Off The Record about Narasaraopet MP: ఎంపీ సిట్టింగ్ సీటుకు ఎసరు..? సీటు మార్చే పనిలో వైసీపీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంటు వైసీపీ సీటు వ్యవహారం ఉత్కంఠగా మారుతోంది. గడిచిన ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా వైసీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు గెలిచారు. నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు వైసీపీ ఖాతాలో పడటం.. భారీగా ఎమ్మెల్యేలకు మెజార్టీ రావడంతో ఎంపీగా కృష్ణదేవరాయలు విజయం నల్లేరు మీద నడకలా సాగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీకి అక్కడ ఇబ్బందికర పరిస్థితులు రావచ్చట. దీంతో అధిష్టానం విషయాన్నీ గ్రహించి ఆయన్ను నరసరావుపేట నుంచి మారాలని చెబుతోందట. సిట్టింగ్ సీటును వదిలి వేసి.. గుంటూరులో పోటీ చేయాలని కోరిందట. అయితే తనను తొలిసారి గెలిపించిన నరసరావుపేటను వదిలేది లేదని భీష్మించు కూర్చున్నారట శ్రీకృష్ణదేవరాయలు. ఇదే విషయం ప్రస్తుతం పేట పరిసర నియోజకవర్గలలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతుంది.
Read Also: Off The Record about Yanamala Brothers: యనమల సోదరుల మధ్య టికెట్ రగడ..!
Also Read
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
2019 వరకు క్లీన్ ఇమేజ్ ఉన్న శ్రీకృష్ణదేవరాయలు స్థానిక నాయకులతో కూడా చక్కగా కలిసి పనిచేశారు. తర్వాత పార్లమెంటు పరిధిలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలతో ఎంపీకి సఖ్యత లేదు. వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, చిలకలూరిపేట ఎమ్మెల్యే, మంత్రి విడదల రజనితో ఎంపీకి పడటం లేదు. ఆ విషయం అనేకసార్లు రుజువైంది. ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అనుమతి లేకుండా ఎంపీ కాలు పెట్టే పరిస్థఙతి కూడా లేదు. రజనీ ఎంపీ వర్గాల మధ్య గొడవలు కూడా జరిగాయి. ఇక బ్రహ్మనాయుడు ఎంపీ పేరు చెబితే ఫైర్ అవుతున్నారు. ఇలాంటి గొడవలు ప్రస్తుతం పెద్ద ప్రమాదం కాకపోయినా.. ఎన్నికల్లో వేళ సీన్ మారే అవకాశం ఉంది.
వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో గత ఎన్నికల్లో ఓడిన గుంటూరు సహా మూడు పార్లమెంట్ సెగ్మెంట్లలో గెలవాలన్నది వైసీపీ ఆలోచన. అందుకే ఎందుకు ఛాన్స్ తీసుకోవడం అని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు నుంచి పోటీ చేయమని చెప్పిందట అధిష్టానం. ముఖ్యంగా వినుకొండ, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో ఎంపీకి వ్యతిరేకంగా ఓటుపడే ప్రమాదం ఉందనేది అధిష్టానం అనుమానం అట. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. బహిరంగంగానే మంత్రి విడదల రజనీకి, శ్రీకృష్ణదేవరాయలకు.. అదే విధంగా వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకు శ్రీకృష్ణదేవరాయలకు పెద్ద ఎత్తున వివాదాలు జరిగాయి. మీడియా ముఖంగా కామెంట్లు, గొడవలు చేసుకునే పరిస్థితికి కూడా వెళ్లింది. ఇలాంటి పరిస్థితుల్లో కచ్చితంగా శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట నుంచి పోటీ చేస్తే ఆ రెండు సెగ్మెంట్లలో క్రాస్ ఓటింగ్ ప్రమాదం ఉందనేది అధిష్టానం భయం అట. దీని నుంచి గట్టెక్కాలంటే ఎంపీను పేట వదిలి పెట్టక తప్పదు అనే ప్రచారం ఉంది. దీనిపై ఎంపీ ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది ప్రశ్న. రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సఖ్యత లేదన్న కారణం తప్ప ఏ ఆరోపణ లేని ఎంపీగా మళ్లీ అక్కడే కొనసాగడానికి అధిష్ఠానాన్ని ఒప్పిస్తారా లేక హైకమాండ్ చెప్పిన మాట వింటారా అనేది సస్పెన్స్గా మారింది.
రాజకీయాల్లో గెలుపు కావాలంటే ఒకటి రెండు ఓట్లైనా తీవ్ర ప్రభావం చూపిస్తాయి. 2019 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ ఫలితాలు చూసుకుంటే ఆ విషయం బోధపడుతుంది. కేవలం ఐదువేలలోపు ఓట్లతో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గెలిచారు. అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు నష్టం చేయకున్నా.. గతంలో జరిగిన విషయాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ల అనుచరులు క్రాస్ ఓటింగ్ చేస్తే అది వైసీపీ గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాత్రం నరసరావుపేట నుంచి పోటీ చేస్తానని అనుచరులతో చెబుతున్నారట. తన లెక్కలు తాను వేసుకుంటున్నారట. క్రాస్ ఓటింగ్ ప్రమాదం తనకు లేదని స్పష్టం చేస్తున్నారట. నరసరావుపేటలో ప్రచారం జరుగుతున్నట్లుగా ఒకవేళ టిడిపి బీసీ అభ్యర్థిని బరిలోకి దించితే టీడీపీలోని కమ్మ సామాజిక వర్గం ఓట్లు చీలి తనకు కలిసి వస్తుందన్న ధీమాతో ఉన్నారట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. సొంత పార్టీ వాళ్లు దెబ్బకొట్టినా ప్రత్యర్థి ఓట్ల చీలికతో బయటపడతా అంటున్నారట. అయితే ఒక ఎంపీ లెక్కల కంటే అధిష్ఠానం వేసే ఎత్తుగడలే ముఖ్యం. ఈ విషయంపై వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఎంపీ ఎలాంటి అడుగులు వేస్తారో అనే టెన్షన్ పల్నాడులో నెలకొని ఉంది.
తాజావార్తలు
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
Karuppu : కరుప్పు రిలీజ్ కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్
-
Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!