Vemula Prashanth Reddy: జనం ఎటువైపో తేలిపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) మీడియా సమావేశంలో బీజేపీపై విరుచుకుపడ్డారు. హోంమంత్రి అమిత్ షా సికింద్రాబాద్ సభతో ప్రజలు ఎవరి వైపో తేట తెల్లం అయిపోయిందన్నారు. గజిని మహ్మద్ కంటే ఎక్కువగా బిజెపి నేతలు తెలంగాణ (telangana) పైదండ యాత్ర చేస్తున్నారు.. అసలెవరు వీరు.ఇతర రాష్ట్రాలకు ఎందుకు పోవట్లేదు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. పోరాటాలు తెలంగాణకు కొత్త కాదు..ఇక్కడి ప్రజలు గాజులు తోడుక్కోలేదు.. బీజేపీ నేతలు జీవిత కాలం ఢిల్లీ గద్దెపై ఉండరు.
Read Also:Earthquake: తైవాన్ తీరంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ చేసిన జపాన్
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
కేంద్ర మంత్రులు వచ్చి రేషన్ షాపుల్లో గొడవలు పెడుతున్నారు. ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉందని ప్రధాని మోడీ గమనించాలి. గిరిజన బంధుపై రాష్ట్రపతి స్పందించాలి. తెలంగాణ వజ్రోత్సవాలు సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ఘనంగా జరుగుతుంటే ,ఇతర రాష్ట్రాల నుండి దండయాత్రలు చేస్తున్నారు..అసలు వారికి తెలంగాణ చరిత్ర నేపథ్యం గురించి ఏం తెలుసు..? కేసీఆర్ ను తప్ప ఇతరులను ఇక్కడి ప్రజలు నమ్మరన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. సెప్టెంబర్ 17 న బీజేపీ నేతలు సికింద్రాబాద్ లో హడావిడి చేసిన సంగతి తెలిసిందే.
అమిత్ షా పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పచ్చని రాష్ట్రంలో చిచ్చు పెట్టేందుకు వచ్చారా..? ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్రంలో అధికారికంగా సంబరాలు జరుగుతుంటే రాజధాని నడిబొడ్డున పోలీసుల కవాతు దేనికి సంకేతం..? దేశంలో ఎక్కడైనా ఇట్లా జరిగిందా…? ఎక్కడ లేనిది తెలంగాణలోనే ఎందుకు..? కేంద్ర బీజేపీ మంత్రులు,నేతలు తెలంగాణ మీద గజిని మహ్మద్ లా దండెత్తి వస్తున్నారు.
కేసిఆర్ కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలు సూటిగా ప్రశ్నిస్తున్నారు కాబట్టే తెలంగాణ మీద దండ యాత్రకు వస్తున్నారా? ఎందరినో ఎదిరించిన పోరాటాల గడ్డ ఇది. మీ జులుంను తెలంగాణ ప్రజలు సహించరు . కేంద్ర బీజేపీ వైఖరి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు..భారత ఫెడరల్ స్ఫూర్తికే విరుద్ధం..అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు..బీజేపీ కి రోజులు దగ్గర పడ్డాయి. ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు… అది గుర్తెరిగి ప్రవర్తిస్తే మంచిది. మా సభకు బఠాణీలు అమ్ముకోవడానికి వచ్చినంత మంది కూడా మీ పోలీసు కవాతు సభలో లేరన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.
Read Also: Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. పల్టీలు కొట్టిన బస్సు, 27 మంది మృతి
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!