హర్యానాలోని హిసార్ జిల్లాలో ఖాప్ మహాపంచాయత్ జరిగిన మరుసటి రోజు బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ హత్యపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తును కోరుతూ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ హత్య కేసును కేంద్ర ఏజెన్సీకి బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు.
విదేశీ టీ-షర్టు ధరించి దేశాన్ని ఏకం చేసే భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బయలుదేరారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధ్వజమెత్తారు. 'భారత్ జోడో యాత్ర'లో ద్రవ్యోల్బణం అంశాన్ని లేవనెత్తిన రాహుల్ గాంధీ.. స్వయంగా రూ. 41,257 విలువ చేసే టీషర్ట్ను ధరించారని, అది కూడా విదేశీ బ్రాండ్కు చెందినదని పేర్కొంటూ బీజేపీ శుక్రవారం సోషల్ మీడియాలో కాంగ్రెస్పై దాడి చేసింది.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై నేరుగా దాడికి దిగారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు బెంగాల్లోని పలువురు మంత్రులను టార్గెట్ చేసిన వేళ అమిత్ షాను 'ఇండియాలోనే అతిపెద్ద పప్పు' అని కామెంట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
శ్రీశైల మల్లన్న దర్శనానికి రైల్వే మంత్రిని కూడా తీసుకొస్తానని, త్వరలోనే శ్రీశైలానికి అమిత్ షా వస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శ్రీశైలంలో ప్రసాదం స్కీం పనులను పరిశీలించారు. ప్రసాదం స్కీమ్ పనులన్నీ పూర్తి వచ్చే నెలలో నేను ఏపీ మంత్రి ఎమ్మెల్యేతో ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తెస్తామన్నారు. శ్రీశైలానికి రైల్వే మార్గానికి రైల్వే మంత్రితో మాట్లాడతా అన్నారు. గోశాలలోని 1300 గోవులు వున్నా కొన్ని గోవులు బలహీనంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోవుల…