Off The Record about Narasaraopet MP: ఎంపీ సిట్టింగ్ సీటుకు ఎసరు..? సీటు మార్చే పనిలో వైసీపీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంటు వైసీపీ సీటు వ్యవహారం ఉత్కంఠగా మారుతోంది. గడిచిన ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా వైసీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు గెలిచారు. నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు వైసీపీ ఖాతాలో పడటం.. భారీగా ఎమ్మెల్యేలకు మెజార్టీ రావడంతో ఎంపీగా కృష్ణదేవరాయలు విజయం నల్లేరు మీద నడకలా సాగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీకి అక్కడ ఇబ్బందికర పరిస్థితులు రావచ్చట. దీంతో అధిష్టానం విషయాన్నీ గ్రహించి ఆయన్ను నరసరావుపేట నుంచి మారాలని చెబుతోందట. సిట్టింగ్ సీటును వదిలి వేసి.. గుంటూరులో పోటీ చేయాలని కోరిందట. అయితే తనను తొలిసారి గెలిపించిన నరసరావుపేటను వదిలేది లేదని భీష్మించు కూర్చున్నారట శ్రీకృష్ణదేవరాయలు. ఇదే విషయం ప్రస్తుతం పేట పరిసర నియోజకవర్గలలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతుంది.
Read Also: Off The Record about Yanamala Brothers: యనమల సోదరుల మధ్య టికెట్ రగడ..!
Also Read
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
2019 వరకు క్లీన్ ఇమేజ్ ఉన్న శ్రీకృష్ణదేవరాయలు స్థానిక నాయకులతో కూడా చక్కగా కలిసి పనిచేశారు. తర్వాత పార్లమెంటు పరిధిలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలతో ఎంపీకి సఖ్యత లేదు. వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, చిలకలూరిపేట ఎమ్మెల్యే, మంత్రి విడదల రజనితో ఎంపీకి పడటం లేదు. ఆ విషయం అనేకసార్లు రుజువైంది. ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అనుమతి లేకుండా ఎంపీ కాలు పెట్టే పరిస్థఙతి కూడా లేదు. రజనీ ఎంపీ వర్గాల మధ్య గొడవలు కూడా జరిగాయి. ఇక బ్రహ్మనాయుడు ఎంపీ పేరు చెబితే ఫైర్ అవుతున్నారు. ఇలాంటి గొడవలు ప్రస్తుతం పెద్ద ప్రమాదం కాకపోయినా.. ఎన్నికల్లో వేళ సీన్ మారే అవకాశం ఉంది.
వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో గత ఎన్నికల్లో ఓడిన గుంటూరు సహా మూడు పార్లమెంట్ సెగ్మెంట్లలో గెలవాలన్నది వైసీపీ ఆలోచన. అందుకే ఎందుకు ఛాన్స్ తీసుకోవడం అని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు నుంచి పోటీ చేయమని చెప్పిందట అధిష్టానం. ముఖ్యంగా వినుకొండ, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో ఎంపీకి వ్యతిరేకంగా ఓటుపడే ప్రమాదం ఉందనేది అధిష్టానం అనుమానం అట. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. బహిరంగంగానే మంత్రి విడదల రజనీకి, శ్రీకృష్ణదేవరాయలకు.. అదే విధంగా వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకు శ్రీకృష్ణదేవరాయలకు పెద్ద ఎత్తున వివాదాలు జరిగాయి. మీడియా ముఖంగా కామెంట్లు, గొడవలు చేసుకునే పరిస్థితికి కూడా వెళ్లింది. ఇలాంటి పరిస్థితుల్లో కచ్చితంగా శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట నుంచి పోటీ చేస్తే ఆ రెండు సెగ్మెంట్లలో క్రాస్ ఓటింగ్ ప్రమాదం ఉందనేది అధిష్టానం భయం అట. దీని నుంచి గట్టెక్కాలంటే ఎంపీను పేట వదిలి పెట్టక తప్పదు అనే ప్రచారం ఉంది. దీనిపై ఎంపీ ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది ప్రశ్న. రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సఖ్యత లేదన్న కారణం తప్ప ఏ ఆరోపణ లేని ఎంపీగా మళ్లీ అక్కడే కొనసాగడానికి అధిష్ఠానాన్ని ఒప్పిస్తారా లేక హైకమాండ్ చెప్పిన మాట వింటారా అనేది సస్పెన్స్గా మారింది.
రాజకీయాల్లో గెలుపు కావాలంటే ఒకటి రెండు ఓట్లైనా తీవ్ర ప్రభావం చూపిస్తాయి. 2019 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ ఫలితాలు చూసుకుంటే ఆ విషయం బోధపడుతుంది. కేవలం ఐదువేలలోపు ఓట్లతో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గెలిచారు. అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు నష్టం చేయకున్నా.. గతంలో జరిగిన విషయాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ల అనుచరులు క్రాస్ ఓటింగ్ చేస్తే అది వైసీపీ గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాత్రం నరసరావుపేట నుంచి పోటీ చేస్తానని అనుచరులతో చెబుతున్నారట. తన లెక్కలు తాను వేసుకుంటున్నారట. క్రాస్ ఓటింగ్ ప్రమాదం తనకు లేదని స్పష్టం చేస్తున్నారట. నరసరావుపేటలో ప్రచారం జరుగుతున్నట్లుగా ఒకవేళ టిడిపి బీసీ అభ్యర్థిని బరిలోకి దించితే టీడీపీలోని కమ్మ సామాజిక వర్గం ఓట్లు చీలి తనకు కలిసి వస్తుందన్న ధీమాతో ఉన్నారట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. సొంత పార్టీ వాళ్లు దెబ్బకొట్టినా ప్రత్యర్థి ఓట్ల చీలికతో బయటపడతా అంటున్నారట. అయితే ఒక ఎంపీ లెక్కల కంటే అధిష్ఠానం వేసే ఎత్తుగడలే ముఖ్యం. ఈ విషయంపై వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఎంపీ ఎలాంటి అడుగులు వేస్తారో అనే టెన్షన్ పల్నాడులో నెలకొని ఉంది.
తాజావార్తలు
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..