Amit Shah and JP Nadda Andhra Pradesh Tour: ఏపీకి బీజేపీ పెద్దలు.. 10న నడ్డా, 11న అమిత్షా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah and JP Nadda Andhra Pradesh Tour: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్కి రానున్నారు.. ఈనెల 10వ తేదీన శ్రీకాళహస్తిలో జేపీ నడ్డా అధ్వర్యంలోభారీ బహిరంగ సభ నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది.. ఈ విషయాన్ని ఈ రోజు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ప్రకటించారు.. దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరిగాయి.. జరుగుతున్నాయన్న ఆయన.. వైసీపీ అవినీతి, అక్రమాలను సభల ద్వారా ప్రజలకు వివరిస్తాం అన్నారు.. అభివృద్ధిలో ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్న ఆయన.. పుట్టిన ప్రతిబిడ్డపై రెండు లక్షల రూపాయల అప్పు తెచ్చిన ఘనుడు సీఎం జగన్ అంటూ ఎద్దేవా చేశారు.. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు.. ప్రతి పనిలోను అవినీతి, ప్రతి కంపెనీకి వైసీపీ కార్యకర్తలే యజమానులు అని విమర్శించారు.. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారని మండిపడ్డారు.. ఇక, జనసేనతో కలిసే ముందుకు వెళుతున్నాం అని స్పష్టం చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్.
Read also: Ponguleti Sudhakar Reddy: ప్రజలను భ్రమలో పెట్టే కార్యక్రమమే ఈ నీళ్ళ పండుగ
Also Read
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
మరోవైపు.. ఉద్యోగులను మోసం చేశారంటూ సీఎం వైఎస్ జగన్పై ధ్వజమెత్తారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి.. మాట తప్పను.. మడమ తిప్పను.. అన్న జగన్ హామీలు ఏమయ్యాయి? అని నిలదీశారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, యువతను వైఎస్ జగన్ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.. నెరవేర్చలేని హామీలను జగన్ ఎందుకు ఇచ్చారు..? అంటూ ప్రశ్నించారు విష్ణువర్ధన్రెడ్డి. కీలకమైన అనేక మంది నేతలతో పాటు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా శ్రీకాళహస్తిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. చిత్తూరు జిల్లా నేతలతో సమావేశం అనంతరం బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొంటారని వివరించారు విష్ణు వర్ధన్. ఇక, కేంద్రమంత్రి అమిత్ షా విశాఖ పర్యటన ఈనెల 11వ తేదీకి మార్పు చేయడం జరిగిందని, ఆ రోజు ఉదయం కోయంబత్తూరు బహిరంగ సభలో పాల్గొని అనంతరం విశాఖ సభలో పాల్గొంటారని బీజేపీ నేత సీఎం రమేష్ తెలిపారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం జేపీ నడ్డా తిరుపతికి చేరుకుంటారని, ప్రధాని మోడీ పాలనలో జరిగిన అభివృద్ధిని 10వ తేదీ శ్రీకాళహస్తిలో జరిగే బహిరంగ సభలో నడ్డా వివరిస్తారని తెలిపారు.
తాజావార్తలు
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
-
The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్కు ఇండియా ఫిదా.. ‘ది ఒడిస్సీ’కి అదిరిపోయే ఓపెనింగ్!
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
-
WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!