ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులకు సర్ ప్రైజ్ ఇస్తూనే ఉంటుంది. తద్వారా తాను కోల్పోయిన కస్టమర్లతో పాటు కొత్త వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది ఎయిర్టెల్. తాజాగా ఎయిర్టెల్ మరో సంచలన ఆఫర్ తీసుకువచ్చింది. మరి లేట్ ఎందుకు ఆ ఆఫర్ వివరాలు చూసేద్దామా. స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నాటి నుంచి డేటా వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయింది. వినియోగదారులు సైతం ఎక్కువగా డైలీ డేటా అందించే ప్లాన్ల కోసం…
ప్రస్తుతం వినియోగదారులకు భారంగా మారిన టెలికాం ఛార్జీలు మరోసారి పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మరో విడత టారిఫ్లు పెంచే అవకాశాలున్నాయి. ఈ మేరకు దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో వెల్లడించింది. టెలికాం సంస్థలు తమ నెట్వర్క్, స్పెక్ట్రంపై ఇన్వెస్ట్ చేయాలంటే సగటున ప్రతి యూజర్పై వచ్చే ఆదాయాన్ని మరింత పెంచుకోవాల్సి ఉంటుందని… ఒకవేళ అలా చేయకపోతే సర్వీసుల్లో నాణ్యత లోపించే అవకాశం ఉందని…
అన్నీ ఉచితమంటూ టెలికం రంగంలో రిలయన్స్ జియో ఎంట్రీ ఇవ్వడంతో.. పోటీ పడి తమ ప్లాన్స్ రేట్లను తగ్గిస్తూ వచ్చిన వివిధ టెలికం సంస్థలు.. మళ్లీ క్రమంగా వడ్డింపు ప్రారంభించాయి.. ఇప్పటికే జియో, ఎయిర్టెల్, ఐడియా.. ఇలా అన్ని తమ టారీప్ రేట్లను పెంచేయగా.. మరోసారి చార్జీల పెంపునకు సిద్ధం అవుతోంది భారతీ ఎయిర్టెల్.. మినిమం ఛార్జీ రూ.200కు చేరుతుందని భారతీ ఎయిర్టెల్ భారత్-దక్షిణాసియా ఎండీ, సీఈవో గోపాల్విత్తల్ వెల్లడించారు.. నెలలో కనీస ఛార్జీ రూ.300గా ఉండాలన్న…
ప్రముఖ మొబైల్ దిగ్గజం ఎయిర్టెల్ వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమవుతున్నది. తాజాగా ఇంటర్నెట్ కన్సార్టియం సీమీవీ6లో చేరింది. వేగంగా అభివృద్ది చెందుతున్న డిజిటల్ ఎకానమీకి కావాల్సిన నెట్వర్క్ అవసరాలను తీర్చేందుకు ఈ సీమీవీ6 ఉపయోగపడుతుంది. ఇక ఈ సీమీవీ6 2025 నుంచి అందుబాటులోకి రానున్నది. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన నిధుల్లో 20 శాతం నిధులను ఎయిర్టెల్ సంస్థ సమకూర్చుతున్నది. Read: Live: గౌతమ్ రెడ్డికి నివాళులు అర్పించిన ఏపీ సీఎం జగన్ ఈ ప్రాజెక్టులో ఎయిర్టెల్తో…
టెలికం సంస్థలు, ఓటీటీ సర్వీసుల విషయంలోనూ పోటీ పడుతున్నాయి.. జియో.. ఇప్పటికే దూసుకుపోతుండగా.. ఎయిర్టెల్ కూడా ఆ సర్వీసులను అందిస్తున్న విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు తన యూజర్లకు అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది భారతీ ఎయిర్టెల్.. అసలే, ప్రతీ 28 రోజులకు రీఛార్జ్ కొందరికి ఇబ్బందిగా మారిన నేపథ్యంలో.. దీర్ఘకాల వ్యాలిడిటీని ఇప్పటికే అందుబాటులోకి తెచ్చిన ఆ సంస్థ.. ఆ ప్లాన్ రీచార్జ్ చేసుకునేవారికి శుభవార్త చెప్పింది… అయితే, ఇప్పటి వరకు ఉన్న రూ.2999 ప్లాన్ను సైలెంట్గా…
ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా హైస్పీడ్ ఇంటర్నెట్ వచ్చేలా చూసేందుకు ఎలన్ మస్క్ స్టార్ లింక్స్ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు. స్పేస్ ఎక్స్ సంస్థ ఈ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఎలన్ మస్క్కు పోటీగా ఎయిర్టెల్ వన్వెబ్ పేరుతో ఫ్రెంచ్ గయానాలోని కౌర్ స్పేస్ సెంటర్ నుంచి భారతీ ఎయిర్టెల్ 34 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇంటర్నెట్ కోసం ఈ ఉపగ్రహాలను ప్రయోగించింది. ఈ ఏడాది ఎయిర్ టెల్ ప్రయోగించిన మొదటి ప్రయోగం ఇది. 34 ఉపగ్రహాలను…
దేశవ్యాప్తంగా ప్రముఖ దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్టెల్ సర్వీసుల్లో అంతరాయం తలెత్తింది. ఉదయం 11:30 గంటల నుంచి బ్రాడ్బ్యాండ్, వైఫై, మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయాయి. మరోవైపు ఎయిర్టెల్ యాప్ కూడా పనిచేయట్లేదు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లు ట్విట్టర్లో ఫిర్యాదులు చేస్తున్నారు. అటు ఎయిర్టెల్ సేవల అంతరాయంపై కంపెనీ స్పందించింది. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. తమ కస్టమర్లకు క్షమాపణలు కూడా చెప్పింది. సేవలను వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది. కాగా ఎయిర్టెల్…
ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్లో గూగుల్ భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టనుంది. రానున్న ఐదేళ్ల కాలంలో ఎయిర్టెల్లో గూగుల్ సంస్థ రూ.7,400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎయిర్టెల్లో 1.28 శాతం యాజమాన్య హక్కులను కొనుగోలు చేసేందుకు గూగుల్ ఆసక్తి చూపిస్తోంది. మరో 300 మిలియన్ డాలర్ల మేర ఎయిర్ టెల్తో వాణిజ్య లావాదేవీలను గూగుల్ కుదుర్చుకోనుంది. Read Also: మొబైల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు ట్రాయ్ గుడ్ న్యూస్ కాగా 5G నెట్వర్క్, తక్కువ ధరకు…
ప్రస్తుతం అన్ని టెలికాం కంపెనీలు ఒక నెలలో 30 లేదా 31 రోజులు ఉంటే 28 రోజుల లెక్కన రీఛార్జ్ ప్లాన్లను మాత్రమే ప్రకటిస్తున్నాయి. ఈ లెక్కన ఏడాదికి 336 రోజులే అవుతుంది. సాధారణ సంవత్సరంతో పోలిస్తే 29 రోజులు తక్కువ అన్నమాట. అయితే టెలికాం కంపెనీల ప్లాన్ వెనుక ఓ లాజిక్ ఉంది. అంతేకాదు… రూ.వేల కోట్ల వ్యాపారం కూడా దాగి ఉంది. Read Also: రివైండ్ 2021: సెంచరీ కొట్టిన పెట్రోల్.. జనవరిలో అలా……
ఎయిర్టెల్ ఓ చెత్త రికార్డు సృష్టించింది.. అదేంటి? అనే అనుమానం వెంటనే రావొచ్చు.. విషయం ఏంటంటే.. తమకు సర్వీసులో తలెత్తుతున్న ఇబ్బందులు, లోపాలపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్)కి ఫిర్యాదులు చేశారు వినియోగదారులు.. అన్ని టెలికం సంస్థలపై యూజర్ల నుంచి ఫిర్యాదులు అందినా.. ఎయిర్టెల్పై అత్యధిక ఫిర్యాదులు అందాయి.. ఈ విషయాన్ని మంత్రి దేవుసింహ్ చౌహాన్ లోక్సభలో వెల్లడించారు.. ఈ ఏడాదిలో నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్లపై దేశవ్యాప్తంగా ట్రాయ్కి వేల సంఖ్యలో ఫిర్యాదులు అందాయని.. అందులో…