Air India flights: ఎయిర్ ఇండియాలో ఏం జరుగుతోంది..? భారీగా అంతర్జాతీయ, దేశీయ విమానాలు రద్దు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India flights: అహ్మదాబాద్ ప్రమాద ఘటన తర్వాత నుండి ఎయిర్ ఇండియా కంపెనీలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిత్యం ఏదో ఒక సమస్యతో అనేక ఫ్లైట్స్ రద్దు అవుతున్నాయి. ఎయిర్ ఇండియా శుక్రవారం (జూన్ 20) భారీగా అంతర్జాతీయ, దేశీయ విమానాలను రద్దు చేసింది. అయితే, ఈ నిర్ణయం విమానాల మెరుగైన మైన్టెనెన్స్, తీవ్ర వర్షాలు, వాతావరణం కారణంగా తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది.
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
రద్దు చేసిన విమానాల్లో దుబాయ్, చెన్నై, ఢిల్లీ, మెల్బోర్న్, పుణె, అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబయి నగరాల మధ్య నడిచే సేవలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా ప్రకటన ప్రకారం, రద్దు కాబడిన విమానాలు కింది విధంగా ఉన్నాయి:
అంతర్జాతీయంగా చూస్తే..
AI906: దుబాయ్ నుంచి చెన్నై
AI308: ఢిల్లీ నుంచి మెల్బోర్న్
AI309: మెల్బోర్న్ నుంచి ఢిల్లీ
AI2204: దుబాయ్ నుంచి హైదరాబాద్
దేశీయంగా:
AI874: పుణె నుంచి ఢిల్లీ
AI456: అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ
AI2872: హైదరాబాద్ నుంచి ముంబయి
AI571: చెన్నై నుంచి ముంబయి
దీనితో ఎయిర్లైన్ అన్ని ప్రయాణికులకు సంబంధించి పూర్తి రీఫండ్ లేదా ఉచిత రీషెడ్యూలింగ్ అవకాశాన్ని అందిస్తోంది. ‘ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేము విచారం వ్యక్తం చేస్తున్నాం. వారి గమ్యస్థానాలకు వీలైనంత త్వరగా చేరుకునేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం అని ఎయిర్ ఇండియా పేర్కొంది. ఇంకా ఏదైనా సమాచారం కోసం ప్రయాణికులు ఎయిర్ ఇండియా వెబ్సైట్ (airindia.com)లో ఫ్లైట్ స్టేటస్ను చెక్ చేయవచ్చని, లేదా కస్టమర్ కేర్ నంబర్లకు (011-69329333, 011-69329999) కాల్ చేయవచ్చని సూచించింది.
ఇది ఇలా ఉండగా, ఎయిర్ ఇండియా గురువారం (జూన్ 19) ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో జూన్ 21 నుండి జూలై 15, 2025 వరకు పలు అంతర్జాతీయ రూట్లపై విమాన సేవలను తాత్కాలికంగా తగ్గిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. బోయింగ్ 787, 777 విమానాలపై ముందస్తు భద్రతా తనిఖీలను ఉద్దేశ్యపూర్వకంగా చేపట్టడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన కారణం. అలాగే, యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో గగనతల మూసివేతల కారణంగా విమాన ప్రయాణ కాలం పెరగడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!