Vemula Prashanth Reddy: జనం ఎటువైపో తేలిపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) మీడియా సమావేశంలో బీజేపీపై విరుచుకుపడ్డారు. హోంమంత్రి అమిత్ షా సికింద్రాబాద్ సభతో ప్రజలు ఎవరి వైపో తేట తెల్లం అయిపోయిందన్నారు. గజిని మహ్మద్ కంటే ఎక్కువగా బిజెపి నేతలు తెలంగాణ (telangana) పైదండ యాత్ర చేస్తున్నారు.. అసలెవరు వీరు.ఇతర రాష్ట్రాలకు ఎందుకు పోవట్లేదు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. పోరాటాలు తెలంగాణకు కొత్త కాదు..ఇక్కడి ప్రజలు గాజులు తోడుక్కోలేదు.. బీజేపీ నేతలు జీవిత కాలం ఢిల్లీ గద్దెపై ఉండరు.
Read Also:Earthquake: తైవాన్ తీరంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ చేసిన జపాన్
Also Read
కేంద్ర మంత్రులు వచ్చి రేషన్ షాపుల్లో గొడవలు పెడుతున్నారు. ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉందని ప్రధాని మోడీ గమనించాలి. గిరిజన బంధుపై రాష్ట్రపతి స్పందించాలి. తెలంగాణ వజ్రోత్సవాలు సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ఘనంగా జరుగుతుంటే ,ఇతర రాష్ట్రాల నుండి దండయాత్రలు చేస్తున్నారు..అసలు వారికి తెలంగాణ చరిత్ర నేపథ్యం గురించి ఏం తెలుసు..? కేసీఆర్ ను తప్ప ఇతరులను ఇక్కడి ప్రజలు నమ్మరన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. సెప్టెంబర్ 17 న బీజేపీ నేతలు సికింద్రాబాద్ లో హడావిడి చేసిన సంగతి తెలిసిందే.
అమిత్ షా పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పచ్చని రాష్ట్రంలో చిచ్చు పెట్టేందుకు వచ్చారా..? ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్రంలో అధికారికంగా సంబరాలు జరుగుతుంటే రాజధాని నడిబొడ్డున పోలీసుల కవాతు దేనికి సంకేతం..? దేశంలో ఎక్కడైనా ఇట్లా జరిగిందా…? ఎక్కడ లేనిది తెలంగాణలోనే ఎందుకు..? కేంద్ర బీజేపీ మంత్రులు,నేతలు తెలంగాణ మీద గజిని మహ్మద్ లా దండెత్తి వస్తున్నారు.
కేసిఆర్ కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలు సూటిగా ప్రశ్నిస్తున్నారు కాబట్టే తెలంగాణ మీద దండ యాత్రకు వస్తున్నారా? ఎందరినో ఎదిరించిన పోరాటాల గడ్డ ఇది. మీ జులుంను తెలంగాణ ప్రజలు సహించరు . కేంద్ర బీజేపీ వైఖరి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు..భారత ఫెడరల్ స్ఫూర్తికే విరుద్ధం..అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు..బీజేపీ కి రోజులు దగ్గర పడ్డాయి. ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు… అది గుర్తెరిగి ప్రవర్తిస్తే మంచిది. మా సభకు బఠాణీలు అమ్ముకోవడానికి వచ్చినంత మంది కూడా మీ పోలీసు కవాతు సభలో లేరన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.
Read Also: Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. పల్టీలు కొట్టిన బస్సు, 27 మంది మృతి
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!