అగ్ర రాజ్యం అమెరికాను మంచు తుఫాన్ గడగడలాడిస్తోంది. అనేక రాష్ట్రాల్లో మంచు తుఫాన్ దుప్పటి కప్పేసింది. ఇక న్యూయార్క్ నగరమైతే స్తంభించిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో లక్షలాది కుటుంబాల్లో అంధకారం అలుముకుంది. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితి విధించారు.
ప్రపంచ సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేయడంపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకర్లతో మాట్లాడుతూ న్యాయమూర్తులపై విరుచుకుపడ్డారు. ‘‘రాడికల్-లెఫ్ట్ డెమొక్రాట్లు మూర్ఖులు.. లాప్డాగ్లు’’ అంటూ ధ్వజమెత్తారు.
అధ్యక్షుడు ట్రంప్కు అమెరికా అత్యున్నత న్యాయస్థానంలో భారీ ఎదురుదెబ్బ తగలింది. గ్లోబుల్ టారిఫ్లను కొట్టేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ పరిణామంపై ట్రంప్కు భారీ షాక్ తగిలినట్లైంది.
అమెరికాకు చెందిన పాక్స్ సెలికాలో భారత్ చేరింది. ఈ మేరకు ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్లో ప్రకటించింది. అంతేకాకుండా కూటమిలో చేరుతున్నట్లు భారత్ సంకతం కూడా చేసింది. అమెరికా రాయబారి సెర్గియో గోర్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ సమక్షంలో సంతకాలు జరిగాయి. భారత్ చేసిన సంతకంతో కీలక ఖనిజాల ఉత్పత్తి, కృత్రిమ మేధ వంటి రంగాల్లో రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ప్రపంచం భారత్ను విశ్వసిస్తోందన్నారు. భారత్లో నిపుణుల…
ట్రంప్ నేతృత్వంలో గురువారం వాషింగ్టన్లో గాజా పునర్నిర్మాణంపై బోర్డ్ ఆఫ్ పీస్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి భారత్తో పాటు దాయాది దేశం పాకిస్థాన్ సహా పలు దేశాధినేతలంతా హాజరయ్యారు.
‘‘సుబ్బి పెళ్లి.. వెంకి చావు’’కు వచ్చినట్లుంది మిత్రదేశాల మధ్య సంబంధం. ఇరాన్పై దాడికి అగ్ర రాజ్యం కసరత్తు చేస్తుండగా మిత్రదేశాలైన అమెరికా-బ్రిటన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి.
మధ్యప్రాచ్యంలో మరో భీకర యుద్ధం జరగబోతుందా? సుదీర్ఘ కాలం ఉద్రిక్తలు తలెత్తబోతున్నాయా? క్షిపణి, రాకెట్, డ్రోన్ దాడులతో దద్దరిల్లబోతుందా? అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
మధ్యప్రాచ్యంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన రెండో విడత అణు చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో రెండు దేశాల మధ్య సవాళ్లు-ప్రతి సవాళ్లు జరుగుతున్నాయి.