Off The Record about Narasaraopet MP: ఎంపీ సిట్టింగ్ సీటుకు ఎసరు..? సీటు మార్చే పనిలో వైసీపీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంటు వైసీపీ సీటు వ్యవహారం ఉత్కంఠగా మారుతోంది. గడిచిన ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా వైసీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు గెలిచారు. నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు వైసీపీ ఖాతాలో పడటం.. భారీగా ఎమ్మెల్యేలకు మెజార్టీ రావడంతో ఎంపీగా కృష్ణదేవరాయలు విజయం నల్లేరు మీద నడకలా సాగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీకి అక్కడ ఇబ్బందికర పరిస్థితులు రావచ్చట. దీంతో అధిష్టానం విషయాన్నీ గ్రహించి ఆయన్ను నరసరావుపేట నుంచి మారాలని చెబుతోందట. సిట్టింగ్ సీటును వదిలి వేసి.. గుంటూరులో పోటీ చేయాలని కోరిందట. అయితే తనను తొలిసారి గెలిపించిన నరసరావుపేటను వదిలేది లేదని భీష్మించు కూర్చున్నారట శ్రీకృష్ణదేవరాయలు. ఇదే విషయం ప్రస్తుతం పేట పరిసర నియోజకవర్గలలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతుంది.
Read Also: Off The Record about Yanamala Brothers: యనమల సోదరుల మధ్య టికెట్ రగడ..!
Also Read
- OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
2019 వరకు క్లీన్ ఇమేజ్ ఉన్న శ్రీకృష్ణదేవరాయలు స్థానిక నాయకులతో కూడా చక్కగా కలిసి పనిచేశారు. తర్వాత పార్లమెంటు పరిధిలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలతో ఎంపీకి సఖ్యత లేదు. వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, చిలకలూరిపేట ఎమ్మెల్యే, మంత్రి విడదల రజనితో ఎంపీకి పడటం లేదు. ఆ విషయం అనేకసార్లు రుజువైంది. ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అనుమతి లేకుండా ఎంపీ కాలు పెట్టే పరిస్థఙతి కూడా లేదు. రజనీ ఎంపీ వర్గాల మధ్య గొడవలు కూడా జరిగాయి. ఇక బ్రహ్మనాయుడు ఎంపీ పేరు చెబితే ఫైర్ అవుతున్నారు. ఇలాంటి గొడవలు ప్రస్తుతం పెద్ద ప్రమాదం కాకపోయినా.. ఎన్నికల్లో వేళ సీన్ మారే అవకాశం ఉంది.
వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో గత ఎన్నికల్లో ఓడిన గుంటూరు సహా మూడు పార్లమెంట్ సెగ్మెంట్లలో గెలవాలన్నది వైసీపీ ఆలోచన. అందుకే ఎందుకు ఛాన్స్ తీసుకోవడం అని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు నుంచి పోటీ చేయమని చెప్పిందట అధిష్టానం. ముఖ్యంగా వినుకొండ, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో ఎంపీకి వ్యతిరేకంగా ఓటుపడే ప్రమాదం ఉందనేది అధిష్టానం అనుమానం అట. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. బహిరంగంగానే మంత్రి విడదల రజనీకి, శ్రీకృష్ణదేవరాయలకు.. అదే విధంగా వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకు శ్రీకృష్ణదేవరాయలకు పెద్ద ఎత్తున వివాదాలు జరిగాయి. మీడియా ముఖంగా కామెంట్లు, గొడవలు చేసుకునే పరిస్థితికి కూడా వెళ్లింది. ఇలాంటి పరిస్థితుల్లో కచ్చితంగా శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట నుంచి పోటీ చేస్తే ఆ రెండు సెగ్మెంట్లలో క్రాస్ ఓటింగ్ ప్రమాదం ఉందనేది అధిష్టానం భయం అట. దీని నుంచి గట్టెక్కాలంటే ఎంపీను పేట వదిలి పెట్టక తప్పదు అనే ప్రచారం ఉంది. దీనిపై ఎంపీ ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది ప్రశ్న. రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సఖ్యత లేదన్న కారణం తప్ప ఏ ఆరోపణ లేని ఎంపీగా మళ్లీ అక్కడే కొనసాగడానికి అధిష్ఠానాన్ని ఒప్పిస్తారా లేక హైకమాండ్ చెప్పిన మాట వింటారా అనేది సస్పెన్స్గా మారింది.
రాజకీయాల్లో గెలుపు కావాలంటే ఒకటి రెండు ఓట్లైనా తీవ్ర ప్రభావం చూపిస్తాయి. 2019 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ ఫలితాలు చూసుకుంటే ఆ విషయం బోధపడుతుంది. కేవలం ఐదువేలలోపు ఓట్లతో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గెలిచారు. అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు నష్టం చేయకున్నా.. గతంలో జరిగిన విషయాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ల అనుచరులు క్రాస్ ఓటింగ్ చేస్తే అది వైసీపీ గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాత్రం నరసరావుపేట నుంచి పోటీ చేస్తానని అనుచరులతో చెబుతున్నారట. తన లెక్కలు తాను వేసుకుంటున్నారట. క్రాస్ ఓటింగ్ ప్రమాదం తనకు లేదని స్పష్టం చేస్తున్నారట. నరసరావుపేటలో ప్రచారం జరుగుతున్నట్లుగా ఒకవేళ టిడిపి బీసీ అభ్యర్థిని బరిలోకి దించితే టీడీపీలోని కమ్మ సామాజిక వర్గం ఓట్లు చీలి తనకు కలిసి వస్తుందన్న ధీమాతో ఉన్నారట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. సొంత పార్టీ వాళ్లు దెబ్బకొట్టినా ప్రత్యర్థి ఓట్ల చీలికతో బయటపడతా అంటున్నారట. అయితే ఒక ఎంపీ లెక్కల కంటే అధిష్ఠానం వేసే ఎత్తుగడలే ముఖ్యం. ఈ విషయంపై వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఎంపీ ఎలాంటి అడుగులు వేస్తారో అనే టెన్షన్ పల్నాడులో నెలకొని ఉంది.
తాజావార్తలు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!