ఏపీ సీఎం జగన్కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు జగన్ 49వ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ ద్వారా పవన్ విషెస్ తెలియజేశారు. జగన్కు సంపూర్ణ ఆయురారోగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ నేతలకు, పవన్ కళ్యాణ్ మధ్య వార్ జరుగుతున్న సమయంలో పవన్ స్వయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఏపీ సీఎం జగన్కు…
రాజధాని వికేంద్రీకరణ, అమరావతిపై మంత్రి కొడాలి నాని కామెంట్స్ చేశారు. సెక్రటరియేట్ విశాఖలో, హై కోర్టు కర్నూలులో ఏర్పాటు చెయ్యక తప్పదని… అమరావతి కూడా ఉంటుందని క్లారిటీఇచ్చారు. మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసమే రాజదాని వికేంద్రీకరణ అని… అమరావతి అందరిది అంటున్న వాడు అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టుల ద్వారా అడ్డుకున్నారని చెప్పారు. అమరావతి పరిరక్షణకు పాదయాత్ర చేసి వెంకటేశ్వర స్వామినీ పూజిస్తే, పరమేశ్వరుడు ఉండే అమరావతిని ఆయన ఆశీర్వదిస్తారని… కానీ రియల్…
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనురాధ విరుచుకుపడ్డారు. చిత్తూరు జిల్లా నగరిలో రోజాను వైసీపీ కార్యకర్తలే ఛీ కొడుతుంటే పారిపోయి తమ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి రోజా మాట్లాడటం సిగ్గుచేటు అని అనురాధ ఆరోపించారు. వైసీపీ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఫస్ట్రేషన్తో రోజా తమ మేడమ్పై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోందని.. రోజా నాలుక తెగ్గోస్తామని హెచ్చరించారు. సూర్పణఖకు పట్టిన గతే రోజాకు టీడీపీ మహిళలు పట్టిస్తారని గుర్తుపెట్టుకోవాలని హితవు…
నారా భువనేశ్వరి పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కూతురుగా నారా భువనేశ్వరి పై గౌరవం ఉందని.. అనని మాటలు గురించి మాట్లాడి.. ఆ గౌరవాన్ని చెడగొట్టు కోకండంటూ కౌంటర్ ఇచ్చారు. ఎవరి పాపాన ఎవరు పోయారో అందరికీ తెలుసని… చంద్రబాబు చేసిన పాపలకు పోయిన ఎన్నికలలో 23 సీట్లు పరిమితం చేశారని చురకలు అంటించారు. అసెంబ్లీ నన్ను ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టించారు…ఎంతో అవమానానికి గురి చేశారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు…
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్ మొదటిసారి 2009లో కడప పార్లమెంట్ నియోజక వర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. అయితే, 2009 సెప్టెంబర్ 2 వ తేదీన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత వైఎస్ జగన్ ఒదార్పు యాత్ర చేసేందుకు సంకల్పించారు. కాంగ్రెస్ పార్టీ అందుకు అనుమతించకపోవడంతో విభేదించి 2011, మార్చి 11 వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో…
కరోనా తరువాత విశాఖలో విమానయాన రంగం సేవలు క్రమంగా పుంజుకుంటున్నాయి. స్పైస్ జెట్, స్కూట్ ఎయిర్ సర్వీసులు తిరిగి ప్రారంభం అయ్యాయి. జనవరి 1 నుంచి విశాఖ-తిరుపతి, కోల్కతా-విశాఖ స్పైస్ జెట్ విమానాలు నడవబోతున్నాయి. అదేవిధంగా డిసెంబర్ 29 నుంచి విశాఖ-సింగపూర్ మధ్య స్కూట్ ఎయిర్ సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. Read: నేడు తణుకులో సీఎం జగన్ పర్యటన… దీనికి సంబంధించిన టికెట్ల విక్రయాలను విమానయాన సంస్థలు ప్రారంభించింది. కరోనా మహమ్మారి సమయంలో ఈ సర్వీసులను…