Drone Attack on Dubai Airport: దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. భయాందోళనలో ప్రయాణికులు..!
- దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి..
- డ్రోన్ ఢీకొట్టడంతో విమానాశ్రయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం
- విమానాశ్రయ కార్యకలాపాలు కొంతసేపు అంతరాయం
- భయాందోళనలో ప్రయాణికులు..
Drone Attack on Dubai Airport: ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద భద్రతా ఉల్లంఘన చోటుచేసుకుంది. డ్రోన్ దాడి కారణంగా విమానాశ్రయం సమీపంలో అగ్నిప్రమాదం సంభవించడంతో అక్కడి కార్యకలాపాలు కొంతసేపు అంతరాయం కలిగాయి. ఈ ఘటనతో అక్కడి ప్రజలు, ప్రయాణికులు భద్రతపై ఆందోళన చెందుతున్నారు. నేడు ఉదయం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీగా పొగ ఎగసిపడుతున్న దృశ్యాలు కనిపించాయి. దీనిపై స్పందించిన దుబాయ్ మీడియా ఆఫీస్ అధికారులు ఒక డ్రోన్ విమానాశ్రయం సమీప ప్రాంతాన్ని ఢీకొట్టడంతో భారీగా అగ్నిప్రమాదం సంభవించిందని తెలిపారు.
Today Astrology: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు. అయితే మంటల కారణంగా విమానాశ్రయ కార్యకలాపాలకు భారీగా అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన కారణంగా విమానాశ్రయంలో రోజువారీ కార్యకలాపాలు స్తంభించాయి. పలు ఎయిర్ లైన్స్ తమ విమానాల షెడ్యూల్ లలో మార్పులు చేయాల్సి వచ్చింది. కొన్ని విమానాలు ఆలస్యంగా బయలుదేరగా, మరికొన్నింటిని ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే అత్యవసర సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిమాపక సిబ్బంది, సివిల్ డిఫెన్స్ బృందాలు సమన్వయంతో పనిచేసి కొద్ది సమయంలోనే పరిస్థితిని నియంత్రించాయి. ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. డ్రోన్ దాడి ఎలా జరిగింది, దాని వెనుక ఉన్న కారణాలు ఏమిటి అనే అంశాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నష్టం ఎంత మేరకు జరిగిందో పూర్తిగా అంచనా వేసిన తరువాతే విమానాశ్రయం పూర్తిస్థాయి కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయని అధికారులు తెలియచేశారు.
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!