* నేటి నుంచి టీ20 వరల్డ్ కప్ సమరం.. తొలి రోజే బరిలోకి టీమిండియా.. ముంబై వేదికగా రాత్రి 7 గంటలకు అమెరికాతో తలపడనున్న భారత్..
* నేడు దేశవ్యాప్తంగా రైడ్-హైలింగ్ డ్రైవర్ల సమ్మె.. ఓలా, ఉబర్, ర్యాపిడో సేవలు బంద్.. కనీస ఛార్జీల నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్..
* నేడు దేశవ్యాప్తంగా ఓలా, ఉబర్ డ్రైవర్ల స్ట్రైక్.. ఈ రోజు 6 గంటల పాటు “All India Breakdown” కు పిలుపు.. ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు స్ట్రైక్ జరిగే అవకాశం.. స్ట్రైక్ లో పాల్గొననున్న ఓలా, ఉబర్, రాపిడో డ్రైవర్లు.. యాప్ ఆధారిత క్యాబ్ డ్రైవర్ల ఆందోళనకు పిలుపు.. డ్రైవర్లు యాప్లను ఆఫ్ చేసి రైడ్స్కు నిరాకరణ.. పలు నగరాల్లో క్యాబ్ సర్వీసులు నిలిచే అవకాశం..
* అమరావతి: నేడు క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి శంకుస్థాపన.. ఉద్దండరాయునిపాలెంలో మధ్యాహ్నం 2.30 గంటలకు భూమిపూజ చేయనున్న సీఎం చంద్రబాబు.. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్న చంద్రబాబు
* నేడు వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన.. పరిగి మండలంలోని నారాయణపూర్లో “ ప్రజా పాలన- ప్రగతి బాట” బహిరంగ సభకు హాజరుకానున్న సీఎం.. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చెక్కులను అందజేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
* నేడు మంచిర్యాల , కొమురం భీం జిల్లాల్లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పర్యటన.. మంచిర్యాల కార్పోరేషన్ లో రోడ్ షో, కాగజ్ నగర్ మున్సిపాల్టీ లో బహిరంగ సభ. ఎన్నికల ప్రచారంలో ఫడ్నవీస్ తో పాటు పాల్గొననున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు .
* నేడు సిద్దిపేట జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన.. నర్మెట్టలోని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని పరిశీలించనున్న మంత్రి తుమ్మల
* సిద్దిపేట: నేడు గజ్వేల్ లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పర్యటన.. సాయంత్రం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ఎంపీ ఈటల
* నిజామాబాద్ : నేడు జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన.. భాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్.
* నేడు విజయవాడ దాసరి భవన్ లో ఉదయం 11 గంటలకు పౌర సంస్థల ఆధ్వర్యంలో రాష్ట్ర రాజకీయాలు – చట్టబద్ధ పాలన అనే అంశంపై చర్చా గోష్టి.. పాల్గొనున్న రిటైర్డ్ ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు పి.వి. రమేష్, విజయ్ కుమార్, జి.ఎస్.ఆర్.కె.ఆర్, ఉప్పులేటి దేవి ప్రసాద్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, శాసనమండలి సభ్యులుకె.ఎస్.లక్ష్మణరావులతోపాటు పలు పౌరసంస్థలు, ప్రజా సంఘాలు
* ఇవాళ విజయవాడకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖామంత్రి జితేంద్ర సింగ్.. కేంద్ర బడ్జెట్ పై స్ధానికంగా అవగాహన కార్యక్రమానికి రానున్న కేంద్రమంత్రి
* కర్నూలు: నేడు పత్తికొండలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రథోత్సవం.
* కర్నూలు : ఆదోని జిల్లా కోసం జేఏసీ నేతలు ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరహార దీక్షలు.. ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామాన్ని మండల కేంద్రంగా కొనసాగించాలని నిరవదిక నిరహార దీక్షలు.
* పల్నాడు జిల్లా: నేటి నుంచి రెండు రోజులపాటు కొండవీడు కోట ఉత్సవాలు.. కొంటవీడు ఫెస్ట్ కి ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం.. ఉత్సవాలను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఫెస్ట్ లో ప్రత్యేక ఆకర్షణగా కనువిందు హెలికాప్టర్ రైడింగ్, బోటింగ్, ఫ్లవర్ షో, క్రాకర్స్ షో, మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సారథ్యంలో కొండవీడు కోట ఉత్సవాలు