివ్.. పోలీసు అధికారుల పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో రేపు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని భావించే ఏపీకి చెందిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ఓటు హక్కు కలిగి ఉన్న ఏపీ ఉద్యోగులకు రేపు ఓటు వేసేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఉద్యోగుల సంఘం నేతలు చేసిన విజ్ఞప్తికి ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు ఇచ్చారు.
బీజేపీ సంక్షేమం,అభివృద్ధికి పాటుపడుతున్న సందర్భం అందరూ చూస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు. సమసమాజం స్థాపనకు బీజేపీ పాటుపడుతుందన్నారు. మోడీ అనేక విధాలుగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని.. రాబోయే రోజుల్లో దేశం అభివృద్ధిలో రెండు, మూడు స్థానాలకు చేరుకుంటుందన్నారు.