ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి సిట్ మరో ఛార్జ్ షీటును సోమవారం ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది ఇప్పటివరకు ప్రైమరీ, రెండో అదనపు ఛార్జిషీట్ దాఖలు చేసిన సీట్ తాజాగా మూడో అదనపు ఛార్జ్ షీట్ ను కోర్టులో దాఖలు చేసింది. కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవుల పాత్ర గురించి సీట్ ఈ తాజా ఛార్జ్ షీట్ లో పేర్కొంది.
విజయవాడ నగరంలో ట్రాఫిక్ పోలీసుల వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా వెళుతున్న వాహన చోదకులకు జరిమానాలు విధించడంతో సరిపెట్టకుండా సోషల్ మీడియాలో రీల్స్ చేయటం ఇప్పుడు వివాదానికి కారణమైంది సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ అవగాహన కల్పించడంలో తప్పేం లేనప్పటికీ అది హద్దులు దాటి అవతలి వాళ్ళని అవమానించే వరకు వెళ్లడంతో పోలీసులు అతి చేస్తున్నారని వరకు వ్యవహారం వెళ్లింది..
విజయవాడ రాజరాజేశ్వరి పేటలో డయేరియా వ్యాప్తి అరికట్టకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కలెక్టర్ల సదస్సులో అధికారుల తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య రంగంలో 15 సెప్టెంబర్, 2023 ఒక గొప్ప రోజు.. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలనా కాలంలో నాకు అత్యంత సంతృప్తిని మిగిల్చిన రోజు.. నేను ఒక మంచి పని చేయగలిగానన్న తృప్తి నాకు లభించింది.. 1923 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ రంగంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే, ఒక్క మా హయాంలోనే ఒకేసారి 17 మెడికల్ కాలేజీలను సంకల్పించాం అంటూ జగన్ ట్వీట్..
మరోసారి ఏపీలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది సర్కార్.. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవోగా ఏలూరు జేసీ ధాత్రి రెడ్డిని నియమించిన ప్రభుత్వం.. ఏపీ ఫైబర్నెట్ ఎండీగా కృష్ణా జిల్లా జేసీ గీతాంజలి శర్మ, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ఎండీగా పాడేరు సబ్ కలెక్టర్ సౌర్య మాన్ పటేల్ను నియమించింది.. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
బయట నుంచి చూస్తే అది స్పా సెంటర్.. కానీ, లోపల జరిగే తంతాంగం వేరే.. రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పా సెంటర్ ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచారం గుట్టు రట్టు చేశారు పోలీసులు. రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్ లోని ఫెదర్ టచ్ స్పా అండ్ బ్యూటీ సెలూన్ లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. ఈ ఘటనలో 12 మంది ఉండగా 11 మంది పట్టుబడ్డారు.
పోలవరం నిర్వాసితుల సమస్యలపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను కలిసింది సీపీఎం ప్రతినిధి బృందం.. జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ ను కలిసిన వారిలో సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్, సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, పోలవరం నిర్వాసితులు ఉన్నారు.. ఈ సందర్భంగా ఎంపీ జాన్ బ్రిటాస్.. మాట్లాడుతూ. 8 మండలాల్లో 392 గ్రామాల్లో లక్ష ఆరు వేల కుటుంబాలు పోలవరం ప్రాజెక్టు వల్ల ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రికి తెలిపామన్నారు.