Ajit Pawar Plane Crash: ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు.. పైలట్ ఏం చేశాడంటే..!
- అజిత్ పవార్ విమాన ప్రమాదంపై దర్యాప్తు
- వెలుగులోకి వచ్చిన కీలక విషయాలు
- ప్రాథమిక దర్యాప్తులో సంచలన అంశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అజిత్ పవార్ విమాన ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు బృందాలు శోధిస్తున్నాయి. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) బృందం కీలక సమాచారాన్ని సేకరించినట్లుగా తెలుస్తోంది. బుధవారం ప్రమాదం జరగగానే ఢిల్లీ నుంచి హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని (ఏఏఐబీ) కీలక ఆధారాలను సేకరించింది.
అయితే తాజాగా ఈ విమాన ప్రమాదానికి పైలట్ నిర్లక్ష్యమే కారణంగా ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లుగా వర్గాలు పేర్కొంటున్నాయి. పైలట్ తప్పిదం కారణంగానే ఈ ఘోరం జరిగినట్లుగా అధికారులు అనుమానిస్తున్నట్లు వర్గాలు చెబుతున్నాయి.
Also Read
- Reservation Hatao Andolan: "రిజర్వేషన్లు రద్దు చేయాలి".. సీజేపీ తరహాలో మరో ఉద్యమం.. లక్షల్లో ఫాలోవర్స్!
- Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
- NEET-UG 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో కీలక పరిణామం.. 13 మందిపై సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు.!
- EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
పైలట్ రన్వేను తప్పుగా అంచనా వేయడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. మొదటి ల్యాండింగ్కు కుదరనప్పుడు.. రెండో ల్యాండింగ్కు సిద్ధపడుతున్న తరుణంలో పైలట్ పొరపాటు చేసినట్లుగా ప్రాథమిక పరిశోధనలో వెల్లడైనట్లుగా వర్గాలు చెబుతున్నాయి. ల్యాండింగ్ సమయంలో విజిబిలిటీ సరిగా లేదని.. ఆ సమయంలో వెంటనే పూణెకు మళ్లించి ఉండవచ్చని నివేదించింది. కానీ పైలట్ మాత్రం ఆ పని చేయలేనట్లుగా కనిపించింది. అయినా కూడా పైలట్ విమానాన్ని తిరిగి సమలేఖనం చేయడానికి ప్రయత్నించాడని.. ఓ వైపు వేగం.. ఇంకో వైపు ల్యాండింగ్కు ఆలస్యమైనట్లుగా కనిపించినట్లుగా వర్గాలు చెబుతున్నాయి. అయితే వీఐపీ విమానాలు, హెలికాప్టర్ కార్యకలాపాల్లో ఇది సర్వసాధారణంగా జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. సమయానికి ల్యాండ్ చేయడానికి ఒత్తిడి ఉన్నట్లుగా ప్రాథమిక దర్యాప్తులు సూచిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: UK-China: అమెరికాకు దూరమవుతోన్న మిత్ర దేశాలు.. చైనాతో బ్రిటన్ కీలక ఒప్పందం
బుధవారం ఉదయం 8:10 గంటలకు ముంబై నుంచి బారామతికి విమానం బయల్దేరింది. బారామతి ఎయిర్పోర్టులో ల్యాండింగ్కు సిద్ధపడుతున్న తరుణంలో కూలిపోయింది. ఈ విమానంలో అజిత్ పవార్తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి విదీప్ జాదవ్, కో పైలట్ పింకీ మాలి, పైలట్ ఇన్ కమాండ్ సుమిత్ కపూర్, పైలట్ సెకండ్ ఇన్ కమాండ్ శాంభవి పాఠక్ ఉన్నారు. మొత్తం అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) బృందం దర్యా్ప్తు చేస్తోంది. ఇక గురువారం బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు, ఏపీ మంత్రి నారా లోకేష్, పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: Ajit pawar: బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియలు పూర్తి.. హాజరైన అమిత్ షా, రాష్ట్ర మంత్రులు
తాజావార్తలు
-
Income Tax: భారత్లో పెరుగుతున్న కుబేరులు.. 300% పెరిగిన శతకోటీశ్వరులు.. రూ.100 కోట్ల క్లబ్లో 576 మంది
-
Australia Greatest Captain: ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో గొప్ప కెప్టెన్ ఎవరు?.. రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్లను జుజుబి అన్న ఫించ్!
-
Allu Arjun: ‘ఐకాన్జా’తో మరో అడుగు.. హైదరాబాద్లో అల్లు అర్జున్ భారీ కార్పొరేట్ ప్రాజెక్ట్?
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్.. మహిళా ట్రైనీ ఐపీఎస్కు వైద్య పరీక్షలు!
-
Reservation Hatao Andolan: “రిజర్వేషన్లు రద్దు చేయాలి”.. సీజేపీ తరహాలో మరో ఉద్యమం.. లక్షల్లో ఫాలోవర్స్!
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?