Karnataka: కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం.. 16 లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్
- కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం
- 16 లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్
- అసెంబ్లీలో ప్రకటించిన సీఎం సిద్ధరామయ్య
- బ్యాన్ విధించిన తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. ఈ మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. పిల్లల్లో పెరుగుతున్న మొబైల్ వినియోగం, సోషల్ మీడియా వ్యసనం, ఆన్లైన్ భద్రతా సమస్యల నేపథ్యంలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని శుక్రవారం 2026–27 రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడుతూ సిద్ధరామయ్య ప్రకటించారు. పిల్లలపై అధిక స్క్రీన్ టైమ్ ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Israel-Khamenei: ఖమేనీ హత్య వెనుక ఇంత జరిగిందా? వెలుగులోకి సంచలన రిపోర్ట్
Also Read
- Modi-Marco Rubio: వైట్హౌస్ను సందర్శించండి.. ట్రంప్ తరపున మోడీకి రూబియో ఆహ్వానం
- Modi-Marco Rubio: సేవా తీర్థ్లో మోడీతో మార్కో రూబియో భేటీ.. గంటకుపైగా కీలక చర్చలు
- Cockroach Janta Party: "బొద్దింకల పార్టీ"పై ఉక్కుపాదం.. అన్ని అకౌంట్లు క్లోజ్..
- Kolkata: మమత కట్టడాలపై బుల్డోజర్ చర్య.. సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ శిల్పం తొలగింపు
దేశంలో పిల్లలపై సోషల్ మీడియా బ్యాన్ వేసిన తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్, గోవా రాష్ట్రాలు కూడా ఆలోచన చేస్తున్నాయి. ఇంతలోనే కర్ణాటక నిర్ణయం తీసుకుని ప్రకటించేసింది. సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ అవసరమనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఆస్ట్రేలియా ఇప్పటికే చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై కఠిన నియమాలు అమలు చేస్తోంది. బ్రిటన్, ఫిన్లాండ్ వంటి దేశాలు కూడా ఇలాంటి చర్యలను పరిశీలిస్తున్నాయి. అలాగే ఫ్రాన్స్, స్పెయిన్ వంటి యూరప్ దేశాల్లో పాఠశాలల్లో మొబైల్ ఫోన్ వినియోగంపై పరిమితులు విధించి విద్యార్థుల దృష్టి, చదువుపై ప్రభావం తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాయి.
సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించే అంశం కొంతకాలంగా కర్ణాటక ప్రభుత్వంలో చర్చలో ఉంది. రాష్ట్ర ఐటీ, బయోటెక్నాలజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే అసెంబ్లీలో మాట్లాడుతూ.. యువతలో సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని బాధ్యతగా ఉంచే చర్యలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇక ఆరోగ్య మంత్రి దినేష్ గుండు రావు కూడా మాట్లాడుతూ.. పిల్లల్లో అధిక స్క్రీన్ టైమ్ వల్ల కలిగే సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే సురేష్ కుమార్ స్పందిస్తూ. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరిఎస్గా తీసుకోవాలని సూచించారు.
నిపుణుల అంచనా..
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించడం అంత సులభం కాదని అభిప్రాయపడ్డారు. 2025–26 ఆర్థిక సర్వే ప్రకారం యువతలో అధిక స్మార్ట్ఫోన్ వినియోగం వల్ల నిద్రలేమి, ఆందోళన, చదువుపై దృష్టి తగ్గడం వంటి సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొంది. పిల్లలు సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత సమాచారాన్ని తెలియకుండా పంచుకోవడం వల్ల గోప్యత సమస్యలు, సైబర్ నేరాలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆన్లైన్ గ్రేమింగ్ వంటి ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని పేర్కొంది. అయితే సోషల్ మీడియా పూర్తిగా ప్రతికూలం కాదని.. చాలా మంది విద్యార్థులకు ఇది విద్యా వనరులు, కోడింగ్ కమ్యూనిటీలు, సృజనాత్మక అవకాశాలు, వ్యాపార అవకాశాలను కూడా అందిస్తుందని అభిప్రాయపడ్డారు. అందుకే నిపుణులు పూర్తి నిషేధం కంటే వయస్సు పరిమితులు, పేరెంటల్ కంట్రోల్స్, డిజిటల్ అవగాహన కార్యక్రమాలు వంటి మధ్యంతర మార్గాలను అనుసరించడం మంచిదని సూచిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం.. దేశవ్యాప్తంగా సోషల్ మీడియా నియంత్రణపై మరింత చర్చకు దారి తీసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: అదిరిపోయే ఆఫర్లతో భారత్లో Google Pixel 10a అమ్మకాలు షురూ..!
తాజావార్తలు
-
Film Chamber: ఆ కలరింగ్ అంతా అబద్ధం.. ‘పెద్ది’ పర్సెంటేజ్ డీల్ను తిరస్కరించిన ఎగ్జిబిటర్లు
-
Virat Kohli: స్టాండ్స్లో ‘49’ హంగామా.. కోహ్లీ రియాక్షన్ మాములుగా లేదుగా..!
-
Methi Na Gota Recipe: వర్షం పడేటప్పుడు వేడివేడిగా.. గుజరాత్ స్పెషల్ క్రిస్పీ స్నాక్ రెసిపీ..!
-
Modi-Marco Rubio: వైట్హౌస్ను సందర్శించండి.. ట్రంప్ తరపున మోడీకి రూబియో ఆహ్వానం
-
Cockroach Janta Party: “బొద్దింకల పార్టీ”పై ఉక్కుపాదం.. అన్ని అకౌంట్లు క్లోజ్..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!