Minister Nara Lokesh: మనమంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం.. కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా ఆదుకుంటాం అని హామీ ఇచ్చారు మంత్రి నారా లోకేష్.. పాల్వాయిగేట్ ఈవీఎం ధ్వంసం ఘటనలో నంబూరి శేషగిరిరావు వీరోచితంగా పోరాడారని అభినందించారు.. నంబూరి శేషగిరిరావు కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని మాట్లాడిన మంత్రి లోకేష్.. శేషగిరిరావు కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.. మనమంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం అని, కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా ఆదుకుంటాం…
Fake Liquor Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో లింకులు ఎక్కడెక్కడో బయటపడుతున్నాయి. దీనికి డైరెక్షన్ అంతా జనార్దన్ రావ్.. ఏ2 నిందితుడు కట్టా రాజు ఇందులో కీ రోల్ పోషించాడు. తయారీ దగ్గర నుంచి అమ్మకాలు, కలెక్షన్లు, వాటాల పంపిణీ అంతా అతనే చూసుకునేవాడు. టీడీపీ నుంచి సస్పెన్షన్కు గురైన జయచంద్రారెడ్డికి మద్యం వాటా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆయన ఇంట్లో పనిచేసే అన్బురాసు.. అలియాస్ బాబు తీసుకునేవాడు. ఎక్సైజ్ అధికారుల…
Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు.. పవన్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ముందుగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రాజమండ్రి విమానాశ్రయం చేరుకోనున్న పవన్ కల్యాణ్.. అక్కడి నుంచి హెలికాప్టర్లో కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్కు వెళ్తారు. ఆ తరువాత నేరుగా కాకినాడ కలెక్టరేట్కు చేరుకుంటారు. దివీస్ ఫార్మా కంపెనీల నుంచి విడుదలయ్యే రసాయనాలతో ఉప్పాడ సముద్ర తీరం కలుషితమవుతోందని.. మత్స్య సంపద క్షిణించి జీవనోపాధి…
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఎట్టకేలకు జగన్ పర్యటనకు అనుమతిచ్చిన పోలీసులు.. వైసీపీ ప్రతిపాదించిన మార్గంలో కాకుండా కొత్త రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటల సమయంలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు జగన్. అక్కడ నుంచి NAD జంక్షన్, పెందుర్తి కూడలి మీదుగా అనకాపల్లి, తాల్లపాలెం నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ వరకు వెళ్లే…
* మహిళల వన్డే వరల్డ్ కప్: నేడు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా.. మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ వేదికగా మ్యాచ్ * ముంబైలో నేడు ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ సమావేశం.. వాణిజ్యం మరియు సాంకేతిక సంబంధాలపై చర్చ * హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లపై నేడు హైకోర్టులో విచారణ.. మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ చేయనున్న హైకోర్టు.. ఇవాళ మరిన్ని వాదనలు వినిపించనున్న ఏజీ * కాకినాడ: నేడు జిల్లాలో డిప్యూటీ…
Off The Record: తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెడ్బుక్కే హాట్ టాపిక్. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక కూడా చాలా రోజులు చర్చంతా దాని చుట్టూనే తిరిగింది. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమసు చేస్తున్నారని, దాని ప్రకారం తమ కేడర్ని తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ పెద్దలు. అందుకు కౌంటర్గా…. కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ని లాంఛ్ చేసింది వైసీపీ అధిష్టానం. వాళ్ళు ఎలాంటి ఆపదలో ఉన్నా,…
AP High Court: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం.. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) మోడల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది.. అయితే, దీనిపై పెద్ద దుమారమే రేగింది.. పీపీపీ మోడ్ అంటూనే మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేయడంటూ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించింది.. ఇక, ఈ వ్యవహారం ఏపీ హైకోర్టు వరకు చేరింది.. పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల అభివృద్ధిని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిల్…
CM Chandrababu: మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై దృష్టిసారించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ నెల 16వ తేదీన ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు నారా లోకేష్, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. సీఎస్, డీజీపీలు సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షకు…