Home
Andhra Pradesh
Andhra Pradesh News
-
ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోంది : టీడీపీ ఎంపీ
దేశమంతా విద్యుత్ కొరత, కోతలున్నాయంటూ, ఏపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోంది అని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. బొగ్గు కొరత ఉందని.. కేంద్రం సరఫరా చేయడం లేదంటూ ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోంది. జగన్ భార్య భారతి నిర్వహణలో ఉన్న సండూర్ పవర్ నుంచి విద్యుత్ కొనడానికే ప్రభుత్వం ఏపీలో కృత్రిమ విద్యుత్ కొరత సృష్టించింది. సింగరేణి, మహానది కోల్ ఫీల్డ్స్ కు ప్రభుత్వం రూ.4,500 కోట్ల వరకు బకాయి పడింది. 2021 సెప్టెంబర్ 2న కేంద్ర… -
లైవ్: శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమాన్ని సందర్శించిన సీఎం జగన్
-
బెజవాడ రాజకీయం: కేశినేని భవన్లో చంద్రబాబు ఫొటోలు తొలగింపు…
బెజవాడ టీడీపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. బెజవాడ టీడీపీలో మళ్లీ లుకలుకలు మొదలయ్యాయి. బెజవాడలోని కేశినేని భవన్లో చంద్రబాబు ఫొటోలను తొలగించారు. చంద్రబాబు ఫొటోలతో పాటుగా, టీడీపీ నేతల ఫొటోలను కూడా తొలగించారు. గ్రౌండ్ ఫ్లోర్, ఆఫీసు లోపల ఉన్న పార్టీ నేతల ఫ్లెక్సీలను సిబ్బంది తొలగించారు. నేతల ఫొటోల స్థానంలో రతన్ టాటా ఫొటోలను ఉంచారు సిబ్బంది. ఇక ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు కేశినేని నాని దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎంపీగా మాత్రమే కొనసాగుతానని… -
బద్వేల్ ఉప ఎన్నిక : సీఎం జగన్ కీలక నిర్ణయం !
తిరుపతి ఉప ఎన్నికల వ్యూహాన్నే బద్వేల్లోనూ జగన్ కొనసాగించనున్నారా? ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటారా? ఇంతకీ బద్వేల్ విషయంలో వైసీపీ ఎలాంటి ప్లాన్ సిద్ధం చేసింది? తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా బహిరంగ సభ పెట్టాలని అప్పట్లో సీఎం జగన్ భావించినా కరోనా కారణంగా అది వాయిదా పడింది. దీంతో ఓటు వేయాలని నియోజకవర్గ ప్రజలకు లేఖల రూపంలో విజ్ఞప్తి చేశారాయన. అప్పట్లో ఆయన ప్రచారానికి వెళ్లకపోయినా అక్కడ మంచి మెజార్టీతో వైసీపీ గెలిచింది. ప్రస్తుతం బద్వేల్ ప్రచారానికి… -
సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ…
కర్నూలు : దేవరగట్టు బన్నీ ఉత్సవాల పై సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ రాశారు. కర్రల సమరంలో చాలా మంది తీవ్ర గాయాల పాయాలవుతున్నారని..కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని లేఖలో సీపీఐ రామకృష్ణ పేర్కొన్నారు. దేవరగట్టు ఉత్సవాలను శాంతిభద్రతల కోణంలో మాత్రమే చూడద్దని సూచించారు సీపీఐ రామకృష్ణ. ఉత్సవాలకు ఆ రెండు రోజులు బందోబస్తు మాత్రమే కాదని… నిత్యం ప్రజలకు నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆలూరు ప్రాంతంలో 100 శాతం అక్షరాస్యత సాధించాలని..… -
డ్వాక్రా సంఘాలను చంద్రబాబు మోసం చేసాడు : కొడాలి నాని
చంద్రబాబు ఒక పగటి వేషగాడు… పిట్టలదొర అని మంత్రి కొడాలి నాని అన్నారు. డ్వాక్రా సంఘాలను తనే ప్రవేశపెట్టానని చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతున్నాడు. 2014లో అధికారంలోకి రావడానికి డ్వాక్రా సంఘాలను అడ్డం పెట్టుకున్నాడు. డ్వాక్రా సంఘాలను మోసం చేసిన గజమోసగాడు చంద్రబాబు అని తెలిపారు. చంద్రబాబు సారధ్యంలో కొందరు దొంగలు ఇప్పటికే పర్యటనలు మొదలు పెట్టారు. దేవినేని ఉమా సొల్లు కబుర్లు చెబుతుంటాడు. నేను , వంశీ ఫోన్లు చేసినా ఎత్తడు..మా ఫోన్లు బ్లాక్ లో… -
టీడీపీలాగా జన్మభూమి కమిటీలతో మాకు పనిలేదు…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆసరా వారోత్సవాలు కొనసాగుతున్నాయి. కృష్ణ జిల్లా గొల్లపూడిలో ఘనంగా ఆసరా వారోత్సవాలు చెప్పటింది ప్రభుత్వ యంత్రాంగం. దీనికి మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. అయితే అక్కడ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ… గడచిన మూడున్నర దశాబ్ధాల్లో ఒక్క గజం స్థలం కూడా పేదలకు ఇవ్వలేదు. పసుపు జెండాలుంటేనే పథకాలిచ్చారు. టీడీపీలాగా జన్మభూమి కమిటీలతో మాకు పనిలేదు అని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో… -
దళితుల భూములకు రక్షణ లేదు : అచ్చెన్నాయుడు
దళితులను అణచివేయడమే వైసీపీ నైజంగా కనిపిస్తోంది అని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం మద్దలకట్టలో దళితులపై వైసీపీ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. జగన్ పాలనపై ఎస్సీలు వ్యతిరేకంగా ఉన్నారనే దాడులు చేసి బెదిరిస్తున్నారు. పరిషత్ ఎన్నికల్లో వైసీపీ నేతలు ఓడిపోతే దానికి దళితులు కారణం అవుతారా అని ప్రశ్నించారు. సొంత నియోజకవర్గంలో ఎస్సీలపై దాడులు చేస్తుంటే విద్యాశాఖ మంత్రి సురేష్ ఏం చేస్తున్నారు అని అడిగారు. వైసీపీలోని ఓ… -
శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద…
రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొంచెం తగ్గడంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కాస్త తగ్గింది. దాంతో జలాశయం రేడియల్ క్రేస్ట్ గేట్లు మూసేసారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 72,852 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 65,441 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 884.70 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 213.8824 టీఎంసీలు ఉంది. అయితే… -
ఏపీ కరోనా అప్డేట్.. భారీగా తగ్గిన కేసులు..
కరోనా కొత్త కేసులపై దసరా పండుగ ప్రభావం స్పష్టంగా కనిపించింది.. దేశవ్యాప్తంగా ఇవాళ కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.. దీనికి ప్రధాన కారణం టెస్ట్ల సంఖ్య తగ్గడమే.. ఇక, ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. ఏపీలోనూ టెస్ట్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది.. కొత్త కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి.. బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 29,243 శాంపిల్స్ పరీక్షించగా.. 332 మందికి పాజిటివ్గా తేలింది.. మరో ఏడుగురు కోవిడ్…
తాజావార్తలు
-
Rat Control Tips: ఎలుకలకు భయం పుట్టించే ఐదు వాసనలు ఇవే.. సింపుల్ చిట్కాలు ట్రై చేయండి
-
Anirudh Reddy : తెలంగాణలో పోటీకి సిద్ధమా.? అనిరుధ్ రెడ్డి రాజకీయ సవాల్
-
US: అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్గా విలియం జె.పుల్టే నియామకం.. ట్రంప్ అభినందనలు
-
YS Jagan: వైద్యులతో వైఎస్ జగన్ భేటీ.. సంక్షోభంలో పేదల వైద్యం..!
-
Maharashtra: ఆర్మీ ట్రైనింగ్ స్కూల్లో ఇంట్రెస్టింగ్ సీన్.. ప్రేయసికి ప్రపోజ్ చేసిన కెప్టెన్.. రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!