Ajit Pawar Plane Crash: అజిత్ పవార్ విమాన ప్రమాద కేసులో బిగ్ ట్విస్ట్! బ్లాక్ బాక్స్ సమాచారంపై..!
- అజిత్ పవార్ విమాన ప్రమాద కేసులో బిగ్ ట్విస్ట్!
- వేడికి దెబ్బతిన్న రెండు ఫ్లైట్ రికార్డర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దివంగత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదం కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన తర్వాత ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు చేపట్టింది. ప్రమాద స్థలం నుంచి బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. అయితే తాజాగా విమానంలో ఉన్న రెండు ఫ్లైట్ రికార్డర్లు తీవ్రమైన వేడి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయని గుర్తించింది. దీంతో సమాచారాన్ని సేకరించేందుకు తంటాలు పడుతోంది. ఈ నేపథ్యంలో కాక్పిట్ ఆడియో డేటాను సేకరించేందుకు విదేశీ సహాయాన్ని కోరాయి. భారత దర్యాప్తు సంస్థలు ప్రత్యేక విదేశీ సహాయం కోరినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Emmanuel Macron: ముంబై రోడ్లపై సామాన్యుడిలా ఫ్రెంచ్ అధ్యక్షుడు జాగింగ్.. వీడియో వైరల్
Also Read
- Ramachandra Rao: కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Mamata Banerjee: రాజీనామాకు ససేమిరా.. సుప్రీంకోర్టుకు మమతా బెనర్జీ..
- MK Stalin-Rajinikanth: స్టాలిన్ను కలిసిన రజనీకాంత్.. మాజీ సీఎంకు ఓదార్పు
- Bengal Political Crisis: మమత కోటలో అధికారులు ఖాళీ.. మాజీ సీఎస్ నుంచి అడ్వకేట్ జనరల్ వరకు వరుసగా రాజీనామాలు!
విమానంలో రెండు స్వతంత్ర ఫ్లైట్ రికార్డర్లు ఉన్నాయి. ఒకటి డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (DFDR). రెండోది కాక్పిట్ వాయిస్ రికార్డర్ (CVR) ఉంది. ప్రమాదం సమయంలో రెండు పరికరాలు ఎక్కువసేపు వేడికి గురి కావడంతో దెబ్బతిన్నట్లుగా మంత్రిత్వ శాఖ తెలిపింది. నష్టం జరిగినప్పటికీ L3-కమ్యూనికేషన్స్ తయారు చేసిన DFDRని ఫ్లైట్ రికార్డర్ లాబొరేటరీలో AAIB విజయవంతంగా డౌన్లోడ్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే హనీవెల్ తయారు చేసిన CVRను సేకరించేందుకు ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే విదేశీ సహాయం కోరాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: UP: ఏడు ప్రమాణాల తర్వాత షాకింగ్ ట్విస్ట్.. ఆగిపోయిన పెళ్లి
జనవరి 28న అజిత్ పవార్ ముంబై నుంచి బారామతికి బయల్దేరారు. బారామతిలో ల్యాండింగ్ జరుగుతుండగా ప్రమాదశాత్తు కూలిపోయింది. దీంతో అజిత్ పవార్తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదంపై ఎన్సీపీ అనుమానాలు వ్యక్తం చేయడంతో దర్యాప్తు బృందాలు సీరియస్గా తీసుకున్నారు.
తాజావార్తలు
-
Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..
-
Ramachandra Rao: కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
-
Mamata Banerjee: రాజీనామాకు ససేమిరా.. సుప్రీంకోర్టుకు మమతా బెనర్జీ..
-
MK Stalin-Rajinikanth: స్టాలిన్ను కలిసిన రజనీకాంత్.. మాజీ సీఎంకు ఓదార్పు
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!