నోబెల్ శాంతి బహుమతికి డొనాల్డ్ ట్రంప్ అర్హుడని.. దాన్ని పొందాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. వైట్హౌస్లో ట్రంప్తో నెతన్యాహు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. శాంతి కోసం ట్రంప్ చేస్తున్న కృషిని నెతన్యాహు కొనియాడారు.
సుంకాలపై ట్రంప్ విధించిన డెడ్లైన్ బుధవారంతో ముగుస్తోంది. కానీ ఇంతలోనే వాణిజ్య భాగస్వామ దేశాలైన జపాన్, దక్షిణ కొరియాపై భారీగా సుంకాలు విధించారు. ఆ రెండు దేశాలకు రాసిన లేఖల్లో జపాన్, దక్షిణ కొరియా దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్కు.. కారును ఢీకొట్టడంతో హైదరాబాద్కు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. దీంతో బంధువులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. బ్రిక్స్తో సంబంధాలు పెట్టుకున్న దేశాలకు 10 శాతం అదనంగా సుంకాలు విధించబోతున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 2న ట్రంప్.. దేశాలపై సుంకాలు విధించారు. ఈ చర్యను బ్రిక్స్ దేశాలు ఖండించాయి.
Allu Arjun : అల్లు అర్జున్, సుకుమార్, రాఘవేంద్ర రావు, శ్రీలీల అమెరికాలో నిర్వహించిన నాట్స్ ప్రోగ్రామ్ లో సందడి చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. అమెరికాలో ఇంత మంది తెలుగు వాళ్లం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి ప్రోగ్రామ్ కు నన్ను పిలిచినందుకు మీ అందరికీ థాంక్స్. తెలుగు వారంటే ఫైర్ అనుకున్నావా వైల్డ్ ఫైర్. అదే ఇప్పుడు అమెరికాలో కనిపిస్తుంది. నాట్స్ గురించి ఓ మాట చెబుతా. నాట్స్…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య దెబ్బతిన్న సంబంధం మరో వివాదాస్పద మలుపు తిరిగింది. బిలియనీర్, ట్రంప్ సన్నిహితుడు ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటును ప్రకటించారు. గతంలో, వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం పొందితే, అమెరికాలో కొత్త పార్టీ ఏర్పడుతుందని మస్క్ ట్రంప్ను హెచ్చరించారు. అమెరికా 249వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చనీయాంశమైన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై సంతకం చేశారు. Also Read:Off The…
సుంకాలపై ట్రంప్ విధించిన డెడ్లైన్ మరికొన్ని గంటల్లో ముగుస్తోంది. ఆయా దేశాలకు గడువు ముంచుకొస్తోంది. యూకే, వియత్నాం, చైనా తప్ప.. ఇంకా ఏ దేశాలు అమెరికాతో ఒప్పందాలు చేసుకోలేదు. భారత్తో కీలక డీల్ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నా.. అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు.
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం చర్చలు తుది దిశకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ-ట్రంప్ మధ్య సంభాషణ జరిగిన తర్వాత జూలై 9కి ముందు ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని వర్గాలు పేర్కొన్నాయి.
ఆగస్టు 1 నుంచి దేశాలు సుంకాలు చెల్లిండం ప్రారంభించాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. టారిఫ్లపై ట్రంప్ విధించిన డెడ్లైన్ మరో ఐదు రోజుల్లో ముగుస్తోంది. ఏప్రిల్ 2న సుంకాలు ప్రకటించగా.. ఆయా దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో 90 రోజులు తాత్కాలిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ గడువు జూలై 9తో ముగుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సుంకాలపై విధించిన డెడ్లైన్ జూలై 9తో ముగుస్తోంది. ఇక ఈ డెడ్లైన్ పొడిగించే ప్రసక్తే లేదని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ స్పష్టం చేశారు.