Vemula Prashanth Reddy: జనం ఎటువైపో తేలిపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) మీడియా సమావేశంలో బీజేపీపై విరుచుకుపడ్డారు. హోంమంత్రి అమిత్ షా సికింద్రాబాద్ సభతో ప్రజలు ఎవరి వైపో తేట తెల్లం అయిపోయిందన్నారు. గజిని మహ్మద్ కంటే ఎక్కువగా బిజెపి నేతలు తెలంగాణ (telangana) పైదండ యాత్ర చేస్తున్నారు.. అసలెవరు వీరు.ఇతర రాష్ట్రాలకు ఎందుకు పోవట్లేదు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. పోరాటాలు తెలంగాణకు కొత్త కాదు..ఇక్కడి ప్రజలు గాజులు తోడుక్కోలేదు.. బీజేపీ నేతలు జీవిత కాలం ఢిల్లీ గద్దెపై ఉండరు.
Read Also:Earthquake: తైవాన్ తీరంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ చేసిన జపాన్
Also Read
కేంద్ర మంత్రులు వచ్చి రేషన్ షాపుల్లో గొడవలు పెడుతున్నారు. ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉందని ప్రధాని మోడీ గమనించాలి. గిరిజన బంధుపై రాష్ట్రపతి స్పందించాలి. తెలంగాణ వజ్రోత్సవాలు సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ఘనంగా జరుగుతుంటే ,ఇతర రాష్ట్రాల నుండి దండయాత్రలు చేస్తున్నారు..అసలు వారికి తెలంగాణ చరిత్ర నేపథ్యం గురించి ఏం తెలుసు..? కేసీఆర్ ను తప్ప ఇతరులను ఇక్కడి ప్రజలు నమ్మరన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. సెప్టెంబర్ 17 న బీజేపీ నేతలు సికింద్రాబాద్ లో హడావిడి చేసిన సంగతి తెలిసిందే.
అమిత్ షా పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పచ్చని రాష్ట్రంలో చిచ్చు పెట్టేందుకు వచ్చారా..? ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్రంలో అధికారికంగా సంబరాలు జరుగుతుంటే రాజధాని నడిబొడ్డున పోలీసుల కవాతు దేనికి సంకేతం..? దేశంలో ఎక్కడైనా ఇట్లా జరిగిందా…? ఎక్కడ లేనిది తెలంగాణలోనే ఎందుకు..? కేంద్ర బీజేపీ మంత్రులు,నేతలు తెలంగాణ మీద గజిని మహ్మద్ లా దండెత్తి వస్తున్నారు.
కేసిఆర్ కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలు సూటిగా ప్రశ్నిస్తున్నారు కాబట్టే తెలంగాణ మీద దండ యాత్రకు వస్తున్నారా? ఎందరినో ఎదిరించిన పోరాటాల గడ్డ ఇది. మీ జులుంను తెలంగాణ ప్రజలు సహించరు . కేంద్ర బీజేపీ వైఖరి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు..భారత ఫెడరల్ స్ఫూర్తికే విరుద్ధం..అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు..బీజేపీ కి రోజులు దగ్గర పడ్డాయి. ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు… అది గుర్తెరిగి ప్రవర్తిస్తే మంచిది. మా సభకు బఠాణీలు అమ్ముకోవడానికి వచ్చినంత మంది కూడా మీ పోలీసు కవాతు సభలో లేరన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.
Read Also: Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. పల్టీలు కొట్టిన బస్సు, 27 మంది మృతి
తాజావార్తలు
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్పై కీలక వ్యాఖ్యలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!