Revanth Reddy: చరిత్రలో బీజేపీ లేదు.. అమిత్ షా సభకు జనం లేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చరిత్రలో బీజేపీ లేదు కాబట్టే అమిత్ షా సభకు జనం లేరని టీపీసీసీ రేవంత్ రెడ్డి విమర్శించారు. కాళ్ళు మొక్కి ప్రజాస్వామ్యం లో భాగస్వామ్యం అవ్వండి అని ప్రజల్ని అడుగుతామన్నారు. మునుగోడు ఎన్నికల ద్వారా టీఆర్ఎస్, బీజేపీ కి చెక్ పెట్టాలని పిలుపు నిచ్చారు. సెప్టెంబర్ 17 గొప్ప స్వాతంత్ర్య దినోత్సవం అని అన్నారు. చరిత్ర లేని వాళ్ళు… యుగ పురుషులు లేని వాళ్ళు మాట్లాడుతున్నారని రేవంత్ మండిపడ్డారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నీ బీజేపీ దొంగతనం చేస్తుందని అన్నారు. ఆర్ఎస్ఎస్ నీ నిషేధించారని, చరిత్ర నూ..నాయకులను బీజేపీ దొంగ తనం చేస్తుందని మండిపడ్డారు. అమిత్ షా సభకు 1500 మంది కూడా లేదని ఎద్దేవ చేశారు. ఎందుకంటే.. ఈ చరిత్ర లో బీజేపీ లేరు కాబట్టి జనం కూడా లేదని అన్నారు.
గుజరాత్ లో ఉన్న రాజు.. హైదరాబాద్ నిజాం రాజు..జమ్ము రాజు అంతా ఒకరే అని రేవంత్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్య వచ్చిన ఏడాది కి ఈ మూడు ప్రాంతాలకు స్వాతంత్య్రం వచ్చిందని రేవంత్ తెలిపారు. గుజరాత్ లో జునే ఘాడ్ లో ఎందుకు వజ్రోత్సవాలు చేయరు అని ప్రశ్నించారు. తెలంగాణ కి వచ్చి హడాహుడి ఎందుకు చేస్తుంది? అని రేవంత్ ప్రశ్నించారు. గుజరాత్ లో రాజు నుండి జునే ఘడ్ కి స్వాతంత్య్రం వచ్చిందని తెలిపారు. అక్కడి నుండి వచ్చిన అమిత్ షా ఎందుకు వేడుకలు చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అక్కడ 75 యేండ్ల వజ్రోస్త వాలు చేయదు ఎందుకు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. గుజరాత్ లో అధికారంలో ఉన్నది బీజేపీనే కదా?. అక్కడ ఎందుకు వేడుకలు చేయరన్నారు రేవంత్ రెడ్డి. ముందు జునేఘద్ లో ఉత్సవాలు చేయండి? అని సలహా ఇచ్చారు.
Also Read
- Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
- Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
- Lakshmis Empiria : వర్షాన్నీ లెక్కచేయని 5K రన్.. మియాపూర్లో సందడి.!
- Hyderabad: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ వన్వే ట్రయల్ రన్.. వాహనదారులకు కీలక సూచనలు.!
గుజరాత్ మంత్రులు హైదరాబాద్ పై కుట్ర చేస్తున్నారని తెలిపారు. ఇక్కడ కల్లోలాలు పెట్టీ.. ఇక్కడి పెట్టుబడి దారులను గుజరాత్ తీసుకెళ్లే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు రేవంత్. అసలు అసద్ ఎవరు? తెలంగాణకు అసద్ కి ఏం సంబంధం? అని ప్రశ్నించారు. ఆయన్ని భూతంగా పెట్టీ తెలంగాణను అక్రమించాలని బీజేపీ చూస్తుందని మండిపడ్డారు. భాగస్వామ్యం లేని పాత్ర పోషిస్తా అంటే జనం ఊరుకోరన్నారు. లగడ పాటి వచ్చి తెలంగాణ ఉద్యమం నేనే చేసిన అంటే ఎలాగా ఉంటుందో.. అమిత్ షా సెప్టెంబర్ 17 పేరుతో సభ పెడితే కూడా అలాగే ఉంటుందని వ్యంగాస్త్రం వేసారు రేవంత్ రెడ్డి. అందుకే అమిత్ షా సభకు జనం రాలేదన్నారు. చరిత్ర వక్రీకరిస్తాం అంటే ప్రజలు హర్షించరని రేవంత్ పేర్కొన్నారు. 1980 లో పుట్టిన బీజేపీ అయినా… 2001 లో పుట్టిన టీఆర్ఎస్ అయినా మమ్మల్ని పొగిడి తీరాల్సిందే.. చరిత్ర ఉన్నది మాకే అన్నారు రేవంత్ రెడ్డి. ట్విట్టర్ టిల్లు పొగిడింది కూడా అందుకే అని విమర్శించారు. పరేడ్ గ్రౌండ్ లో కేంద్రం అధికారిక వేడుక కాదు.. కేవలం టూరిజం శాఖ మాత్రమే చేస్తుందని అన్నారు. కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్నట్టు ఆదేశాలు ఇచ్చిందా..? అని ప్రశ్నించారు. ఓట్లు అడగడానికి ఇదో ప్రయత్నం అని రేవంత్ విమర్శించారు. అక్టోబర్ 2 నుండి పాదాభి వందనం.. మునుగోడు లో ఉన్న అందరినీ కలుస్తారు, ట్రైనింగ్ కూడా ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి.
BIG Breaking: మూడు రాజధానులపై సుప్రీంకి ఏపీ సర్కార్.. అది సాధ్యం కాదు..!
తాజావార్తలు
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!