మొబైల్ రీఛార్జ్ కోసం 28 రోజుల వ్యాలిడిటీనే ఎందుకు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం అన్ని టెలికాం కంపెనీలు ఒక నెలలో 30 లేదా 31 రోజులు ఉంటే 28 రోజుల లెక్కన రీఛార్జ్ ప్లాన్లను మాత్రమే ప్రకటిస్తున్నాయి. ఈ లెక్కన ఏడాదికి 336 రోజులే అవుతుంది. సాధారణ సంవత్సరంతో పోలిస్తే 29 రోజులు తక్కువ అన్నమాట. అయితే టెలికాం కంపెనీల ప్లాన్ వెనుక ఓ లాజిక్ ఉంది. అంతేకాదు… రూ.వేల కోట్ల వ్యాపారం కూడా దాగి ఉంది.
Read Also: రివైండ్ 2021: సెంచరీ కొట్టిన పెట్రోల్.. జనవరిలో అలా… డిసెంబర్లో ఇలా…
Also Read
సాధారణంగా ఏడాదిలో 365 రోజులు ఉంటాయి. టెలికాం కంపెనీలు ప్రకటించే నెలవారీ ప్లాన్ ప్రకారం చూసుకుంటే 336 రోజులు మాత్రమే మనం రీఛార్జ్ చేసుకోగలం. అంటే మిగతా 29 రోజులకు మళ్లీ మనం రీఛార్జ్ చేయించుకోవాలి. అంటే 12 నెలల కాలానికి మనం 13నెలల ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ అదనపు నెల మీద టెలికాం కంపెనీలు భారీగా ఆదాయాన్ని వెనకేసుకుంటున్నాయి. అదనపు నెల మీద ఆదాయం లెక్కలోకి తీసుకుంటే అత్యధికంగా జియో రూ.6,186 కోట్లు, ఎయిర్టెల్ రూ.5,415 కోట్లు, వీఐ రూ.2,934 కోట్లు సంపాదిస్తున్నాయి. మూడు నెలల ప్లాన్లోనూ 90 రోజులు ఉండకుండా 84 రోజులు మాత్రమే రీఛార్జ్ ప్లాన్ ఉంటుంది. నాలుగు సార్లు రీఛార్జ్ చేసుకుంటే 336 రోజుల పాటు మాత్రమే వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే మిగిలిన 29 రోజులకు ప్రత్యేకంగా రీఛార్జ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా టెలికాం కంపెనీలు భారీగానే ఆర్జిస్తున్నాయి.
తాజావార్తలు
-
Genelia: “నా సమస్య కూడా సాల్వ్ చేయండి”.. బిగ్ బిని కోరిన జెనీలియా
-
చైనాకు షాక్ ఇచ్చిన భారత మహిళల ఆర్చరీ జట్టు.. Archery World Cup 2026లో స్వర్ణ పతకం కైవసం.!
-
Vishwambhara Two Parts : రెండు భాగాలుగా విశ్వంభర.. కన్ఫమ్ చేసిన దర్శకుడు
-
IPL 2026 Playoffs: ఒకే రోజు రెండు జట్లు ఇంటికి.. టాప్ లేపిన ఆర్సీబీ.. ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం!
-
Hero to Turn Director : హిట్టు కోసం తానే దర్శకత్వం చేసుకుంటున్న హీరో