Covid-19: కొవిడ్ పుట్టుక చైనా ల్యాబ్ నుంచే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid-19: కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనానే అని పలు దేశాలు నిందించిన సంగతి తెలిసింది. ఈ మహమ్మారి చైనా ల్యాబ్ నుంచి లీక్ అయ్యిందంటూ పలు వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే తాజాగా కొవిడ్ పుట్టుక చైనాకు చెందిన ల్యాబ్ నుంచే జరిగిందని అమెరికాకు చెందిన కీలకమైన ఎనర్జీ డిపార్ట్మెంట్ తెలిపింది. ఈ విషయంపై అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కచ్చితమైన అభిప్రాయానికి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అవ్రిల్ హైన్స్ కార్యాలయం గుర్తించినట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.అమెరికాలోని అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో జాతీయ రీసెర్చ్ సెంటర్ను ఆ సంస్థ పర్యవేక్షిస్తుంది. గతంలో ఇదే ఎనర్జీ డిపార్ట్మెంట్ వైరస్ ఎలా పుట్టిందనేది నిర్ణయించబడలేదని చెప్పింది. కానీ ఇప్పుడూ తాజాగా 2021లో ఇచ్చిన నివేదికను నవీకరిస్తూ వ్యూహాన్ ల్యాబ్ లీక్ వల్లే ఆ మహమ్మారి ఉద్భవించిందని పేర్కొనడం గమనార్హం.
Read Also: Zelensky: వ్లాదిమిర్ పుతిన్ తన దగ్గర వాళ్లతోనే చంపబడతాడు.. జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు
Also Read
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
- 20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
గతంలో అమెరికాకు చెందిన పలు డిపార్ట్మెట్లు కరోనా పుట్టుకపై అనేక అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. తాజాగా 5 పేజీల నివేదికతో ఎనర్జీ డిపార్ట్మెంట్ కూ చైనా వైపే చూపించింది. ఇదిలా ఉండగా,..నాలుగు ఏజెన్సీలు కరోనా సహజంగానే పుట్టుకొచ్చిందని విశ్వస్తుండగా, మరో రెండు ఏజెన్సీలు ఏ విషయాన్ని నిర్థారించలేదు. ఏదీఏమైన ఈ కరోనా విషయంపై పలు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయని జాతీయ భద్రతా సలహదారు జేకే సుల్లివిన్ వెల్లడించారు. గతంలో ఎఫ్బీఐ కూడా చైనాలోని ల్యాబ్ నుంచి ప్రమాదవశాత్తు వైరస్ లీకై ఉంటుందని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఇప్పటికే పలు ఇంటెలిజెన్స్ సంస్థలను కరోనా మహమ్మారిపై వీలైనంత ఎక్కవ సమాచారం సేకరించాలని సూచించారు. ఏజెన్సీ తమ పరిశోధనలు విరమించుకుంటున్నట్లు వస్తున్న వార్తలను కూడా ఖండించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా ఉద్భవం గురించి ప్రకటించేవరకు తమ పరిశోధనలు కొనసాగుతున్నాయని ఎనర్జీ డిపార్ట్మెంట్ ప్రకటించింది.
తాజావార్తలు
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి