Amit Shah : మునుగోడుపై దృష్టి సారించండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంపై ఎక్కువ దృష్టి పెట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ నేతలకు సూచించారు. హరిత ప్లాజా హోటల్లో రాష్ట్ర పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, ఇద్దరు జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్ సహా పదిమందికి పైగా సీనియర్ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. మరింత కృషి చేస్తే మునుగోడు సీటును గెలుచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని అమిత్ షా నేతలకు వెల్లడించారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు సూచించారు. “నా వైపు నుండి, నేను పూర్తి సహకారం అందిస్తాను. మునుగోడులో పార్టీ గెలుపునకు నాయకులందరూ కృషి చేయాలి’’ అని అన్నారు. ఇతర పార్టీలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు బీజేపీలో చేరడంపై అమిత్ షా ఆరా తీసినట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత అధికార పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే సూచనలపై కూడా అమిత్ షా, నేతల మధ్య చర్చ జరిగింది.
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
పార్టీ నేతలతో భేటీ అనంతరం శామీర్పేటలోని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాజేందర్ తండ్రి మల్లయ్య కొద్దిరోజుల క్రితం మరణించారు. సాయంత్రం తర్వాత, అమిత్ షా సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ఐపీఎస్ ప్రొబేషనర్ల శిక్షణా పాఠ్యాంశాలు మరియు ఇతర శిక్షణా కార్యకలాపాలను సమీక్షించారు. కాగా, భారత మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపీచంద్ హరిత ప్లాజా హోటల్లో అమిత్ షాను కలిశారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!