Amit Shah and JP Nadda Andhra Pradesh Tour: ఏపీకి బీజేపీ పెద్దలు.. 10న నడ్డా, 11న అమిత్షా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah and JP Nadda Andhra Pradesh Tour: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్కి రానున్నారు.. ఈనెల 10వ తేదీన శ్రీకాళహస్తిలో జేపీ నడ్డా అధ్వర్యంలోభారీ బహిరంగ సభ నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది.. ఈ విషయాన్ని ఈ రోజు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ప్రకటించారు.. దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరిగాయి.. జరుగుతున్నాయన్న ఆయన.. వైసీపీ అవినీతి, అక్రమాలను సభల ద్వారా ప్రజలకు వివరిస్తాం అన్నారు.. అభివృద్ధిలో ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్న ఆయన.. పుట్టిన ప్రతిబిడ్డపై రెండు లక్షల రూపాయల అప్పు తెచ్చిన ఘనుడు సీఎం జగన్ అంటూ ఎద్దేవా చేశారు.. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు.. ప్రతి పనిలోను అవినీతి, ప్రతి కంపెనీకి వైసీపీ కార్యకర్తలే యజమానులు అని విమర్శించారు.. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారని మండిపడ్డారు.. ఇక, జనసేనతో కలిసే ముందుకు వెళుతున్నాం అని స్పష్టం చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్.
Read also: Ponguleti Sudhakar Reddy: ప్రజలను భ్రమలో పెట్టే కార్యక్రమమే ఈ నీళ్ళ పండుగ
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
- Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
మరోవైపు.. ఉద్యోగులను మోసం చేశారంటూ సీఎం వైఎస్ జగన్పై ధ్వజమెత్తారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి.. మాట తప్పను.. మడమ తిప్పను.. అన్న జగన్ హామీలు ఏమయ్యాయి? అని నిలదీశారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, యువతను వైఎస్ జగన్ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.. నెరవేర్చలేని హామీలను జగన్ ఎందుకు ఇచ్చారు..? అంటూ ప్రశ్నించారు విష్ణువర్ధన్రెడ్డి. కీలకమైన అనేక మంది నేతలతో పాటు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా శ్రీకాళహస్తిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. చిత్తూరు జిల్లా నేతలతో సమావేశం అనంతరం బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొంటారని వివరించారు విష్ణు వర్ధన్. ఇక, కేంద్రమంత్రి అమిత్ షా విశాఖ పర్యటన ఈనెల 11వ తేదీకి మార్పు చేయడం జరిగిందని, ఆ రోజు ఉదయం కోయంబత్తూరు బహిరంగ సభలో పాల్గొని అనంతరం విశాఖ సభలో పాల్గొంటారని బీజేపీ నేత సీఎం రమేష్ తెలిపారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం జేపీ నడ్డా తిరుపతికి చేరుకుంటారని, ప్రధాని మోడీ పాలనలో జరిగిన అభివృద్ధిని 10వ తేదీ శ్రీకాళహస్తిలో జరిగే బహిరంగ సభలో నడ్డా వివరిస్తారని తెలిపారు.
తాజావార్తలు
-
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్లో స్కిన్ షో చేస్తే బూతులు?
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!