AP Intermediate Topper: బాల్య వివాహాన్ని ఎదిరించి.. ఇంటర్మీడియట్ టాపర్గా నిలిచింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూల్ జిల్లా ఆదోని మండలం పెద్ద హరివనం గ్రామానికి చెందిన నిర్మల చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుకుగా ఉండేది. చదువంతా ప్రభుత్వ విద్యాయాల్లోనే కొనసాగించింది. అయితే, ఎంతో పట్టుదలతో చదువుతున్న ఆమె ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో టాపర్ గా నిలిచింది. ఆలూరు కేజీబీవీలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్న నిర్మల అత్యధిక మార్కులు తెచ్చుకుంది. బైపీసీలో మొత్తం 440 మార్కులకు గాను 421 మార్కులు సాధించి స్టేట్ టాపర్ గా నిలిచింది. దీంతో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి నిర్మలకు అభినందనలు తెలియజేశారు. కాగా, నిర్మలది నిరుపేద కుటుంబం.. నలుగురు అక్కాచెల్లెల్లలో ఆమె చివరిది. ఆమె తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ముగ్గురు బిడ్డల పెళ్లిళ్లు చేశారు.. ఇప్పుడు, నిర్మలకు కూడా పెళ్లి చేయాలని అనుకున్నారు.
Read Also: BJP Manifesto: రేపు బీజేపీ మేనిఫెస్టో విడుదల.. అందరిలో ఆసక్తి..
Also Read
అయితే, నిర్మలకు మాత్రం పెద్ద చదువులు చదవాలని అనుకునేది. దీంతో గతేడాది ఎంతో కష్టపడి చదివి 10వ తరగతి పరీక్షలో 600 మార్కులకు గాను 537 మార్కులు సాధించింది. దీంతో ఆమెను స్కూల్ టీచర్స్, తోటి విద్యార్థులు అభినందించారు. కానీ, తల్లిదండ్రులకు మాత్రం ఆమె సాధించిన మార్కులను పట్టించుకోకుండా.. ఈ మార్కులు తమ బిడ్డ పెళ్లికి అడ్డంకిగా మారతాయి అనుకున్నారు. కానీ, పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన నిర్మలను ఇంటర్మీడియట్ చదివించేందుకు తల్లిదండ్రులు ఒప్పకోలేదు. తాము చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి చేశారు. పెళ్లి వయసు కాకున్నా ఆమెను బాల్య వివాహం చేసేందుకు తల్లిదండ్రులు రెడీ అయ్యారు.
Read Also: Venu Swamy : భార్యతో వేణుస్వామి మరో రీల్.. బాగా భయపడ్డాడే..
కానీ, చదువుకోవాలన్న నిర్మల ధైర్యంగా తన బాల్యవివాహం గురించి స్థానిక ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డికి ఫిర్యాదు చేసింది. ఇక, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే జిల్లా కలెక్టర్ కు సమాచారం అందించారు. దీంతో వారిపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వమే చదివిస్తుందని చెప్పడంతో నిర్మల తల్లిదండ్రులకు కలెక్టర్ నచ్చజెప్పడంతో వారు చివరికి ఒప్పుకున్నారు. దీంతో ఆలూరులోని కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయంలో ఇంటర్మీడియట్ బైపీసీలో నిర్మల చేరింది. అయితే, కష్టపడి చదివిన నిర్మల ఇంటర్మీడియట్ పరీక్షలు రాసింది.. ఇటీవల వెలువడిన ఫలితాల్లో మంచి మార్కులు సాధించి సెకండ్ ఇయర్ లోకి అడుగుపెడుతుంది. ఇక, నిర్మల మాట్లాడుతూ.. బాగా చదివి ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్నదే తన లక్ష్యమని చెప్పుకొచ్చింది. తనలాగ ఎందరో అమ్మాయిలు తల్లిదండ్రుల ఆర్థిక కష్టాల కారణంగా చదువుకోలేకపోతున్నారు.. దీంతో వారు చిన్న వయసులోనే పెళ్లిల్లు చేసుకోవాల్సి వస్తోంది అని చెప్పింది. కాబట్టి పోలీస్ ఆఫీసర్ అయి.. బాల్య వివాహాలను అరికడతాను.. అమ్మాయిలు తమ కలలు నిజం చేసుకునేందుకు సహకరిస్తానని నిర్మల వెల్లడించింది.
తాజావార్తలు
-
APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
-
chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్పై మెగాస్టార్ రియాక్షన్ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
-
CM Revanth Reddy : మల్కాజ్గిరి నా రాజకీయ పునర్జన్మ..
-
Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
-
Varanasi: వారణాసి నుంచి మాంసం దుకాణాలు అవుట్..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!