KTR: ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత ఎక్కడ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాష్ట్ర కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని, ముఖ్యంగా ఆరు గ్యారెంటీలకు ఇప్పటివరకు చట్టబద్ధత కల్పించలేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని గతంలో గవర్నర్ ప్రసంగంలో చెప్పించినప్పటికీ ఇప్పటికి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఎలాంటి చట్టబద్ధత లేదని కేటీఆర్ అన్నారు. ఈ అంశంపై రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తామని అన్నారు.
Also Read
- New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్ఫోన్ విడుదల..
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్కు క్వాలిఫై..
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రైతు బంధు సమయానికి అందేదని, కానీ ప్రస్తుతం రైతులు పంటలు కోయడానికి వచ్చినా.. రైతు బంధు గురించి ప్రభుత్వం నుంచి స్పష్టత లేదని కేటీఆర్ విమర్శించారు. “రాహుల్ బంధు కాదు.. రైతు బంధు వేయండి అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బలహీన వర్గాల కోసం ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని ప్రభుత్వం చెప్పిందని, కానీ ఇప్పటికే రెండు బడ్జెట్లు పూర్తయ్యినా ఆ దిశగా స్పష్టత కనిపించలేదని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు అంబేద్కర్ అభయహస్తం పథకం కింద 12 లక్షలు ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు అమలు కాలేదని ఆరోపించారు.
రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని కేటీఆర్ అన్నారు. అలాగే జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పటికీ కొత్త ఉద్యోగాలు కనిపించడం లేదని విమర్శించారు. మహిళలకు ఇవ్వాల్సిన హామీలు, వృద్ధులకు 4000 రూపాయల పెన్షన్, రైతులకు రైతు భరోసా, రైతు కూలీలకు నెలకు 1000 రూపాయల సహాయం వంటి అంశాలు ఇంకా అమలు కాలేదని.. ఆటో డ్రైవర్లకు ఇవ్వాల్సిన సహాయం కూడా పెండింగ్లో ఉందని పేర్కొన్నారు.
Vaibhav Suryavanshi: ఐపీఎల్లో ఆ దిగ్గజం రికార్డ్ను బద్ధలుకొడుతా.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సుమారు 10 వేల కోట్ల వరకు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. ఈ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ నిర్మించిన బలమైన రాష్ట్రాన్ని ప్రస్తుత ప్రభుత్వం సరిగా నిర్వహించలేకపోతోందని, వ్యవస్థలో అవ్యవస్థలు నెలకొన్నాయని.. తెలంగాణను ఒక ఏటీఎంగా మార్చి ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఈ అన్ని అంశాలపై రాబోయే సమావేశాల్లో ప్రజల తరపున పోరాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!