Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Chandrababu Naidu Criticize Cm Ys Jagan Mohan Reddy

TDP Chief: అమరావతి నిర్మించింది.. ఆంధ్రాకు సాప్ట్వేర్ను పరిచయం చేసింది.. అందుకోసమే..!

Published Date :April 13, 2024 , 5:33 pm
By Chandra Shekhar Pamena
TDP Chief: అమరావతి నిర్మించింది.. ఆంధ్రాకు సాప్ట్వేర్ను పరిచయం చేసింది.. అందుకోసమే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రజాగళం 32వ సభ గుంటూరు జిల్లాలోని తాడికొండలో జరుగుతుంది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కానీ ఇది తాడికొండ కాదు రాష్ట్ర రాజధాని అమరావతి.. అధికార కేంద్రం నుంచి మాట్లాడుతున్నాను.. ఈ రాజధానిని ఈ అమరావతిని ఒక వెంట్రుక కూడా ఎవరు కదిలించలేరు.. ఈరోజు ఏప్రిల్ 13.. మే 13న చరిత్ర తిరగబడుతుంది.. ప్రజలు రాసిన చరిత్ర మిగులుతుంది.. తెలుగువాడు గర్వపడేలా రాజధాని ఉండాలని సంకల్పంతో అమరావతిని నిర్మించేందుకు సిద్ధమయ్యాం అని ఆయన చెప్పుకొచ్చారు. 29 వేల మంది రైతులు ముందుకు వచ్చి భూములు ఇచ్చారు.. అమరావతిని నిర్మించింది, ఆంధ్రప్రదేశ్ కు సాఫ్ట్వేర్ ను పరిచయం చేసింది నాకోసం కాదు.. ప్రజల కోసమే అని చంద్రబాబు అన్నారు.

Read Also: Tragedy: పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా అనంతలోకాలకు.. అన్న ఇద్దరు చెల్లెల్లు మృతి

గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినవాడు మన జిల్లాలోని చదువుకొని వెళ్ళాడు అని చంద్రబాబు నాయుడు తెలిపారు. కానీ, కన్న తల్లిని, జన్మభూమిని మర్చిపోకూడదన్న కారణంతో.. గుంటూరుకు వచ్చి ప్రజాసేవ చేయాలనుకుంటున్నాడు చెప్పారు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదో తెలియని పరిస్థితికి జగన్ తీసుకువచ్చాడు.. చివరికి తిక్కలోడి మూడు ముక్కలాటగా రాజధాని మిగిలిపోయింది అని ఆరోపించారు. హైదరాబాద్ లో 5000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కట్టాం.. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేశాం.. అది పరిపాలన చేయటమంటే.. ఒకప్పుడు శాతవాహనులు రాజధానిగా పరిపాలించిన ప్రాంతం ఇది.. దేవతల రాజధాని అమరావతి.. అందుకే ఈ ప్రాంతానికి అమరావతి అని పేరు పెట్టాం అని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Read Also: Sydney mall Attack: సిడ్నీ మాల్ కత్తిపోటు దాడిలో 6కి చేరిన మృతుల సంఖ్య.. అనుమానితుడి కాల్చివేత..

జగన్ లాంటి రాక్షసులు వెయ్యి మంది వచ్చినా.. అమరావతి వెంట్రుక కూడా పీకలేరంటూ చంద్రబాబు మండిపడ్డారు. అమరావతి ముహూర్త బలం అది.. అమరావతి జేఏసీపై 3000 కేసులు పెట్టారు.. మనకు మద్దతుగా జనసేన- బీజేపీ పార్టీలు ఉన్నాయి.. పవన్ కళ్యాణ్ నిబద్ధత కలిగిన నాయకుడు.. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రావడమే కాదు.. అమరావతే రాజధాని అని ఉత్సవాలు చేసుకునే రోజు కూడా.. అదే రోజున జగనాసుర వధ, అమరావతి రక్షణ కూడా జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలు గెలవాలి, జగన్ పోవాలి.. జగన్ ను భరించే శక్తి ప్రజలకు లేదు.. 10 కోట్లు ఖర్చు పెట్టి ప్రజల కోసం నిర్మించిన ప్రజా వేదికను ఇంగితం ఉన్న వ్యక్తి ఎవరైనా కూల్చేస్తారా.. నేను అధికారంలోకి రాగానే ప్రజావేదిక నిర్మాణం మళ్ళీ జరుగుతుంది అని చంద్రబాబు వెల్లడించారు.

Read Also: Peddireddy: భవిష్యత్త్ లేని చంద్రబాబు.. ప్రజలకు ఏం గ్యారంటీ ఇస్తారు..

ప్రజా పాలనకు నాంది పలుకుతుంది.. కౌరవ సభను ,గౌరవ సభగా మార్చి అసెంబ్లీలో అడుగు పెడతానని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. అందుకే జూన్ 4న సగౌరవంగా మళ్లీ గౌరవ సభలోకి అడుగు పెడతాను.. ఒక్క అమరావతికే కాదు రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది.. ప్రతి ఒక్కరూ సైకిల్ ఎక్కండి.. దాహం తీర్చుకోవడానికి చేతిలో గ్లాసు కూడా పెట్టుకోండి.. కమలం కూడా జేబులో పెట్టుకోండి.. మన మీటింగ్ లను చూస్తే జగన్ కు నిద్ర రాదు.. టీవీలు పగలగొడతాడు అంటూ ఆయన సెటైర్ వేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Elections 2024
  • chandrababu
  • pawan kalyan
  • tdp

తాజావార్తలు

  • B-1B Lancer: ఇరాన్‌కు చెక్ పెట్టేందుకు రంగంలోకి అమెరికా B-1B లాన్సర్!

  • BAN vs PAK: పాకిస్థాన్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో మరో వివాదం.. వైడ్ బాల్‌కి రివ్యూ, ఐసీసీకి ఫిర్యాదు!

  • Telangana Thalli Statue: అసెంబ్లీలో కొలువుదీరిన ‘తెలంగాణ తల్లి’.. ఆవిష్కరించిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

  • Oscars 2026 : ఆస్కార్స్ లో అదరగొట్టిన One Battle After Another.. ఏకంగా ఎన్ని అవార్డ్స్ గెలిచిందంటే

  • Metpally: హనుమాన్ మాలలో ఉన్న విద్యార్థులకు ప్రవేశం నిరాకరణ.. స్కూల్ వద్ద ఉద్రిక్తత..!

ట్రెండింగ్‌

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions