ఇంటర్నేషనల్ ఓటీటీ సర్వీసుల కంపెనీ అమెజాన్ ప్రైమ్ వీడియో.. సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఇండియన్ కస్టమర్ల కోసం 599 రూపాయలకే ఏడాది పాటు సబ్స్క్రిప్షన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. గతంలో ఈ ఆఫర్ కేవలం ఎయిర్టెల్ వినియోగదారులకే ఉండేది. ఇప్పుడు అన్ని టెలికం కంపెనీల కస్టమర్లకు విస్తరించింది. అయితే ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్నవాళ్లు ఒక వినియోగదారుడు, ఒక స్మార్ట్ఫోన్లో మాత్రమే ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ సర్వీసులను పొందుతారు.
OTT Updates: హిట్, ఫ్లాప్లతో సంబంధం లేకుండా కెరీర్లో వైవిధ్యభరిత సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న కోలీవుడ్ హీరో ఎవరంటే అది ధనుష్ మాత్రమే. ఓ నటుడిగా ఎప్పటికప్పుడు ఆడియన్స్కు కొత్త అనుభూతి పంచుతున్న ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ నేనే వస్తున్నా. ఈ మూవీ సెప్టెంబర్ 29న విడుదలై బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్గా నిలిచింది. వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించాడు. యువన్ శంకర్ రాజా…
Nithya Menon : సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు నిత్యమీనన్. దీంతో దక్షిణాది సినిమాలు చేస్తూ పేరు, పలుకుబడి తెచ్చుకున్నారు.
Amazon Prime: ప్రస్తుతం ప్రేక్షకుల చూపు మొత్తం ఓటిటీల మీదనే ఉంది అంటే అతిశయోక్తి కాదు. సినిమా మంచి టాక్ వస్తేనే తప్ప థియేటర్ల ముఖం చూడడం లేదు ప్రేక్షకుడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. మే 12న వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ఈ సినిమాను మహేష్ బాబు అభిమానులు బాగా ఆదరించారు. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత వినోదం, సెకండ్ హాఫ్లో లేదని సగటు సినిమా ప్రేక్షకుడు పెదవి విరిచినా, కలెక్షన్లను మాత్రం ఈ సినిమా బాగానే రాబట్టింది. దానికి తోడు సినిమా విడుదలైన అంతకు ముందు చిత్రీకరించిన మరో పాటను జత…
తెలుగులో పలు చిత్రాలలో హీరోగా నటించిన వ్యక్తి స్వర్గీయ రాజేశ్. అతని కుమార్తె ఐశ్వర్య ప్రస్తుతం తమిళనాట పాపులర్ హీరోయిన్. తెలుగులోనూ పలు చిత్రాలలో నటించిన ఐశ్వర్య రాజేశ్ ఇప్పుడు ‘సుడల్’ అనే వెబ్ సీరిస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తోంది. ‘విక్రమ్ వేద’ దర్శకులు పుష్కర్ – గాయత్రి రూపొందించిన ఈ ఇన్వెస్టిగేటివ్ డ్రామాను అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ నెల 17న ప్రసారం చేయబోతున్నారు. ఇందులో మొదటి నాలుగు ఎపిసోడ్స్ ను బ్రహ్మ…