The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Lalit Hotel: దేశ రాజధానిలోని బారాఖంబా లేన్లో ఉన్న ఐకానిక్ హోటల్ ‘ద లలిత్’ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ హోటల్ నడుపుతున్న భారత్ హోటల్స్ లిమిటెడ్ లైసెన్స్ను రద్దు చేస్తూ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ఏప్రిల్ 22, 2026న వెలువడిన ఈ తీర్పు హోటల్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అసలు ఏం జరిగిందంటే.. ఈ వివాదానికి మూలం 6.0485 ఎకరాల ప్రభుత్వ భూమి. 1982లో ఎన్డీఎంసీ – భారత్ హోటల్స్ లిమిటెడ్ మధ్య 99 ఏళ్ల లైసెన్స్ ఒప్పందం కుదిరింది. అయితే ఒప్పందం ప్రకారం 33 ఏళ్ల తర్వాత లైసెన్స్ ఫీజును సవరించే అధికారం ప్రభుత్వానికి ఉంది. దీని ప్రకారం.. పెరిగిన అద్దె, బకాయిల కింద రూ.1,063.74 కోట్లు చెల్లించాలని 2020లో ఎన్డీఎంసీ నోటీసు ఇచ్చింది. ఆ మొత్తాన్ని చెల్లించకపోవడంతో లైసెన్స్ను రద్దు చేసింది.
ఈ కేసును విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ (చీఫ్ జస్టిస్ డి.కె. ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావు) ఎన్డీఎంసీ నిర్ణయం సరైనదేనని తేల్చింది. రాజధానిలో భూమి పరిమితమైన, అత్యంత విలువైన వనరు అని, ప్రభుత్వ సంస్థకు నష్టం కలిగేలా ఏ ఒప్పందం కొనసాగకూడదని కోర్టు స్పష్టం చేసింది. హోటల్ ప్రాంగణంలోని కమర్షియల్ స్పేస్ను సబ్-లైసెన్స్కు ఇవ్వడం కూడా నిబంధనలకు విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. ప్రముఖ పారిశ్రామికవేత్త లలిత్ సూరి 1980వ దశకంలో ఈ హోటల్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. 1988లో 444 గదులతో ప్రారంభమైన ఈ హోటల్, దేశవ్యాప్తంగా గోవా, ముంబై, బెంగళూరు వంటి నగరాలకు విస్తరించింది. 2006లో ఆయన మరణం తర్వాత భార్య జ్యోత్స్న సూరి నాయకత్వంలో ‘ద లలిత్’ బ్రాండ్ అంతర్జాతీయ స్థాయికి చేరింది.
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
హైకోర్టు తీర్పుతో ఇప్పుడు ఎన్డీఎంసీకి సర్వాధికారాలు లభించాయి. బకాయిలను వసూలు చేయడం కోసం హోటల్ను సీజ్ చేసే లేదా భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. అయితే భారత్ హోటల్స్ లిమిటెడ్ ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ భూములపై ప్రైవేట్ ప్రాజెక్టులు చేపట్టే ఇతర సంస్థలకు కూడా ఈ తీర్పు ఒక హెచ్చరికలాంటిదని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
- Tags
తాజావార్తలు
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
-
Parthiv Patel: హిట్మ్యాన్ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
-
Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
-
Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
-
Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?