మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ముచ్చటగా మూడోసారి ఫడ్నవిస్ సీఎంగా ప్రమాణం చేశారు. గురవారం ముంబైలోని ఆజాద్ మైదాన్లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఫడ్నవిస్ చేత గవర్నర్ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు.
మహాయుతి కూటమి అధికారంలోకి వచ్చిన 11 రోజుల తర్వాత ఉత్కంఠకు తెరపడి బుధవారం జరిగిన కీలక సమావేశంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ను ఎంపిక చేసినట్లు బీజేపీ నాయకత్వం ఖరారు చేసింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం ప్రమాణస్వీకారోత్సవం ఈరోజు సాయంత్రం ముంబైలోని ఆజాద్ మైదాన్లో జరగనుంది.
మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న అనిశ్చితి ఎట్టకేలకు తొలగింది. నవంబర్ 23న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి (శివసేన, బీజేపీ, ఎన్సీపీ) కూటమి ఘన విజయం సాధించింది.
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు ఈ రోజు జరిగిన బీజేపీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరింది. రేపు సాయంత్రం 5 గంటలకు ముంబైలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగబోతోంది.
Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిసెంబర్ 05న మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో మంగళవారం దేవేంద్ర ఫడ్నవీస్, ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిండేని కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన మొదలైన తర్వాత తొలిసారి ఫడ్నవీస్, షిండే సమావేశమయ్యారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక డైలీ సీరియల్గా కొనసాగుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి దాదాపుగా 9 రోజులైంది. కానీ ఈరోజుకి సీఎం అభ్యర్థి పేరు ప్రకటించలేదు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది. దాదాపు 9 రోజులవుతున్నా.. ఇంకా సీఎం అభ్యర్థి ఎవరనేది తేల్చలేకపోయారు. ఇదిలా ఉంటే ఈ అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని నియమించారు.
Ajit Pawar: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి గెలిచి వారం గడిచింది. అయితే, ఇంకా ముఖ్యమంత్రి ఎవరనేదానిపై క్లారిటీ రాలేదు. ఢిల్లీలోని బీజేపీ పెద్దలు, ముంబైలో రాష్ట్ర నేతలతో బీజేపీ, దాని మిత్ర పక్షాలు ఎన్సీపీ, శివసేనలు చర్చలు జరుపుతున్నాయి. తాజాగా డిసెంబర్ 05న కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ రోజే ముఖ్యమంత్రి, మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేస్తుందని బీజేపీ ఈ రోజు స్పష్టం చేసింది.
Maharashtra: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చి వారం గడిచింది. బీజేపీ నేతృత్వంలోని ఏక్ నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీల ‘‘మహాయుతి’’ కూటమి ఘన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాల్లో 233 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ ఒంటరిగా 132 స్థానాలు సాధించి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయితే, మహాయుతి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.