Balineni Srinivas Reddy: ఇలాంటి ఘటనలకు పాల్పడితే సహించం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balineni Srinivas Reddy: సీఎం జగన్పై జరిగిన రాయి దాడిపై మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. టీడీపీ దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనమని.. సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ వాళ్లు ఓర్చుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ సభలు వెలవెలబోతున్నాయన్న ఆయన.. సీఎం సభలకు జనం తండోపతండాలుగా వస్తున్నారన్నారు. టీడీపీ నేతలు తట్టుకోలేక భౌతిక దాడులకు దిగటం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. ఇటీవల ఒంగోలులో కూడా తమ కుటుంబంపై దాడికి ప్రయత్నించారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్దతి కాదని.. ఇలాంటి ఘటనలకు పాల్పడితే సహించమన్నారు. మూడు పార్టీలు అండగా ఉన్నాయని ఇలా చేయటం సరికాదన్నారు. ప్రతీ ఒక్కరూ ఈ దాడులు ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అల్లరి మూకలు ఇలాంటి దాడులకు పాల్పడే అవకాశం లేదని బాలినేని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిపై దాడి చేయాల్సిన అవసరం అల్లరి మూకలకు ఎందుకు ఉంటుందన్నారు. టీడీపీ చేసిన పని ఇది అని.. బాధ్యులను విచారణ చేసి పట్టుకుంటామన్నారు. రెండో సారి ప్రజలు టీడీపీకి బుద్ది చెబుతారన్నారు. ప్రజలు 150 సీట్లతో మరోసారి వైసీపీకి పట్టం కడతారని ఆయన తెలిపారు. టీడీపీ వాళ్ళే దాడులు చేయిస్తారు.. మళ్ళీ వాళ్ళే కుట్రలు అంటారని మండిపడ్డారు. సీఎంగా పని చేసినవారు ఎవరైనా చీప్ పనులు చేస్తారా.. కొద్దిగా ఉంటే రాయి కంటికి తగిలితే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. టీడీపీ వాళ్లకు మైండ్ పాడైందని… పెన్షన్లు, వాలంటీర్లపై కూడా రోజుకో రకంగా మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని.. ఆయనకు వయసైపోయింది.. తన కొడుకు పరిస్థితి ఏంటా అని ఆయనకు ఆలోచనలు ఎక్కువయ్యాయన్నారు. ఫ్రస్టేషన్లో వరస్ట్ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.
Also Read
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
- Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్లో మెసేజ్ పంపొచ్చు!
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
తాజావార్తలు
-
Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
-
Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్లో మెసేజ్ పంపొచ్చు!
-
Virat Kohli: “జట్టుకు పనికొస్తానో లేదో నా ముఖం మీద చెప్పేయండి”.. గంభీర్, అగార్కర్పై కోహ్లీ ఫైర్..
-
UIDAI New Aadhaar App: mAadhaar యాప్ త్వరలో నిలిపివేత.. కొత్త Aadhaar యాప్కు డేటా ఎలా బదిలీ చేయాలి? పూర్తి వివరాలు
-
Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..