Plane Crash: విషాద గాధ.. ప్రారంభంలోనే ముగిసిన ఎయిర్ హోస్టెస్ కెరీర్..
- ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మనీషా థాపా
- మనీషా బీహార్ రాజధాని పాట్నా నివాసి
- గ్రౌండ్ స్టాఫ్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన మనీషా
- మనీషా థాపా కల ఎయిర్ హోస్టెస్ కావడమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎయిర్ హోస్టెస్ మనీషా థాపా కూడా ఉంది. మనీషా బీహార్ రాజధాని పాట్నా నివాసి. ఆమె మరణ వార్త విన్న తర్వాత కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇరుగుపొరుగుతోపాటు తాను చదివిన కళాశాలలో సైతం విషాదకరంగా మారింది. మనీషా మృతిపై ఆమె మామ ప్రవీణ్ తమంగ్ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. ఆమె మృతి విషయం తెలిసిన వెంటనే కుటుంబం షాక్లోకి జారుకుందన్నారు.. మనీషా కెరీర్ ఇప్పుడే ప్రారంభమైందని.. అంతలోపే ముగిసిందని భావోద్వేగానికి లోనయ్యారు.
READ MORE: Tollywood: రేపు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యే సినీ ప్రముఖుల లిస్ట్ ఇదే!
Also Read
- 64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
- Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే 'క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్' సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
- CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
- CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ పథకం.. ఒక్క పైసకే గ్రాము బంగారం.. పథకంలో షాకింగ్ ట్విస్ట్..
గ్రౌండ్ స్టాఫ్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన మనీషా ఎయిర్ ఇండియాలో క్యాబిన్ క్రూ అయ్యింది. మనీషా థాపా కల ఎయిర్ హోస్టెస్ కావడమే. దాని కోసం మొదట ఇండిగో ఎయిర్లైన్స్లో గ్రౌండ్ స్టాఫ్గా పనిచేయడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆకాసా ఎయిర్లైన్స్లో క్యాబిన్ క్రూగా పనిచేసింది. అనంతరం ఎయిర్ ఇండియాలో చేరింది. ప్రమాదానికి ముందు.. ఆమె లండన్, ఆస్ట్రేలియాకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలలో ఎయిర్ హోస్టెస్గా పనిచేసింది. తన కల నేరవేరిన కొద్ది రోజుల్లోనే అనంతలోకాలకు చేరుకోవడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేరీర్ ప్రారంభంలోనే ఇలా జరగడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: Ram Mohan Naidu: “నా తండ్రి కూడా ప్రమాదంలోనే మరణించారు.. ఆ బాధ నాకు తెలుసు”
మనీషా థాపా పాట్నాలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ నుంచి బీబీఈ డిగ్రీ పొందింది. ఆమె మరణ వార్త తెలియగానే కళాశాలలో శోకసంద్రం అలుముకుంది. శనివారం కళాశాల క్యాంపస్లో మనీషా థాపా జ్ఞాపకార్థం సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో మనీషా అకాల మరణం పట్ల ఆ సంస్థ ఉపాధ్యాయులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు సంతాపం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Gachibowli Building Collapse : గచ్చిబౌలిలో హైటెన్షన్.. కుప్పకూలిన 7 అంతస్తుల భవనం..!
-
ISRO: ఇస్రో ఇక రాకెట్లు తయారు చేయదా?.. సంస్థ కొత్త వ్యూహం ఇదే..!
-
NHAI rs350 Toll Pass: NHAI కొత్త రూ.350 టోల్ పాస్.. ఎవరికి వర్తిస్తుంది? ఎలా అప్లై చేయాలి?
-
Hollywood OTT Releases: ఈ వారం ఓటీటీలో క్రేజీ హాలీవుడ్ రిలీజ్లు.. డీసీ థ్రిల్లర్ నుంచి ‘టాయ్ స్టోరీ’ 5 వరకు..
ట్రెండింగ్
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!