Bhopal: ప్రేమికుల రోజున దుర్వార్త.. ప్రేమికురాలిని చంపి సెప్టిక్ ట్యాంక్లో పడేసిన ప్రియుడు
- ప్రేమికుల రోజున ఘోరం
- ప్రేమికురాలిని చంపి సెప్టిక్ ట్యాంక్లో పడేసిన ప్రియుడు
- మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు. ప్రేమికులు గ్రీటింగ్స్, బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ సంతోషంగా గడిపేరోజు. కానీ ఓ ప్రేమికుడు ఘాతుకానికి తెగబడ్డాడు. ప్రియురాలిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగింది.
మహారాష్ట్రలోని గోండియా జిల్లాకు చెందిన అష్రఫీ అలియాస్ సియా అనే యువతి.. భోపాల్కు చెందిన వివాహితుడు సమీర్తో ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. యువతిని ప్రేమ పేరుతో సమీర్ ముగ్గులోకి దింపాడు. చాటింగ్లతో రోజురోజుకు బాగా దగ్గరయ్యారు. ఈ క్రమంలో ప్రేమతో కళ్లుమూసుకుపోయిన సియా.. సమీర్తో జీవించాలని మూడు నెలల క్రితం ఇంటిని వదిలిపెట్టి భోపాల్కు వెళ్లింది.
Also Read
- Dowry harassment: ప్రేమ పెళ్లి చేసుకున్న కట్నం వేధింపులు తప్పలేదు.. 2 నెలలకే నవవధువు మృతి..
- Gurugram: పెళ్లైన మూడు నెలలకే.. భార్యను ప్రియురాలి గదికి తీసుకెళ్లి..
- Delhi: పెళ్లైన రెండు నెలలకే నవవధువు మృతి.. మిస్టరీగా ఆకృతి మరణం..
- Wife Kills Husband: ‘‘ఇంట్లోకి రావొద్దు’’.. బాత్రూమ్ హత్య కేసులో సంచలన విషయాలు..
ఇది కూడా చదవండి: MLA Kunamneni : కేటీఆర్ ఫోన్ చేసి సీపీఐకు బేషరతుగా మద్దతు ఇస్తామన్నారు
తీరా సమీర్ దగ్గరకు వెళ్లాక సియా షాకైంది. సమీర్ అప్పటికే వివాహితుడు.. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసి ఆందోళనకు గురైంది. సియా కమలా నగర్లో ఒక ఇంట్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రేమికుల మధ్య గొడవలు జరుగుతుండగా.. ఇంకోవైపు నిత్యం సియా-సమీర్ భార్య మధ్య గొడవులు జరిగినట్లుగా స్థానికులు చెప్పారు. సమీరే.. సియాను నమ్మించి ద్రోహం చేసినట్లుగా చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: KTR : ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదు.. మహామహులనే ప్రజలు ఓడించారు..!
అయితే తనను పెళ్లి చేసుకోవాలని సియా తీవ్ర ఒత్తిడి తేవడం ప్రారంభించింది. ఒకవేళ చేసుకోకపోతే రూ.5 లక్షలు ఇవ్వాలని.. లేదంటే పోలీసులకు చెబుతానని బెదిరించింది. ఈ గందరగోళం మధ్య సమీర్ భార్య జబల్పూర్లోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది. ఇక భార్య పుట్టింటికి వెళ్లిపోయాక సమీర్లో ఆగ్రహావేషాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం సియా-సమీర్ మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపంతో ఉన్న సమీర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సియా గొంతు కోసి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇనుప పెట్టిలో పెట్టి మంగళవారం అర్ధరాత్రి నిషాత్పురా ప్రాంతంలోని ఖాళీ స్థలంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్లో పడేశారు. గురువారం దుర్వాసన వస్తుందని స్థానికులు పోలీసులకు చెప్పడంతో కుళ్లిపోయిన మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పచ్చబొట్టు ఆధారంగా 24 గంటల్లో కేసు మిస్టరీని ఛేదించారు.
ప్రధాన నిందితుడు సమీర్ పరారీలో ఉండగా.. సహకరించిన తల్లి, సోదరిని అరెస్ట్ చేశారు. సమీర్ భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. మిగతా కుటుంబ సభ్యులకు కూడా ఈ హత్య గురించి తెలిసి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే పోలీసుల దర్యాప్తులో విస్తుగొల్పే విషయాలు వెల్లడైనట్లుగా తెలుస్తోంది. సియాకు గతంలో మహారాష్ట్ర, రాజస్థాన్ల్లో మూడు సార్లు వివాహం అయినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ramayana: హాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ దిశగా ‘రామాయణం’.. ప్రపంచవ్యాప్త విడుదలపై ఊహాగానాలు
-
Ellyse Perry: ఎల్లీస్ పెర్రీ.. మహిళల క్రికెట్కు చిరునామా.. చరిత్రలోనే గొప్ప ఆల్రౌండర్!
-
Organ Donation: యాక్సిడెంట్.. బ్రెయిన్ డెడ్.! ఆరుగురి జీవితాల్లో వెలుగునింపిన 7 ఏళ్ల ‘యశ్వన్’.!
-
E25 Petrol in India: భారత ఇంధన రంగంలో మరో భారీ మార్పు.. E20 తర్వాత E21, E25..
-
Babu Mohan: 15 సినిమాల్లో నటిస్తున్నా.. డ్యాన్స్లు కూడా చేశా.. బాబు మోహన్ ఆసక్తికర విషయాలు!
ట్రెండింగ్
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!
-
Sanju Samson: జింబాబ్వే టూర్లో నో ఛాన్స్.. సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు.. ముందుంది మరో సూపర్ ఛాన్స్!
-
ICC Team: టీ20 ప్రపంచకప్ అత్యుత్తమ జట్టు.. భారత్ నుంచి ఒక్కరికే చోటు.. ఆ ఒక్కరు మన అమ్మాయే!