వైసీపీ నేతలకు నారా భువనేశ్వరి కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల కామెంట్లకు స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి.. ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఆమె.. తిరుపతిలో వర్షాలు, వరదలతో మృతిచెందినవారి కుటుంబాలను పరామర్శించారు.. 48 కుటుంబాలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరపున లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందించారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నారా భువనేశ్వరిని.. అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, వైసీపీ నేతలు చేసిన కామెంట్లపై ప్రశ్నించారు. రాజకీయాలు నేను మాట్లాడను అంటూనే వైసీపీకి కౌంటర్ ఇచ్చారు భువనేశ్వరి..
Read Also: ఒమిక్రాన్ కల్లోలం.. అక్కడ 12 మంది మృతి..
Also Read
ఆడపిల్లలంటే ఆట వస్తువులు కాదంటూ వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చిన నారా భువనేశ్వరి.. పనిలేక మాపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.. సమాజానికి ఉపయోగం లేని విమర్శలెందుకు? అని ప్రశ్నించిన ఆమె.. అతి పెద్ద రాష్ట్రాన్ని నా భర్త ఏ విధంగా అభివృద్ధి చేశారో నాకు తెలుసన్నారు.. రాత్రింబవళ్లు నిద్ర లేకుండా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తుచేసుకున్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉండాలి… ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. నా భర్త పనితీరు ఏంటో ప్రజలకు తెలుసు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శలను పట్టించుకోం.. బాధపడమని.. ప్రజాసేవకే అంకితమవుతామని వెల్లడించారు నారా భువనేశ్వరి. కాగా, అసెంబ్లీలో వైసీపీ నేతల కామెంట్లు.. నా భార్యను అవమానించారంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కంటతడిపెట్టడం.. ఇక, టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!