Asaduddin Owaisi: హైదరాబాద్ పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహిస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ ఫైర్ అయ్యారు.
Manipur Violence: జాతుల సంఘర్షణతో మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. మైయిటీ, కూకీ వర్గాల మధ్య ఘర్షణ కారణంగా ఇప్పటి వరకు 80 మందికి పైగా ప్రజలు మరణించారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న మణిపూర్ వెళ్లారు. శాంతి స్థాపన కోసం పలు పార్టీలతో సంభాషించారు. మరోవైపు తిరుగబాటుదారుల ముగుసులో ఉగ్రవాదులు గ్రామాలు, ప్రజలపై దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా మణిపూర్ సరిహద్దును అనుకుని ఉన్న మయన్మార్ నుంచి పెద్ద ఎత్తున ఉగ్రవాదులు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు వార్తలు…
Manipur Violence: మే 3న మణిపూర్లో చెలరేగిన హింసాకాండ ఇంకా చల్లారలేదు. దాదాపు 80 మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. మరోవైపు ఈ హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాయి. దీంతో పాటు మృతుల కుటుంబంలోని ఒక్కరికీ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.
మణిపూర్లో శాంతి వాతావరణం నెలకొల్పడానికి స్వయంగా రంగంలోకి దిగిన కేంద్ర హోం శాఖ మంత్రే అమిత్ షా మంగళవారం రాష్ట్ర రాజధాని ఇంఫాల్లో మహిళలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారితో సమావేశం అనంతరం శాంతి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్లో వరుస పోస్టులు చేశారు. భారతీయ సంప్రదాయాలను, సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంతగా ద్వేషిస్తోందని ఆయన ప్రశ్నించారు
Amit Shah: నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ ఇతర విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. గౌహతిలో ఓ కార్యక్రమానికి హాజరైన షా కీలక వ్యాఖ్యలు చేశారు.
Amul Issue: కర్ణాటక ఎన్నికల సమయంలో రాజకీయాలను కుదుపుకుదిపేసిన అమూల్ పాల వివాదం ప్రస్తుతం తమిళనాడును తాకింది. గుజరాత్ కు చెందిన ఓ ప్రముఖ పాల కంపెనీ అమూల్, తమిళనాడు రాష్ట్రంలో పాలను సేకరించేందుకు సిద్ధం అయింది. అయితే నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. అమూల్ వల్ల రాష్ట్రంలోని అవిన్ బ్రాండ్ కు ఆదరణ తగ్గే అవకాశం ఉందని ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో అమూల్ పాలసేకరణను ఆపేలా ఆదేశించాలని కేంద్ర హోంమంత్రికి, తమిళనాడు సీఎం ఎంకే…
Amit Shah: హింసతో అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లనున్నారు. మణిపూర్ లో శాంతి నెలకొనాలని అమిత్ షా గురువారం విజ్ఞప్తి చేశారు, త్వరలో ఈశాన్య రాష్ట్రాన్ని సందర్శించి హింసలో పాల్గొన్న రెండు వర్గాల ప్రజలతో మాట్లాడతానని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ దేశానికి అంకితం చేయనున్నారని తెలిపారు.