Home
Andhra Pradesh
Andhra Pradesh News
-
Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
నెల్లూరు జిల్లా కోడూరు బీచ్లో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. సముద్రంలో స్నానం చేస్తుండగా ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. గల్లంతైనవారిలో సుఫియాన్ అనే నాలుగేళ్ల బాలుడు మృతి చెందగా.. ఓ బాలికను జాలర్లు రక్షించారు. మరో బాలిక కోసం గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టారు. -
CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
CM Chandrababu : ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించిన ‘సంజీవని’, ‘అన్నదాతకు సాగునీటి పంపిణీ’ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కాపురం ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా చేయాలనేది ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ అని, ఆ హామీని నెరవేర్చి తమ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని స్పష్టం చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఒకే పార్లమెంటు నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా మార్చామని ఆయన వెల్లడించారు. తాము… -
CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తైతే దశాబ్దాల కరవు పోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మార్కాపురంలో వెలిగొండ ప్రాజెక్ట్ పనులను చంద్రబాబు పరిశీలించారు. అనంతరం దోర్నాల మండలం గంటావానిపల్లిలో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. -
Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్రావు ఫైర్..
Harish Rao: ఇటీవల కర్ణాటకలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చీకటి ఒప్పందాలు ఏంటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ప్రశ్నించారు. కర్ణాటకలో మూడు రాష్ట్రాల సీఎంలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను కూడా లోపలికి రానీయకుండా నలుగురే కూర్చుని ఏం ఒప్పందాలు చేసుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణకు తీవ్ర నష్టం కలిగించేలా కర్ణాటకలో నవేలి, ఏపీలో గుండ్రేవుల ప్రాజెక్టులు కడతామంటుంటే మన ముఖ్యమంత్రి చారిత్రక… -
Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
Jakkampudi Raja Protest: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో మరోసారి పొటికల్ హీట్ పెరిగింది.. రాజా నగరం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.. రాత్రి నుంచి కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు.. మల్లంపూడికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, ఆయన కుమారుడిని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ పోలీస్ స్టేషన్ బయటే నిరసనకు దిగారు.. అర్ధరాత్రి మట్టితవ్వకాల దగ్గర జరిగిన పెనుగులాటతో ఈ వివాదం తలెత్తింది.. అయితే, జనసేన కార్యకర్త… -
CM Chandrababu : రెండేళ్ల పాలన.. చంద్రబాబు ప్రోగ్రెస్ కార్డ్ రెడీ!
CM Chandrababu :ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ‘ప్రోగెస్ రిపోర్ట్ 2024-26’ పేరుతో విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులను ఆదేశించారు. 2024లో అధికారం చేపట్టిన వెంటనే గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసంపై ఇచ్చిన 7 శ్వేత పత్రాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టులా ఈ ప్రోగ్రెస్ రిపోర్టులు ఉండాలన్నారు. 7 శ్వేత పత్రాలతో పాటు… మరో 3 ముఖ్యమైన అంశాలపై ప్రోగ్రెస్ రిపోర్టుల… -
Sai Krishna: సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. దర్యాప్తులో సంచలన విషయాలు బట్టబయలు..
Sai Krishna: విజయవాడలో తీవ్ర కలకలం రేపుతున్న సాయికృష్ణ మృతి కేసు దర్యాప్తులో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో టాస్క్ఫోర్స్ పోలీసుల అక్రమ ప్రమేయంపై దర్యాప్తు బృందం పక్కా ఆధారాలను సేకరించింది. ముఖ్యంగా సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న మార్కాపురం టూ విజయవాడ ఎపిసోడ్ ఇప్పుడు ఈ విచారణలో అత్యంత కీలకంగా మారింది. ప్రకాశం జిల్లా మార్కాపురానికి విజయవాడ టాస్క్ఫోర్స్ ఎస్ఐ నవీన్తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు రహస్యంగా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ… -
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
Sai Krishna Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కేసులో ఏపీ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిజానిజాలను నిష్పక్షపాతంగా, వేగంగా వెలుగులోకి తీసుకురావడానికి వీలుగా ప్రభుత్వం ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి, ఐజీ రవి ప్రకాష్ను ఈ ప్రత్యేక 'సిట్' (SIT) చీఫ్గా ప్రభుత్వం నియమించింది. ఆయన సారథ్యంలో ఈ కేసు దర్యాప్తు సాగనుంది.… -
YS Jagan: ‘నాన్న చూపిన మార్గమే నాకు స్ఫూర్తి’.. ఫాదర్స్ డే వేళ వైఎస్ జగన్ ఎమోషనల్ పోస్ట్..
YS Jagan: ఫాదర్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని స్మరించుకుంటూ ఎంతో భావోద్వేగభరితమైన పోస్ట్ను పంచుకున్నారు. వైఎస్సార్తో ఉన్న అనుబంధాన్ని, ఆయన ద్వారా తాను నేర్చుకున్న జీవిత పాఠాలను వైఎస్ జగన్ ఈ ట్వీట్లో ఎంతో ఆత్మీయంగా గుర్తుచేసుకున్నారు. -
Chittoor: ‘ఆమె లేక నేను లేను’.. ప్రేమించిన అమ్మాయి సమాధి వద్దే ప్రియుడి ఆత్మహత్య..
Chittoor: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు నగరంలో తీవ్ర విచారకరమైన ఘటన వెలుగుచూసింది. ప్రేమించిన అమ్మాయి దూరం కావడాన్ని తట్టుకోలేక, ఆమె అంత్యక్రియలు జరిగిన సమాధి వద్దే ప్రియుడు ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ప్రేమించిన జంట ఇద్దరూ ఆత్మహత్యలకు పాల్పడటంతో చిత్తూరు తోటపాళ్యం పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. చిత్తూరు తోటపాళ్యం ప్రాంతానికి చెందిన దుర్గ (18), లోకేష్ (20) గత కొంతకాలంగా గాఢంగా ప్రేమించుకున్నారు. ఈ…
తాజావార్తలు
-
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
-
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
-
Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
-
CM Chandrababu : కుప్పం రైతులకు చంద్రబాబు బిగ్ గిఫ్ట్..!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!