Pet Dog Shoots, Kills US Man Out On Hunting Trip: కుక్క తుపాకీని పేల్చుతుందని ఎవరైనా అనుకుంటారా..? కానీ ఇలా తుపాకీ కాల్పులకు ఓ కుక్క కారణం అయింది. తుపాకీని పేల్చి ఓ వ్యక్తిని హత్య చేసింది. ఈ ఘటన అమెరికాలోని సెంట్రల్ రాష్ట్రం అయిన కాన్సాస్ లో జరిగింది. బాధిత వ్యక్తి అతని పెంపుడు జంతువు శనివారం సరదాగా వేటకు విహారయాత్రకు వెళ్లారు. ఈ సమయంలోనే ఈ దుర్ఘటన జరిగింది.
California shooting: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి. లాస్ ఏంజిల్స్ కాల్పుల ఘటనలో 11 మంది మరణించి 48 గంటలు లోపే మరో సంఘటన జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కోకు దక్షిణంగా ఉత్తర కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బేలోని రెండు చోట్ల దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. ఇందులో రెండు కాల్పులు జరిగాయి. ఏడుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పనిచేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.…
Gun Fire : అమెరికాలో మళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉన్నత చదువుల కోసం చికాగో వెళ్లిన తెలంగాణ విద్యార్థిపై నల్ల జాతీయులు కాల్పులు జరిపారు. గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న కొప్పాల సాయి చరణ్ పై నల్ల జాతీయులు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో శరీరంలోకి బుల్లెట్లు దూసుకు వెళ్ళాయి.
Thieves attack Hindu temple in USA: హిందూ ఆలయాలపై విదేశాల్లో దాడులు ఆగడం లేదు. ఇటీవల వారం వ్యవధిలో ఆస్ట్రేలియాలో రెండు దేవాలయాలపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడులు చేశారు. అంతకు ముందు బ్రిటన్, కెనడా దేశాల్లో కూడా ఇలాగే హిందూ దేవాలయాలపై దుండగులు దాడులు చేసిన సంఘటనలు చూశాం. తాజాగా అమెరికాలో ఓ హిందూ దేవాలయంపై దొంగలు దాడి చేసి ఆలయంలోని విలువైన వస్తువులను దోపిడి చేశారు.
Aruna Millar: అగ్రరాజ్యంలో మరోసారి భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్గా అరుణా మిల్లర్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. అరుణ మేరీలాండ్ రాష్ట్రానికి 10వ లెఫ్టినెంట్ గవర్నర్.
అమెరికా తన సొంత యుద్ధ ట్యాంకులను పంపడానికి అంగీకరిస్తే రష్యాకు వ్యతిరేకంగా రక్షించడంలో సహాయపడటానికి జర్మనీ తయారు చేసిన ట్యాంకులను ఉక్రెయిన్కు పంపడానికి జర్మనీ అనుమతిస్తుందని బెర్లిన్ ప్రభుత్వం ప్రకటించింది.
Pakistan may lose major non-Nato ally status: పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది దాయాది దేశం పాకిస్తాన్. తమను రక్షించాలని పాశ్చాత్య దేశాలను అడుక్కుంటోంది. అక్కడి ప్రజలు కనీసం గోధుమ పిండి కూడా దొరకడం లేదు. గోధుమ పిండి కోసం అక్కడ ప్రజలు కొట్లాడుతున్నారు.
Indians See US As Biggest Military Threat After China, says Survey: భారత దేశానికి సైనిక పరంగా ముప్పు చైనా నుంచి పొంచి ఉందనేది అందరికి తెలిసిన విషయమే. చైనా నుంచే అతిపెద్ద సైనిక ముప్పు పొంచి ఉందని భారతీయులు విశ్వసిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. అయితే ఆ తరువాతి స్థానంలో అంతా పాకిస్తాన్ ఉంటుందని అనుకుంటారు.. కానీ, రెండో స్థానంలో అమెరికా నుంచి సైనిక ముప్పు ఉందని భారతీయులు ఓ సర్వేలో తెలిపారు.…
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) సోమవారం పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ఐఎస్ఐఎల్ (దాయెష్), అల్-ఖైదా ఆంక్షల కమిటీ కింద గ్లోబల్ టెర్రరిస్ట్గా జాబితా చేసింది.