Air India: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా దుర్ఘటన తర్వాత, ఈ రోజు ఏకంగా 07 విమానాలను రద్దు చేశారు. రద్దు చేసిన విమానాల్లో 06 బోయింగ్ 787-8 డ్రీమ్లైన్ విమానాలు ఉన్నాయి.
Air India: అహ్మదాబాద్ ఎయిరిండియా విమానం ప్రమాదం తర్వాత, ఈ రోజు ఎయిరిండియా రెండు అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానాలలో సాంకేతిక సమస్యలు గుర్తించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. అహ్మదాబాద్-లండన్, ఢిల్లీ -పారిస్ మధ్య నడిచే రెండు విమానాలను మంగళవారం రద్దు చేశారు.
Air India: ఎయిరిండియా ఘోర ప్రమాదం జరిగిన కొన్ని రోజుల తర్వాత ‘‘ఆపరేషనల్ సమస్యల’’ కారణంగా అహ్మదాబాద్-లండన్ గాట్విక్ మధ్య నడిచే సర్వీస్ - AI 159 -ను రద్దు చేసింది. ఎలాంటి సమాచారం లేకుండా రద్దు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు. అయితే, చిక్కుకుపోయిన ప్రయాణికులను వేరే మార్గాల్లో పంపిస్తామని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
అహ్మదాబాద్ విమాన ప్రమాద దృశ్యాలు ఇంకా కళ్ల ముందే మెదులుతున్నాయి. జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి బయల్దేరిన ఎయిరిండియా విమానం.. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే కుప్పకూలిపోయింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎయిర్ హోస్టెస్ మనీషా థాపా కూడా ఉంది. మనీషా బీహార్ రాజధాని పాట్నా నివాసి. ఆమె మరణ వార్త విన్న తర్వాత కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇరుగుపొరుగుతోపాటు తాను చదివిన కళాశాలలో సైతం విషాదకరంగా మారింది. మనీషా మృతిపై ఆమె మామ ప్రవీణ్ తమంగ్ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. ఆమె మృతి విషయం తెలిసిన వెంటనే కుటుంబం షాక్లోకి జారుకుందన్నారు.. మనీషా కెరీర్ ఇప్పుడే…
Vijay Rupani: అహ్మదాబాద్ ఎయిరిండియా దుర్ఘటనలో 242 మంది ప్రయాణికుల్లో కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలు దక్కించుకున్నారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. అయితే, రూపానీ రెండు సార్లు తన విమాన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. కానీ మూడోసారి మాత్రం ప్రమాదంలో మరణించారు.
Air India Crash: అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదంలో విమానంలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. భారత సంతతి బ్రిటిష్ జాతీయుడు విశ్వష్ కుమార్ రమేష్ అద్భుతంగా ప్రాణాలు దక్కించుకున్నాడు. గురువారం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్ గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన కొన్ని సెకన్ల తర్వాత బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలింది. 11ఏ సీటులో కూర్చొన్న విశ్వేష్ కుమార్ రమేష్ కూర్చొన్నారు.
Air India Crash: అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదం వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 274 మంది మరణించారు. ఇందులో విమానంలో ఉన్న 241 మందితో పాటు విమానం కూలిన ప్రదేశంలో ఉన్నవారు కూడా మరణించారు. విమానం ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే అహ్మదాబాద్లోని మేఘనినగర్ ప్రాంతంలోని BJ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో, హాస్టల్లోని మెడికోలు మరణించారు.
Air India Plane Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం యావత్ దేశాన్ని విషాదంలోకి నెట్టింది. గురువారం మధ్యాహ్నం లండన్ బయలుదేరిన విమానం, టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో 241 మంది మరణించారు. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో మిగిలారు. విమానం డాక్టర్ హాస్టల్ భవనంపై కూలడంతో 24 మంది మెడికోలు మరణించారు. ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది మరణించారు.
భవనం పైకప్పుపై దొరికిన బ్లాక్ బాక్స్.. అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాద ఘటనకు కారణాలు తెలుసుకునేందుకు కీలకమైన ‘‘బ్లాక్ బాక్స్’’ దొరికింది. విమానం కూలిపోతున్న సమయంలో సమీపంలోని డాక్టర్స్ హాస్టల్స్ భవనాన్ని ఢీకొట్టింది. ఇప్పుడు అదే బిల్డింగ్ పైన బ్లాక్ బాక్స్ లభ్యమైంది. దీంతో, 265 మందిని బలి తీసుకున్న ఈ ఘోర దుర్ఘటనకు కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) పూర్తిస్థాయిలో పని ప్రారంభించింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన…