‘నగరి’లో గ్రూప్ వార్.. జగనన్న బర్త్ డే ఫ్లెక్సీలోనూ రాజకీయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య హైఓల్టేజ్ వార్ నడుస్తూనే ఉంది.. ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే పలు సందర్భాల్లో గ్రూప్ వారు రోడ్డెక్కి రచ్చగా మారిన సందర్భాలు లేకపోలేదు.. తాజాగా మరోసారి అదే జరిగింది.. ఇప్పుడు పార్టీ సుప్రీం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు నేపథ్యంలో.. మరోసారి గ్రూప్ వార్ బయటపడింది.. ఎమ్మెల్యే ఆర్కే రోజా వర్సెస్ ఆమె వ్యతిరేక వర్గంగా మారింది పరిస్థితి… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్లెక్సీలను ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే రోజా వ్యతిరేకవర్గం…
Read Also: ఏపీలో రూ.50కే కిలో మటన్..! ఎందుకో తెలుసా..?
Also Read
అయితే, మేం ఏర్పాటు చేసిన ప్లెక్సీలు చింపేశారంటూ డీఎస్పీ కార్యాలయం వద్ద రోజా వ్యతిరేకవర్గం ఆందోళనకు దిగింది… ఆర్కే రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు.. ధర్నా చేపట్టిన అమ్ములు సహా పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. కాగా, ఇప్పటికే నగరిలో పలు సందర్భాల్లో అంతర్గత విభేదాలు బహిర్గతం అయ్యాయి.. స్థానిక ఎన్నికల సమయంలోనూ అధికార పార్టీ నేతలు రెండుగా విడిపోయి రచ్చచేసిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
-
Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!