Ajit Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ ఈరోజు (బుధవారం) ఉదయం విమాన ప్రమాదంలో చనిపోయారు. ఆయన ముంబై నుంచి బారామతికి లియర్జెట్ 45 విమానంలో వెళ్లారు. అయితే, ల్యాండింగ్కు కొన్ని క్షణాల ముందు రన్ వేకు పక్కనే విమానం క్రాష్ ల్యాండ్ అయింది. వెంటనే పెద్ద మంటలు చెలరేగి అందులో ఉన్న ఐదుగురు మరణించారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణించిన చార్టర్డ్ విమానం ‘లియర్ జెట్ 45’ (Learjet 45) బొంబార్డియర్ సంస్థకు చెందినది. ఈ సంస్థ తయారుచేసే గ్లోబల్ సిరీస్, ఛాలెంజర్ సిరీస్ విమానాలు ప్రపంచవ్యాప్తంగా విలాసానికి, వేగానికి మారుపేరు. అందుకే ప్రపంచంలోని అత్యంత ధనవంతులు తమ ప్రయాణాల కోసం ఈ జెట్లనే ఎంచుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ తారలు , రాజకీయ నాయకులు బొంబార్డియర్ విమానాలను సొంతంగా కలిగి ఉన్నారు లేదా లీజుకు తీసుకుని…
ముంబై నుంచి బారామతికి బయలుదేరిన అజిత్ పవార్ విమానం ఉదయం 8:45 – 9:15 గంటల మధ్య ప్రమాదానికి గురైంది. బారామతి విమానాశ్రయ రన్వేపై దిగడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో విమానంలో తీవ్రమైన సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం రన్వేకు బదులుగా సమీపంలోని పొలాల్లోకి దూసుకెళ్లి భూమిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం ముక్కలుగా విరిగిపోవడంతో పాటు భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు…
Ajit Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ మరణం తీవ్ర విషాదంగా మారింది. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం క్రాష్ ల్యాండ్ అయింది. దీంతో విమానంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో సహా అందరూ మరణించారు. దీంతో, మహాయుతి సర్కార్లో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ ఇప్పుడు పెద్ద దిక్కును కోల్పోయింది. ఆయన మృతదేహాన్ని పూణేకు తరలించారు. రేపు ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి.
Ajit Pawar: బాబాయ్ చాటు అబ్బాయిలా రాజకీయాల్లోకి దిగి.. మహారాష్ట్రా పాలిటిక్స్లో ‘పవార్’ మార్క్ను క్రియేట్ చేసిన ప్రముఖ రాజకీయ నాయకుడు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజిత్ పవార్. మహారాష్ట్రలో రాబోయే జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికల ప్రచారం కోసం బారామతిలో ఏర్పాటు చేసిన నాలుగు బహిరంగ సమావేశాలలో పాల్గొనడానికి బుధవారం (జనవరి 28) ఉదయం 8 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో ముంబయి నుంచి బారామతికి బయలుదేరారు. అయితే బారామతి…
బారామతి విమాన ప్రమాదం యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోవడం పట్ల రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
బారామతి విమాన ప్రమాదం మహారాష్ట్రలో తీవ్ర విషాదాన్ని నింపింది. విమానం కూలి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కార్యకర్తలు, నాయకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Political Leaders Plane Crashes: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేడు (బుధవారం) విమాన ప్రమాదంలో మృతి చెందడం దేశవ్యాప్తంగా విషాద ఛాయలను మిగిలించింది. గత ఏడాది జూన్ 2025లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకముందే.. కేవలం ఏడు నెలల వ్యవధిలోనే మరో ప్రముఖ జాతీయ నాయకుడు ఈ విధంగా మృతి చెందడం దేశ రాజకీయ వర్గాలను విషాదంలో ముంచింది. భారత రాజకీయ చరిత్రను పరిశీలిస్తే…
మహారాష్ట్ర స్థానిక ఎన్నికల సమయంలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్థానిక ఎన్నికల కోసం శరద్ పవార్-అజిత్ పవార్ కుటుంబాలు మళ్లీ ఏకమయ్యాయి. ముంబై, పింప్రి-చించ్వాడ్, పూణె సహా మహారాష్ట్ర అంతటా 29 మునిసిపల్ కార్పొరేషన్లకు జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి.
Ajit Pawar Warns Voters: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే నిధుల సమస్య అనేదే లేకుండా చేస్తాం, ఓటు వేయకుంటే మాత్రం, తామూ పట్టించుకోమని ఓటర్లను హెచ్చరించారు.