Trump- Putin: మరికొన్ని రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ యూఎస్ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కు సంబంధించిన ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత కారణంగా, ప్రపంచం మొత్తం మూడవ ప్రపంచ యుద్ధం ముప్పును ఎదుర్కొంటోందని అనడంలో తప్పేం లేదు. అదే ఇరాన్, ఇజ్రాయెల్ ఒకప్పుడు స్నేహితులు కూడా? రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్న నేపథ్యంలో, ఈ దేశాల చరిత్రను మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి.
US Embassy: అమెరికా వెళ్లాలని అనుకునే భారతీయులకు అగ్రరాజ్యం మరో గుడ్ న్యూస్ చెప్పింది. అదనంగా 2.5 లక్షల వీసా అపాయింట్మెంట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది.
America – Syria: సిరియాలో జరిగిన భారీ వైమానిక దాడిలో ISIS, అల్ ఖైదాతో సంబంధం ఉన్న సాయుధ యోధులు సహా 37 మంది ఉగ్రవాదులను అమెరికా హతమార్చింది. ఈ నెల 2 వేర్వేరు రోజుల్లో ఈ దాడి జరిగింది. సెప్టెంబర్ 16న సెంట్రల్ సిరియాలో, సెప్టెంబరు 24న వాయువ్య సిరియాలో ఈ వైమానిక దాడులు జరిగాయని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, హత్యకు గురైన వారి…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించాల్సిన ఆర్థిక ప్రగతి, కృత్రిమ మేధ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా కలిగే ప్రయోజనాలు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకోసం మాస్టర్ కార్డు కేంద్రం ద్వారా సాధిస్తున్న ఆర్థిక ప్రగతి తదితర అంశాలపై ఆయా రంగ ప్రముఖులతో శుక్రవారం ప్రధానంగా చర్చించారు.
అరిజోనాలోని డగ్లస్కు చెందిన యూఎస్- మెక్సికో సరిహద్దు ప్రాంతాన్ని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ సందర్శించారు. ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. దేశంలోకి అక్రమ వలసలను నివారించేందుకు అమెరికా సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు.
Hurricane Helene : అమెరికాలోని నాలుగు రాష్ట్రాలు గత రెండు రోజులుగా 'హెలెన్' తుపానును ఎదుర్కొంటున్నాయి. వీటిలో ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా వంటి రాష్ట్రాలు ఉన్నాయి.
Mallu Bhatti Vikramarka: అమెరికాలోని లాస్వేగాస్ జరుగుతున్న మైన్ ఎక్స్ పోలో 2 వేలకు పైగా ఆధునిక యంత్ర తయారీ సంస్థలు పాల్గొన్నాయి. 121 దేశాల నుండి 40 వేల మంది ప్రతినిధులు హరయ్యారు. మైన్ ఎక్స్ సందర్భంగా సదస్సులో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రసంగించనున్నారు. మూడు రోజుల ప్రదర్శనకు అత్యాధునిక, భారీ మైనింగ్ ఖనిజ ఉత్పత్తి యంత్రాలు ఉండనున్నాయి. తెలంగాణలో మైనింగ్ లో ఆధునిక సాంకేతికత వినియోగం కోసం ఆయన…
సోమవారం అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి 79వ సర్వసభ్య సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. 'సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్'లో ప్రధాని మోడీ మాట్లాడుతూ.., 'మానవత్వం యొక్క విజయం మన సమిష్టి శక్తిలో ఉంది, యుద్ధభూమిలో కాదు. ప్రపంచ శాంతి, అభివృద్ధికి ప్రపంచ సంస్థలలో సంస్కరణలు చాలా ముఖ్యమైనవి. ఔచిత్యానికి మెరుగుదల కీలకం' అని అన్నారు.