AP Crime: అల్లుడి కిడ్నాప్, హత్యకు స్కెచ్ వేసిన అత్త.. ట్విస్ట్ ఏంటంటే..?
- కూతురిని తన వద్దకు రానివ్వడం లేదని అల్లుడిపై పగ..
- అల్లుడిని కిడ్నాప్ చేసి హత్య చేయాలని అత్త స్కెచ్..
- అత్తతోపాటు కిడ్నాపర్లు కటకటాల వెనక్కి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: కూతురు కాపురం పచ్చగా ఉండాలని కోరుకుంటుంది ఏ అత్త అయినా.. అయితే తన కూతురిని తన వద్దకు రానివ్వడం లేదని అల్లుడిపై పగ పెంచుకుంది ఓ అత్త.. అంతేకాదు అల్లుడిని కిడ్నాప్ చేసి హత్య చేయాలని స్కెచ్ వేసింది.. దీని కోసం కొంత మందితో కలిసి ప్లాన్ చేసింది.. అల్లుడిని అడ్డు తొలగించుకుంటే.. కూతురు తన వద్దకు వస్తుందని భావించింది.. అయితే, కిడ్నాపర్లతో కలిసి అత్త చేసిన ప్రయత్నం ఫెయిల్ అయ్యింది… చివరకు అత్తతోపాటు కిడ్నాపర్లు కటకటాల వెనక్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Read Also: Crime News: సిద్ధిపేటలో దారుణం.. ఆస్తి కోసం కన్నతల్లిని కడతేర్చిన కూతురు..
Also Read
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
- Ambati Rambabu: పోలీసులను రాజకీయ కక్షకు వాడుతున్నారు.. అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మణికంఠకు నాలుగేళ్ల క్రితం పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన లిఖితతో పెళ్లయింది. వీరికి ఒక కుమార్తె సంతానం.. అయితే, పెళ్లి జరిగినప్పటి నుంచి అత్త విజయలక్ష్మి ప్రవర్తన మణికంఠకు నచ్చలేదు. దీంతో, తన భార్య లిఖితను కూడా పుట్టింటికి దూరంగా ఉండాలని చెప్పారు. లిఖిత కూడా తల్లితో దూరంగా ఉంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో తన కూతుర్ని తనకు దూరం చేస్తున్నాడని అల్లుడు మణికంఠపై అత్త విజయలక్ష్మి పగ పెంచుకుంది. అల్లుడు అడ్డు తొలగించుకుంటే కూతురు తన వద్దకు వస్తుందని భావించింది. పక్కా పథకం ప్రకారం నలుగురితో కలిసి తెనాలి చేరుకుంది. రాత్రి సమయంలో అల్లుడు మణికంఠను బలవంతంగా కారులో ఎక్కించుకొని బయలుదేరింది. తెనాలి శివారుకు వచ్చిన తర్వాత మణికంఠపై అందరూ కలిసి కర్రలతో దాడి చేశారు. మణికంఠను బలవంతంగా కారులో ఎక్కించుకోవడం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. తెనాలి 3 టౌన్ పోలీసులు వెంటనే స్పందించి చేబ్రోలు మండలం కారును శేకూరు వద్ద కారును అడ్డుకున్నారు. మణికంఠను కాపాడి కిడ్నాప్ కు ప్రయత్నించిన అత్త విజయలక్ష్మితో పాటు ఆమెతో సహకరించిన నలుగురిని అరెస్టు చేశారు. ఇక, అల్లుడి కిడ్నాప్, హత్యకు అత్త చెప్పిన కారణం విని పోలీసులు కూడా షాక్ తినాల్సి వచ్చింది..
తాజావార్తలు
-
FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!
-
R Ashwin: ముందుగానే చెప్పాలి కదా.. ఇప్పుడు చెప్తే ఎలా.. బీసీసీఐపై అశ్విన్ ఫైర్!
-
Ragi Jaggery Cookies Recipe: మైదాకు గుడ్బై.. ఇంట్లోనే హెల్తీ రాగి-బెల్లం కుకీస్ తయారు చేయండిలా..
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ సెలబ్రేషన్స్.. రెండో ఈవెంట్కు ముఖ్య అతిథిగా నాగ చైతన్య ?
ట్రెండింగ్
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!