AP Government: ఉద్యోగులకు దీపావళి కానుక.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు..
- పెంచిన 3.64 శాతం డీఏ పెంపు జనవరి 1, 2024 నుండి అమల్లోకి..
- 2 రోజుల క్రితం ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీ మేరకు జీవో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి రోజు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉద్యోగులు, పింఛనర్లకు దీపావళి కానుకను డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.. ఉద్యోగులకు డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కూటమి సర్కార.. ఇక, గత ఏడాది అంటే 2024 జనవరి 1వ తేదీ నుంచి డీఏ అలవెన్స్ను 3.64 శాతం పెంచుతూ ఆదేశాలిచ్చింది. అంటే, డీఏ పెంపు 2024 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ సర్కార్.. ఈ మేరకు ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు.. కొత్త డీఏతో పాటు సంబంధిత బకాయిలు కూడా త్వరలో విడుదల చేయనున్నట్టు పేర్కొంది ఏపీ ఆర్థికశాఖ..
Read Also: PM Modi: గోవాలో నౌకాదళంతో కలిసి మోడీ దీపావళి వేడుకలు
Also Read
- Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
- Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
- Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
- Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
కాగా, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏను ప్రకటించింది. నాలుగు పెండింగ్ డీఏలకు గాను ఒక డీఏను ఇవ్వడానికి ఒప్పుకుంది. నవంబర్ 1 నుంచి ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.. దీని కోసం ప్రతి నెలా రూ.160 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్న విషయం విదితమే. అలాగే, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ ను 180 రోజులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. రిటైర్ అయ్యేలోపు ఎప్పుడైనా ఈ చైల్డ్ కేర్ లీవ్ తీసుకునే అవకాశం కల్పించారు. అయితే, మొత్తం ఉద్యోగులకు కలిసి రాష్ట్ర రెవెన్యూలో 99.50 శాతం జీతభత్యాలకు పోతోంది అన్నారు. రూ. 51,200 కోట్లు ఉద్యోగుల జీతాలకు ఖర్చు చేయాల్సి వస్తుంది.. దాపరికం ఏమీ లేదు, ఎవరినీ పట్టించుకోని పరిస్థితి లేదు.. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదన్నారు. ఈ ఏడాది రూ. 51, 400 కోట్లు రాష్ట్ర ఆదాయం అయితే రూ. 51, 200 కోట్లు జీతాల రూపేణా ఇచ్చామన్నారు. మన రాష్ట్రంలో 99 శాతం రెవెన్యూ HR కే వెళ్తుందన్నారు. రాష్ట్రాల రెవెన్యూలో కేరళ 68 శాతం, తెలంగాణ 38 శాతం, తమిళనాడు 42, కర్ణాటక 38 శాతం జీతభత్యాలకు ఇస్తోంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించిన విషయం విదితమే.. కాగా, ఇప్పుడు 2024 జనవరి 1వ తేదీ నుంచి డీఏ అలవెన్స్ను 3.64 శాతం పెంచుతూ ఆదేశాలిచ్చింది ప్రభుత్వం.. డీఏ పెంపు 2024 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ సర్కార్..
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..