Plane Crash: విషాద గాధ.. ప్రారంభంలోనే ముగిసిన ఎయిర్ హోస్టెస్ కెరీర్..
- ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మనీషా థాపా
- మనీషా బీహార్ రాజధాని పాట్నా నివాసి
- గ్రౌండ్ స్టాఫ్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన మనీషా
- మనీషా థాపా కల ఎయిర్ హోస్టెస్ కావడమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎయిర్ హోస్టెస్ మనీషా థాపా కూడా ఉంది. మనీషా బీహార్ రాజధాని పాట్నా నివాసి. ఆమె మరణ వార్త విన్న తర్వాత కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇరుగుపొరుగుతోపాటు తాను చదివిన కళాశాలలో సైతం విషాదకరంగా మారింది. మనీషా మృతిపై ఆమె మామ ప్రవీణ్ తమంగ్ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. ఆమె మృతి విషయం తెలిసిన వెంటనే కుటుంబం షాక్లోకి జారుకుందన్నారు.. మనీషా కెరీర్ ఇప్పుడే ప్రారంభమైందని.. అంతలోపే ముగిసిందని భావోద్వేగానికి లోనయ్యారు.
READ MORE: Tollywood: రేపు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యే సినీ ప్రముఖుల లిస్ట్ ఇదే!
Also Read
- Bypoll Elections: అభ్యర్థుల మార్పే ముంచేసిందా..? బీజేపీ వ్యూహం ఎక్కడ తిరగబడింది..?
- Trump-Saudi: ట్రంప్ ముందు సౌదీ కీలక అభ్యర్థన.. భయపడిందా?
- Team India: టీమిండియాను వదిలి వెళ్లాలంటే బాధగా ఉంది.. ‘కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నా’..
- Floodlight Collapse: విశాఖ స్టేడియంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన ఫ్లడ్ లైట్..
గ్రౌండ్ స్టాఫ్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన మనీషా ఎయిర్ ఇండియాలో క్యాబిన్ క్రూ అయ్యింది. మనీషా థాపా కల ఎయిర్ హోస్టెస్ కావడమే. దాని కోసం మొదట ఇండిగో ఎయిర్లైన్స్లో గ్రౌండ్ స్టాఫ్గా పనిచేయడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆకాసా ఎయిర్లైన్స్లో క్యాబిన్ క్రూగా పనిచేసింది. అనంతరం ఎయిర్ ఇండియాలో చేరింది. ప్రమాదానికి ముందు.. ఆమె లండన్, ఆస్ట్రేలియాకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలలో ఎయిర్ హోస్టెస్గా పనిచేసింది. తన కల నేరవేరిన కొద్ది రోజుల్లోనే అనంతలోకాలకు చేరుకోవడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేరీర్ ప్రారంభంలోనే ఇలా జరగడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: Ram Mohan Naidu: “నా తండ్రి కూడా ప్రమాదంలోనే మరణించారు.. ఆ బాధ నాకు తెలుసు”
మనీషా థాపా పాట్నాలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ నుంచి బీబీఈ డిగ్రీ పొందింది. ఆమె మరణ వార్త తెలియగానే కళాశాలలో శోకసంద్రం అలుముకుంది. శనివారం కళాశాల క్యాంపస్లో మనీషా థాపా జ్ఞాపకార్థం సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో మనీషా అకాల మరణం పట్ల ఆ సంస్థ ఉపాధ్యాయులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు సంతాపం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Mrunal Thakur: ఫ్రెండ్ రిసెప్షన్లో స్టార్ హీరోయిన్ రచ్చ! నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ డ్యాన్స్ వీడియో..
-
Bypoll Elections: అభ్యర్థుల మార్పే ముంచేసిందా..? బీజేపీ వ్యూహం ఎక్కడ తిరగబడింది..?
-
Trump-Saudi: ట్రంప్ ముందు సౌదీ కీలక అభ్యర్థన.. భయపడిందా?
-
NIMS : నిమ్స్ ఘనత.. 1,000 రొబోటిక్ సర్జరీలు పూర్తి.. సీఎం రేవంత్ ప్రశంసలు.!
-
Team India: టీమిండియాను వదిలి వెళ్లాలంటే బాధగా ఉంది.. ‘కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నా’..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!