Ajit Pawar Plae Crash: ‘‘నాన్నా.. డిప్యూటీ సీఎంతో బారామతి వెళ్తున్నా’’.. కో-పైలట్ చివరి మాటలు
- బారామతి విమాన ప్రమాదంలో ఐదుగురు మృతి
- కో-పైలట్ పింకీ మాలి దుర్మరణం
- బయల్దేరే ముందు తండ్రితో మాట్లాడిన పింకీ మాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బారామతి విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో పాటు ఇద్దరు పైలట్లు, ఇద్దరు సహాయకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ దుర్ఘటన దేశ వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే తాజాగా కో-పైలట్ పింకీ మాలి తన తండ్రితో మాట్లాడిన మాటలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
బుధవారం ఉదయం 8 గంటలకు ముంబై నుంచి బారామతికి విమానం బయల్దేరింది. అంతక ముందు కో-పైలట్గా ఉన్న పింకీ మాలి తన తండ్రి శివకుమార్ మాలితో ఫోన్లో మాట్లాడింది. ‘‘నాన్నా.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో కలిసి బారామతికి వెళ్తున్నాను. దింపేసిన తర్వాత అక్కడ నుంచి నాందేడ్ వెళ్తాను. మనం రేపు మాట్లాడుకుందాం.’’ అని తన కూతురు మాట్లాడిందంటూ తండ్రి శివకుమార్ గుర్తుచేసుకుంటూ విలపించారు. రేపటి రోజు ఇక ఎప్పటికీ రాదని ఆవేదన చెందారు.
Also Read
- PM Modi Three-Nation Tour: మూడు దేశాల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ.. పూర్తి వివరాలు
- Blue Aadhaar Card: బ్లూ ఆధార్ కార్డుపై కీలక అప్డేట్.. పిల్లల గుర్తింపుకు సంబంధించిన ఈ సేవ ఆ తేదీ వరకు ఫ్రీ..!
- Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య కేసులో షాకింగ్ విషయాలు.. దొంగిలించిన డబ్బుతో కార్లు, ఖరీదైన ఫోన్లు, గిఫ్ట్లు..!
- Ayodhya Ram Mandir Trust: నేటి అయోధ్య ట్రస్ట్ భేటీపై ఉత్కంఠ.. ఐదు ప్రధాన అజెండాలు
‘‘నేను నా కూతురిని కోల్పోయాను. ఇలాంటి సంఘటనలు గురించి నాకు సాంకేతిక పరిజ్ఞానం లేదు. ఏం జరిగిందో కచ్చితంగా చెప్పలేను. నేను పూర్తిగా కోల్పోయాను. నా కూతురి అంత్యక్రియలు గౌరవంగా నిర్వహించుకునేలా మృతదేహాన్ని అప్పగించాలని కోరుకుంటున్నా. నేను కోరుకునేది ఇదే..’’ అని తండ్రి శివకుమార్ డిమాండ్ చేశాడు.
ఇది కూడా చదవండి: Ajit Pawar: నేడు బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియలు.. హాజరుకానున్న అమిత్ షా
ముంబైలో బుధవారం ఉదయం 8:10 గంటలకు బారామతికి బయల్దేరింది. ఉ.8:42కి మొదటి ల్యాండింగ్ సిద్ధపడింది. కానీ సాధ్యం కాలేదు. రెండోసారి ఉ.8:45కి సిద్ధపడింది. మూడోసారి రాడర్తో సంబంధం తెగిపోయి ఉదయం 8:50కి విమానం కూలిపోయింది. బారామతి ఎయిర్పోర్టుకు 100 మీటర్ల దూరంలో విమానం కూలిపోయింది. ఒక్కసారిగా మంటలు అంటుకుని కాలిపోయారు. విమానంలో అజిత్ పవార్తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి విదీప్ జాదవ్, కో పైలట్ పింకీ మాలి, పైలట్ ఇన్ కమాండ్ సుమిత్ కపూర్, సెకండ్ ఇన్ కమాండ్ శాంభవి పాఠక్ ఉన్నారు. మొత్తం అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై దర్యాప్తు చేయడానికి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) బృందం బుధవారం ఢిల్లీ నుంచి పూణెకు వచ్చింది.
ఇది కూడా చదవండి: Social Media Restrictions: సోషల్ మీడియాకు చిన్నారులను దూరంగా ఉంచాల్సిందే.. ఫేక్ పోస్టులపై కఠిన చర్యలు..
తాజావార్తలు
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!
-
IPS Officers: ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ..
-
King100: హీరోయిన్గా కాదు.. విలన్ గా టబు? నాగార్జున 100వ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్!
-
ITR Filing AY 2026-27: ఆదాయం తక్కువ ఉన్నా సరే.. ఈ 5 కారణాలతో ITR తప్పనిసరి
-
PM Modi Three-Nation Tour: మూడు దేశాల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ.. పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!
-
ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
-
Nat Sciver-Brunt: ప్రపంచకప్ మాదే అనుకున్నాం.. చాలా బాధగా ఉంది.. బోరున ఏడ్చిన ఇంగ్లండ్ కెప్టెన్!