S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- భారత్కు వస్తున్న మరో ఎస్-400 సిస్టమ్..
- పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరింపు..
- ఇప్పటికే భారత్ చేరిన మూడు సిస్టమ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S-400 air defence system: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మరొకటి భారత్కు రాబోతోంది. రష్యా నుంచి ఇప్పటికే మూడు ఎస్-400 ట్రయంప్ సిస్టమ్స్ భారత్కు రాగా, నాలుగో సిస్టమ్ ఇప్పుడు భారత వైమానిక దళం అందుకోబోతోంది. మే నెలాఖరు నాటికి ఇది భారత్ చేరుకుంటుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ దాడుల్ని ఎస్-400 సమర్థవంతంగా అడ్డుకుంది. ఇప్పుడు వస్తున్న నాలుగో స్వ్కాడ్రన్ను పాకిస్తాన్ సరిహద్దు వద్ద మోహరించనున్నారు. దీంతో భారత గగనతల రక్షణ మరింత బలోపేతం అవుతుంది.
Also Read
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
2018లో ఎస్-400 కొనుగోలుపై రష్యాతో భారత్ రూ. 35,000 కోట్ల విలువైన ఒప్పందాన్ని చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం రష్యా నుంచి భారత్కు 5 ఎస్-400లు రావాలి. ఇప్పటికే, వచ్చిన మూడు ఎస్-400 సిస్టమ్లను భారత్ సరిహద్దుల్లో మోహరించింది. ఇప్పుడు నాలుగోది వచ్చే నెలాఖరు వరకు భారత్ చేరుకుంటుంది. ఐదోది 2026 చివరి నాటికి వచ్చే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు అందిన మూడు సిస్టమ్స్లో ఒకటి భారతదేశ ఈశాన్య రాష్ట్రాలను కలిపే సిలిగురి కారిడార్(చికెన్స్ నెక్) వద్ద మోహరించగా, రెండోది జమ్మూ కాశ్మీర్, పంజాబ్లకు రక్షణ కల్పించే పఠాన్ కోట్లో, మూడోది రాజస్థాన్, గుజరాత్ లోని కీలక ప్రాంతాల్లో మోహరించారు. ఇప్పుడు వచ్చే నాలుగవది పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరిస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!