Balineni Srinivas Reddy: ఇలాంటి ఘటనలకు పాల్పడితే సహించం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balineni Srinivas Reddy: సీఎం జగన్పై జరిగిన రాయి దాడిపై మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. టీడీపీ దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనమని.. సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ వాళ్లు ఓర్చుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ సభలు వెలవెలబోతున్నాయన్న ఆయన.. సీఎం సభలకు జనం తండోపతండాలుగా వస్తున్నారన్నారు. టీడీపీ నేతలు తట్టుకోలేక భౌతిక దాడులకు దిగటం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. ఇటీవల ఒంగోలులో కూడా తమ కుటుంబంపై దాడికి ప్రయత్నించారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్దతి కాదని.. ఇలాంటి ఘటనలకు పాల్పడితే సహించమన్నారు. మూడు పార్టీలు అండగా ఉన్నాయని ఇలా చేయటం సరికాదన్నారు. ప్రతీ ఒక్కరూ ఈ దాడులు ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అల్లరి మూకలు ఇలాంటి దాడులకు పాల్పడే అవకాశం లేదని బాలినేని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిపై దాడి చేయాల్సిన అవసరం అల్లరి మూకలకు ఎందుకు ఉంటుందన్నారు. టీడీపీ చేసిన పని ఇది అని.. బాధ్యులను విచారణ చేసి పట్టుకుంటామన్నారు. రెండో సారి ప్రజలు టీడీపీకి బుద్ది చెబుతారన్నారు. ప్రజలు 150 సీట్లతో మరోసారి వైసీపీకి పట్టం కడతారని ఆయన తెలిపారు. టీడీపీ వాళ్ళే దాడులు చేయిస్తారు.. మళ్ళీ వాళ్ళే కుట్రలు అంటారని మండిపడ్డారు. సీఎంగా పని చేసినవారు ఎవరైనా చీప్ పనులు చేస్తారా.. కొద్దిగా ఉంటే రాయి కంటికి తగిలితే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. టీడీపీ వాళ్లకు మైండ్ పాడైందని… పెన్షన్లు, వాలంటీర్లపై కూడా రోజుకో రకంగా మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని.. ఆయనకు వయసైపోయింది.. తన కొడుకు పరిస్థితి ఏంటా అని ఆయనకు ఆలోచనలు ఎక్కువయ్యాయన్నారు. ఫ్రస్టేషన్లో వరస్ట్ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.
Also Read
- Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
- AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
తాజావార్తలు
-
Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా’.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!