* నేడు ఉదయం 10:30 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ.. 2026-27 ఆర్థిక బడ్జెట్ కి ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్..
* నేడు ఉదయం 11 గంటలకి ఏపీ బడ్జెట్.. 3.48 లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక బడ్జెట్ ఉండే అవకాశం.. ఉదయం 11: 15 గంటలకి అసెంబ్లీలో ఆర్థిక బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మంత్రి పయ్యావుల కేశవ్.. శాసన మండలిలో ఆర్థిక బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మంత్రి అనిత.. అనంతరం ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం.. శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మంత్రి అనగాని సత్యప్రసాద్..
* నేడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి లోకేష్ లంచ్ సమావేశం.. ఇవాళ మధ్యాహ్నం ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో లోకేష్ భేటీ.. సాయంత్రం హైదరాబాద్ కి మంత్రి లోకేష్..
* నేడు గుమ్మల దిబ్బ మైనర్ బాలిక మృతి కేసులో విచారణకు హాజరుకానున్న మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి.. ఉదయం 11 గంటలకి హాజరు కానున్న కాకాణి…
* నేడు శ్రీశైలంలో 7వ రోజుకు చేరుకున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. సాయంత్రం గజ వాహనంపై ఆశీనులై ప్రత్యేక పూజలు అందుకోనున్న ఆది దంపతులు.. రాత్రి క్షేత్ర పుర వీధులలో శ్రీస్వామి అమ్మవారికి వైభవంగా గ్రామోత్సవం..
* నేడు మహానందిలో 2వ రోజు బ్రహ్మోత్సవాలు.. ఉత్సవ విగ్రహాలకు ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం సింహ వాహనంపై గ్రామోత్సవం..
* నేడు అసోంలో ప్రధాని మోడీ పర్యటన.. ఈశాన్య రాష్ట్రాల్లో తొలి ఈఎల్ఎఫ్ కేంద్రానికి ప్రధాని.. గౌహతిలో రూ. 5,450 కోట్లకు పైగా ప్రాజెక్టుల ప్రారంభం.. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన కుమార్ భాస్కర్ వర్మ సేతును ప్రారంభించనున్న మోడీ.. జాతీయ డేటా సెంటర్ ను ప్రారంభించనున్న ప్రధాని..
* నేడు టీ20 వలర్డ్ కప్ లో మూడు మ్యాచ్ లు.. ఉదయం 11 గంటలకి ఐర్లాండ్ వర్సెస్ ఒమన్.. మధ్యాహ్నం 3 గంటలకి ఇంగ్లాండ్ తో తలపడనున్న స్కాంట్లాండ్.. రాత్రి 7 గంటలకి న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్..