High Court: టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో టీటీడీ ఈవోకు నెల రోజుల జైలు, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు చెప్పారు. అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం స్టే విధించింది. తమను క్రమబద్ధీకరించేలా టీటీడీ ఈవోను ఆదేశించాలంటూ ముగ్గురు ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన సింగిల్ జడ్జి ధర్మాసనం ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు…
Bandi Srinivasrao: ఏపీ ప్రభుత్వం ఇంకా జీతాలు ఇవ్వకపోవడంపై ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగులు నెలంతా పని చేస్తే 31 తేదీన జీతం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కూలీ కన్నా దారుణంగా ఉందని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు పాలు, కూరగాయల, బ్యాంకుల వాళ్ళ వద్ద కూడా లోకువ అయ్యే పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు. బ్యాంకులు కూడా ఉద్యోగులకు రుణాలు ఇవ్వని పరిస్థితి…
Gadapa Gadapaku Work Shop: గడప గడపకు మన ప్రభుత్వంపై అమరావతి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వర్క్ షాప్ జరుగుతోంది. సీఎం జగన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జులు, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేల పని తీరుపై సీఎం జగన్కు నివేదికలు అందాయి. ఎమ్మెల్యేల పనితీరుపై ఐప్యాక్ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజంటేషన్…
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో విశాఖ అభివృద్ధికి నెమ్మదిగా అడుగులు పడుతున్నాయి. మరోవైపు కేంద్రం కూడా విశాఖలో పలు ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు విశాఖలో బయోటెక్నాలజీ పార్కు ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు వచ్చాయని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. త్వరలోనే ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతామని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. దేశవ్యాప్తంగా 8 బయో టెక్నాలజీ పార్కులను ఏర్పాటు…
Anakapalle: ఏపీలోని అనకాపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. యువతిపై ఓ యువకుడు కోడికత్తితో దాడి చేశాడు. అడ్డువచ్చిన ఆమె తల్లిపైనా ఇనుపరాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. అచ్యుతాపురం మండలంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నాలుగేళ్లుగా రాంబిల్లి మండలం గజిరెడ్డిపాలెంకు చెందిన నానాజీ అనే యువకుడు ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్నాడు. నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట పడుతున్నాడు. అయితే నానాజీ ప్రేమను ఆ యువతి నిరాకరించింది. Read Also: Kidney Rocket Cheating: డొనేషన్ పేరుతో…
Andhra Pradesh: 2023 ఏడాదికి గానూ సెలవుల క్యాలెండర్ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రభుత్వ కార్యాలయాలకు 23 సాధారణ సెలవులు, 22 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. సాధారణ సెలవుల్లో మూడు ఆదివారాలు, ఒకటి రెండో శనివారం.. ఐచ్ఛిక సెలవుల్లో నాలుగు ఆదివారాలు వచ్చాయి. మకర సంక్రాంతి, దుర్గాష్టమి, దీపావళి ఆదివారాల్లో.. సాధారణ సెలవుల్లో వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నతాధికారుల అనుమతితో ఐదు ఐచ్ఛిక సెలవులను పొందేందుకు వీలు కల్పించింది. రంజాన్, బక్రీద్, మొహర్రం,…
What’s Today: * నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభం.. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో నేటి నుంచి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం.. జనవరి 14 వరకు కొనసాగనున్న ఉత్సవాలు * అమరావతి: ఈరోజు ఉదయం 11 గంటలకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై నేడు సీఎం జగన్ సమీక్ష.. హాజరుకానున్న మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు.. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్కు చేరిన నివేదికలు * తెలంగాణలో నేటి నుంచి 1,392 జూనియర్ లెక్చరర్…
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, జనసేన నెంబర్ టు నాదెండ్ల మనోహర్ భేటీ.. పొలిటికల్ సర్కిళ్లలోనే కాదు.. సామాన్య ప్రజల్లోనూ పెద్ద చర్చ జరుగుతోంది. బీజేపీతోపాటు.. ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కన్నా.. అంత ఈజీగా మీడియాలో ఫోకస్ అవ్వాలన్న ఆలోచన చేయరు. అదే విధంగా జనసేన PAC చైర్మన్గా ఉన్న మనోహర్ సైతం ఇంటర్నల్ వ్యవహారాలు మీడియా ముందు ఉంచరు. అలాంటి ఇద్దరు నేతలు హఠాత్తుగా భేటీ అవ్వడం..…