Air India: ఎయిరిండియా కీలక నిర్ణయం. అంతర్జాతీయ సేవలు కుదింపు
- ఎయిరిండియా కీలక నిర్ణయం
- అంతర్జాతీయ సేవలు కుదింపు
- ప్రయాణికుల అసౌకర్యానికి ఎయిరిండియా క్షమాపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ సేవలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. జూన్ 12 అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో దాదాపు 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో 16 అంతర్జాతీయ మార్గాల్లో విమానాలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఇక 3 నగరాలకు కార్యకలాపాలను కూడా నిలిపేసింది. ఘోర విమాన ప్రమాదం తర్వాత నిత్యం అంతరాయాలతో సతమతమవుతున్న టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించడమే లక్ష్యమని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Netanyahu: కుమారుడి పెళ్లి గురించి నెతన్యాహు భావోద్వేగం.. సోషల్ మీడియాలో విమర్శలు
Also Read
జూన్ 21 నుంచి జూలై 15 వరకు 16 అంతర్జాతీయ మార్గాల్లో విమాన సర్వీసులు తగ్గిస్తున్నామని.. అలాగే 3 విదేశీ గమ్యస్థానాలు నిలిపివేస్తున్నట్లు గురువారం ఎయిరిండియా వెల్లడించింది. ఇక వైడ్-బాడీ విమానాలతో నడిచే విమానాలను తాత్కాలికంగా 15 శాతం తగ్గిస్తామని పేర్కొంది. ఈ నిర్ణయం శనివారం నుంచి అమల్లోకి వస్తుందని ఎయిర్లైన్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇది కూడా చదవండి: Rithika Singh : అందాల ఆరబోతకు డోర్స్ ఓపెన్ చేసిన యంగ్ బ్యూటీ
ఢిల్లీ-నైరోబి, అమృత్సర్-లండన్ (గాట్విక్), గోవా (మోపా)-లండన్ (గాట్విక్) లలో జూలై 15 వరకు సేవలు నిలిపివేశారు. ఢిల్లీ-నైరోబి మార్గంలో వారానికి నాలుగు విమానాలు నడుస్తుండగా.. అమృత్సర్-లండన్ (గాట్విక్), గోవా (మోపా)-లండన్ (గాట్విక్) మార్గాల్లో వారానికి మూడు విమానాలు నడుస్తున్నాయని ఎయిర్లైన్ తెలిపింది. అంతేకాకుండా ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా దేశాలలోని నగరాలను అనుసంధానించే 16 అంతర్జాతీయ మార్గాల్లో కూడా విమానాలు తగ్గిస్తున్నట్లు చెప్పింది. ఉత్తర అమెరికాలో ఢిల్లీ-టొరంటో, ఢిల్లీ-వాంకోవర్, ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో, ఢిల్లీ-చికాగో, ఢిల్లీ-వాషింగ్టన్ మార్గాల్లో విమాన సర్వీసులు తగ్గనున్నాయి. అలాగే యూరప్లోని ఢిల్లీ-లండన్ హీత్రో, బెంగళూరు-లండన్ హీత్రో, అమ్రిస్ట్సర్-బర్మింగ్హామ్, ఢిల్లీ-బర్మింగ్హామ్, ఢిల్లీ-పారిస్, ఢిల్లీ-మిలన్, ఢిల్లీ-కోపెన్హాగన్, ఢిల్లీ-వియన్నా, ఢిల్లీ-ఆమ్స్టర్డామ్ మార్గాల్లో కూడా విమాన సేవలు తగ్గాయి. అదే విధంగా సవరించిన షెడ్యూల్లో భాగంగా ఢిల్లీ-మెల్బోర్న్, ఢిల్లీ-సిడ్నీ, ఢిల్లీ-టోక్యో హనేడా మరియు ఢిల్లీ-సియోల్ (ఇంచియాన్) సర్వీసులను కూడా తగ్గించారు.
సర్వీసులు తగ్గించడం కారణంగా ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు ఎయిరిండియా క్షమాపణ చెప్పింది. కేవలం మెరుగైన సేవలు అందించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ముందుగా బుక్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బు వాపస్ ఇచ్చేస్తామని.. లేదంటే ప్రత్యామ్నాయ విమానాల్లో వసతి కల్పించడం వంటివి చేస్తామని వెల్లడించింది. ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది.
తాజావార్తలు
-
Trump: మొజ్తబా ఖమేనీని కలవాలనుకుంటున్నా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Iran War: కువైట్ ఏయిర్పోర్ట్పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి..
-
Bengal Politics: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రీటబ్రత.. మమత పార్టీలో కల్లోలం..
-
El Nino-Centre: ఎల్నినోపై కేంద్రం అప్రమత్తం.. భయాందోళన అక్కర్లేదని హామీ
-
Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
ట్రెండింగ్
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!