1) రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు.. నేడు రాజ్యసభ ప్రతిపక్షనేతల సమావేశం.. ఎంపీల సస్పెన్షన్పై తదుపరి కార్యాచరణ2) హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం, రక్తదానం చేసినవారికి నేడు ఉచితంగా తిరుగుప్రయాణ బస్సు సర్వీసు3) టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశం… ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ4) తిరుపతి: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, సొసైటీ ఉద్యోగులకు టీటీడీ కార్పొరేషన్ ప్రక్రియను నిలిపివేయాలని నేడు మహాధర్నా5) తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ధ్వజారోహణం6) నేడు…
చంద్రబాబు విమర్శలకు సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. ఆ పెద్ద మనిషివి బురద రాజకీయాలు అని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. గతంలో కంటే… ఇప్పుడు వరద బాధితులకు తొందరగా సహాయాన్ని అందించగలిగారని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు అన్నిరకాలుగా నష్టపరిహారాన్ని అందించామని… గతంలో ఇల్లు ధ్వంసమైతే పరిహారం అందడానికి నెలరోజులు పట్టేదని చంద్రబాబుకు చురకలు అంటించారు. దురదృష్టవశాత్తూ ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి పరిహారం ఇవ్వాలంటే నెలరోజులు పట్టేదని… గల్లైంతైన వారికి ఎలాంటి పరిహారం ఇచ్చేవారు కాదని ఫైర్…
కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఏపీ, తెలంగాణలోని పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో ఆలయాల్లో మహిళలు దీపాలు వెలిగిస్తున్నారు. అయితే గుంటూరు జిల్లా తెనాలిలో కార్తీక దీపారాధనలో అపశ్రుతి చోటు చేసుకుంది. తెనాలి మండలం చినరావూరులోని పోతురాజు స్వామి ఆలయంలో దీపాలు వెలిగిస్తుండగా… వైకుంఠపురానికి చెందిన గుడివాడ సుహాసిని అనే మహిళ చీరకు ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయి. వెంటనే స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పివేసినా అప్పటికే ఆమె శరీరం సగానికి పైగా కాలిపోయింది.…
శ్రీవారి ఆలయ వోఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం చెందారు. విశాఖపట్నంలో కార్తీక దిపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. ఇవాళ వేకువజామున గుండెపోటు రావడంతో కన్నుమూశారు.. సుదీర్ఘ సమయం శ్రీవారి సేవలో తరించిన భాగ్యం ఆయనకే దక్కింది.. 1978 నుంచి డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలో ఉన్న ఆయన.. 2007లో రిటైర్ అయినా.. శేషాద్రి సేవలు తప్పనిసరికావడంతో వోఎస్డీగా టీటీడీ కొనసాగించింది.. ఆయన జీవితంలో చివరి క్షణాల వరకు శ్రీవారి సేవలోనే ఉన్నారు.. ఇక, ఆయన మృతికి…
ఏపీ సీఎం జగన్పై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఆదివారం ఓ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ కాన్వాయ్ను తమ సమస్యల పరిష్కారం కోసం అడ్డుకునేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘాలను అరెస్ట్ చేయడాన్ని లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం ఎందుకంటూ ఏపీ సర్కారుపై లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. సమస్యలపై…
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆదివారం నాడు జూ.ఎన్టీఆర్ అభిమానులు ధర్నా చేయడం స్థానికంగా చర్చకు దారితీసింది. అయితే ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ నేతలకు వ్యతిరేకంగా ధర్నా చేయడం హాట్టాపిక్గా మారింది. ఇటీవల ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నందమూరి ఫ్యామిలీతో పాటు జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి హీరోలు కూడా స్పందించారు. జూ.ఎన్టీఆర్ ఓ వీడియో ద్వారా అసెంబ్లీలో జరిగిన ఘటనను సున్నితంగా ఖండించాడు. అతడు…
అమరావతి రైతుల మహాపాదయాత్రకు అనూహ్యంగా సంఘీభావం తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి.. న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ నవంబర్ 1వ తేదీన మహా పాదయాత్రను ప్రారంభించారు రైతులు.. 45 రోజుల పాటు నిర్వహించాలని.. డిసెంబర్ 15వ తేదీకి తిరుమలకు చేరుకోవాలని నిర్ణయించుకున్నారు.. రాజధాని రైతుల మహా పాదయాత్రకు ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలుపుతూ వస్తున్నాయి.. అయితే, ఈ పాదయాత్రకు వైసీపీ నేతలు రాజకీయాలను అంటగడుతూ వచ్చారు.. కానీ, ఇవాళ వైసీపీ…
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ను భారీ వర్షాలు, వరదలు అతలా కుతలం చేశాయి.. మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.. దీంతో.. అప్రమత్తం అవుతోంది ఏపీ సర్కార్.. ముఖ్యంగా నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలపై వీటి ప్రభావం ఎక్కువగా ఉండడంతో… ఇవాళ ఉదయం 11 గంటలకు చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాలకు చెందిన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు సీఎం వైఎస్ జగన్.. మరోవైపు.. ఇప్పటికే తుఫాన్ మిగిల్చిన నష్టంపై కేంద్ర…
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. దీంతో ఆయనకు పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన మృతిపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. డాలర్ శేషాద్రితో శారదా పీఠానికి సుదీర్ఘకాలం అనుభవం ఉంటుందన్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించిన ప్రతి ఒక్కరికీ డాలర్ శేషాద్రి సుపరిచితులు అని స్వరూపానందేంద్ర అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది డాలర్ శేషాద్రి ఆప్యాయతను పొందారని.. ఆయన హఠాన్మరణం తన హృదయాన్ని కలచివేసిందని తెలిపారు.…
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా వైపు పయనిస్తోందని కాగ్ నివేదిక చెబుతున్నందున.. ఇప్పటికైనా మేధావులు స్పందించాలని అమరావతి ఛార్టర్డ్ అకౌంటెంట్స్ సంఘం కోరింది. రానున్న తరాలకు ఆస్తులకు బదులు అప్పులు ఇచ్చే దుస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న అప్పులు మూల వ్యయాలకు కాకుండా.. రోజువారీ ఖర్చులకు సరిపోతున్నాయని, అప్పులు చెల్లించడానికి ప్రభుత్వం తిరిగి అప్పులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అమరావతి ఛార్టర్డ్ అకౌంటెంట్స్ సంఘం అధ్యక్షుడు నేతి ఉమామహేశ్వరరావు…