సిద్ధం అంటూ తాను చేసిన ట్వీట్ పై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు క్లారిటీ ఇచ్చారు. ‘పవన్ అన్నను సీఎం చేయడానికి సిద్ధం.. కలిసి సాధిద్దామని ట్విట్టర్ (ఎక్స్)లో ట్వీట్ చేశారు.
ఏపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, వైసీపీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తుకుంటూ పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు. ఎలక్షన్ కోడ్ పరిధి దాటి వ్యవహరిస్తున్నారంటూ రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసుకుంటున్నాయి.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలు లేరు గళం మాత్రం ఉందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. నేను పెద్ద ముదురు అని చంద్రబాబు అంటున్నారు.. చంద్రబాబు కంటే ప్రజలకు మేలు చేయడంలో.. రైతులకు మేలు చేయడంలో నేను ముదురన్నారు.
కలిగిరి పట్టణంలో తెలుగుదేశం- జనసేన- బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు అభిమానులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఉదయగిరి టీడీపీ- జనసేన- బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి కలిగిరి ప్రధాన రహదారి వెంబడి ప్రచారం నిర్వహించారు.
వారాహి యాత్రకు వచ్చినపుడు ఇక్కడ మంత్రి రోజు అన్నం పెట్టే రైతుని ఏడిపించిన విధానం నన్ను బాధించింది.. రైతు కంట కన్నీరు పెట్టించిన మంత్రి ఆయన కొడుకు తుడిచిపెట్టుకుపోవాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. నాకు అనుభవం ఉంది.. పవన్ కళ్యాణ్ కు పవర్ ఉందన్నారు. రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడు అయ్యింది.. ప్రజాగళంకు వారాహి తోడు అయ్యింది.. సైకిల్ స్పీడుకు తిరుగు లేదు.. గ్లాసు జోరుకు అడ్డు లేదు అని పేర్కొన్నారు.
మేమంత సిద్ధం సభ జనసముద్రంగా మారిందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సిద్ధం సిద్ధం అంటూ ప్రజల నినాదాలు వైసీసీ జైత్రయాత్రకు శంఖారావంలా వినిపిస్తున్నాయి.. ప్రజలు చేస్తున్న సిద్ధం సిద్ధం అనే నినాదం ప్రతిపక్షాలకు యుద్ధం యుద్ధం అన్నట్లు ఉంది.