Amit Shah : మునుగోడుపై దృష్టి సారించండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంపై ఎక్కువ దృష్టి పెట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ నేతలకు సూచించారు. హరిత ప్లాజా హోటల్లో రాష్ట్ర పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, ఇద్దరు జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్ సహా పదిమందికి పైగా సీనియర్ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. మరింత కృషి చేస్తే మునుగోడు సీటును గెలుచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని అమిత్ షా నేతలకు వెల్లడించారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు సూచించారు. “నా వైపు నుండి, నేను పూర్తి సహకారం అందిస్తాను. మునుగోడులో పార్టీ గెలుపునకు నాయకులందరూ కృషి చేయాలి’’ అని అన్నారు. ఇతర పార్టీలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు బీజేపీలో చేరడంపై అమిత్ షా ఆరా తీసినట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత అధికార పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే సూచనలపై కూడా అమిత్ షా, నేతల మధ్య చర్చ జరిగింది.
Also Read
- Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
- YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
- CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
- Vijay-Governor: విజయ్కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
పార్టీ నేతలతో భేటీ అనంతరం శామీర్పేటలోని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాజేందర్ తండ్రి మల్లయ్య కొద్దిరోజుల క్రితం మరణించారు. సాయంత్రం తర్వాత, అమిత్ షా సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ఐపీఎస్ ప్రొబేషనర్ల శిక్షణా పాఠ్యాంశాలు మరియు ఇతర శిక్షణా కార్యకలాపాలను సమీక్షించారు. కాగా, భారత మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపీచంద్ హరిత ప్లాజా హోటల్లో అమిత్ షాను కలిశారు.
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!