Ajit Pawar Plane Crash: ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు.. పైలట్ ఏం చేశాడంటే..!
- అజిత్ పవార్ విమాన ప్రమాదంపై దర్యాప్తు
- వెలుగులోకి వచ్చిన కీలక విషయాలు
- ప్రాథమిక దర్యాప్తులో సంచలన అంశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అజిత్ పవార్ విమాన ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు బృందాలు శోధిస్తున్నాయి. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) బృందం కీలక సమాచారాన్ని సేకరించినట్లుగా తెలుస్తోంది. బుధవారం ప్రమాదం జరగగానే ఢిల్లీ నుంచి హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని (ఏఏఐబీ) కీలక ఆధారాలను సేకరించింది.
అయితే తాజాగా ఈ విమాన ప్రమాదానికి పైలట్ నిర్లక్ష్యమే కారణంగా ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లుగా వర్గాలు పేర్కొంటున్నాయి. పైలట్ తప్పిదం కారణంగానే ఈ ఘోరం జరిగినట్లుగా అధికారులు అనుమానిస్తున్నట్లు వర్గాలు చెబుతున్నాయి.
Also Read
- Rajya Sabha Poll: జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో సంచలనం.. కాంగ్రెస్కు షాక్, ఎన్డీయే అభ్యర్థి విజయం
- PM Modi: ఈ ఏడాది భారత్-యూరప్ సంబంధాలు బలపడ్డాయి.. వివాటెక్ ఈవెంట్లో పాల్గొన్న మోడీ
- Ranchi RSS attack: ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడి.. నిందితుడి ఎన్కౌంటర్, గాయాలు..
- Modi-Trump: జీ7 వేదికగా మోడీతో దిగిన ఆసక్తికర ఫొటో షేర్ చేసిన ట్రంప్
పైలట్ రన్వేను తప్పుగా అంచనా వేయడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. మొదటి ల్యాండింగ్కు కుదరనప్పుడు.. రెండో ల్యాండింగ్కు సిద్ధపడుతున్న తరుణంలో పైలట్ పొరపాటు చేసినట్లుగా ప్రాథమిక పరిశోధనలో వెల్లడైనట్లుగా వర్గాలు చెబుతున్నాయి. ల్యాండింగ్ సమయంలో విజిబిలిటీ సరిగా లేదని.. ఆ సమయంలో వెంటనే పూణెకు మళ్లించి ఉండవచ్చని నివేదించింది. కానీ పైలట్ మాత్రం ఆ పని చేయలేనట్లుగా కనిపించింది. అయినా కూడా పైలట్ విమానాన్ని తిరిగి సమలేఖనం చేయడానికి ప్రయత్నించాడని.. ఓ వైపు వేగం.. ఇంకో వైపు ల్యాండింగ్కు ఆలస్యమైనట్లుగా కనిపించినట్లుగా వర్గాలు చెబుతున్నాయి. అయితే వీఐపీ విమానాలు, హెలికాప్టర్ కార్యకలాపాల్లో ఇది సర్వసాధారణంగా జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. సమయానికి ల్యాండ్ చేయడానికి ఒత్తిడి ఉన్నట్లుగా ప్రాథమిక దర్యాప్తులు సూచిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: UK-China: అమెరికాకు దూరమవుతోన్న మిత్ర దేశాలు.. చైనాతో బ్రిటన్ కీలక ఒప్పందం
బుధవారం ఉదయం 8:10 గంటలకు ముంబై నుంచి బారామతికి విమానం బయల్దేరింది. బారామతి ఎయిర్పోర్టులో ల్యాండింగ్కు సిద్ధపడుతున్న తరుణంలో కూలిపోయింది. ఈ విమానంలో అజిత్ పవార్తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి విదీప్ జాదవ్, కో పైలట్ పింకీ మాలి, పైలట్ ఇన్ కమాండ్ సుమిత్ కపూర్, పైలట్ సెకండ్ ఇన్ కమాండ్ శాంభవి పాఠక్ ఉన్నారు. మొత్తం అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) బృందం దర్యా్ప్తు చేస్తోంది. ఇక గురువారం బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు, ఏపీ మంత్రి నారా లోకేష్, పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: Ajit pawar: బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియలు పూర్తి.. హాజరైన అమిత్ షా, రాష్ట్ర మంత్రులు
తాజావార్తలు
-
Israel: అమెరికా-ఇరాన్ ఒప్పందంతో మాకు సంబంధం లేదు.. దక్షిణ లెబనాన్పై చర్యలు కొనసాగుతాయన్న ఇజ్రాయెల్
-
CM Revanth Reddy : ఎల్బీనగర్ నా సొంతూరు లాంటింది.. కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలేదే లేదు
-
Aqua Feed Price Reduction: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. సీఎం జోక్యంతో తగ్గిన ఫీడ్ ధరలు
-
CM Revanth Reddy : కబ్జాదారుల వీపులు సున్నం చేస్తాం.. హైడ్రా పేదల జోలికి వెళ్లదు
-
YS Jagan: సాయికృష్ణ కుటుంబాన్ని ఓదార్చిన జగన్.. కృష్ణలంక ఘటనలపై సీరియస్.. సీబీఐ విచారణకు డిమాండ్..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..