Bhopal: ప్రేమికుల రోజున దుర్వార్త.. ప్రేమికురాలిని చంపి సెప్టిక్ ట్యాంక్లో పడేసిన ప్రియుడు
- ప్రేమికుల రోజున ఘోరం
- ప్రేమికురాలిని చంపి సెప్టిక్ ట్యాంక్లో పడేసిన ప్రియుడు
- మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు. ప్రేమికులు గ్రీటింగ్స్, బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ సంతోషంగా గడిపేరోజు. కానీ ఓ ప్రేమికుడు ఘాతుకానికి తెగబడ్డాడు. ప్రియురాలిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగింది.
మహారాష్ట్రలోని గోండియా జిల్లాకు చెందిన అష్రఫీ అలియాస్ సియా అనే యువతి.. భోపాల్కు చెందిన వివాహితుడు సమీర్తో ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. యువతిని ప్రేమ పేరుతో సమీర్ ముగ్గులోకి దింపాడు. చాటింగ్లతో రోజురోజుకు బాగా దగ్గరయ్యారు. ఈ క్రమంలో ప్రేమతో కళ్లుమూసుకుపోయిన సియా.. సమీర్తో జీవించాలని మూడు నెలల క్రితం ఇంటిని వదిలిపెట్టి భోపాల్కు వెళ్లింది.
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.
- Krishna Deer Hunting : కృష్ణ జింకల వేట.. ముగ్గురు నిందితుల అరెస్ట్..!
- Actor Santhosh Nair Dies: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు సంతోష్ నాయర్ మృతి.. భార్య పరిస్థితి విషమం
ఇది కూడా చదవండి: MLA Kunamneni : కేటీఆర్ ఫోన్ చేసి సీపీఐకు బేషరతుగా మద్దతు ఇస్తామన్నారు
తీరా సమీర్ దగ్గరకు వెళ్లాక సియా షాకైంది. సమీర్ అప్పటికే వివాహితుడు.. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసి ఆందోళనకు గురైంది. సియా కమలా నగర్లో ఒక ఇంట్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రేమికుల మధ్య గొడవలు జరుగుతుండగా.. ఇంకోవైపు నిత్యం సియా-సమీర్ భార్య మధ్య గొడవులు జరిగినట్లుగా స్థానికులు చెప్పారు. సమీరే.. సియాను నమ్మించి ద్రోహం చేసినట్లుగా చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: KTR : ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదు.. మహామహులనే ప్రజలు ఓడించారు..!
అయితే తనను పెళ్లి చేసుకోవాలని సియా తీవ్ర ఒత్తిడి తేవడం ప్రారంభించింది. ఒకవేళ చేసుకోకపోతే రూ.5 లక్షలు ఇవ్వాలని.. లేదంటే పోలీసులకు చెబుతానని బెదిరించింది. ఈ గందరగోళం మధ్య సమీర్ భార్య జబల్పూర్లోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది. ఇక భార్య పుట్టింటికి వెళ్లిపోయాక సమీర్లో ఆగ్రహావేషాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం సియా-సమీర్ మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపంతో ఉన్న సమీర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సియా గొంతు కోసి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇనుప పెట్టిలో పెట్టి మంగళవారం అర్ధరాత్రి నిషాత్పురా ప్రాంతంలోని ఖాళీ స్థలంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్లో పడేశారు. గురువారం దుర్వాసన వస్తుందని స్థానికులు పోలీసులకు చెప్పడంతో కుళ్లిపోయిన మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పచ్చబొట్టు ఆధారంగా 24 గంటల్లో కేసు మిస్టరీని ఛేదించారు.
ప్రధాన నిందితుడు సమీర్ పరారీలో ఉండగా.. సహకరించిన తల్లి, సోదరిని అరెస్ట్ చేశారు. సమీర్ భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. మిగతా కుటుంబ సభ్యులకు కూడా ఈ హత్య గురించి తెలిసి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే పోలీసుల దర్యాప్తులో విస్తుగొల్పే విషయాలు వెల్లడైనట్లుగా తెలుస్తోంది. సియాకు గతంలో మహారాష్ట్ర, రాజస్థాన్ల్లో మూడు సార్లు వివాహం అయినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!