ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియాని ప్రైవేట్కు అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఆ ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఎట్టకేలకు గత శుక్రవారం ఎయిర్ ఇండియా-AI లో తన వాటాలన్నింటినీ విక్రయించేసింది. దాంతో పాటు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లిమిటెడ్ -AIXL, ఎయిర్ ఇండియా SATS ..అంటే ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్-AISATSలు కూడా ఇందులోకి వస్తాయి. ఏడు దశాబ్దాల తరువాత ఎయిర్ ఇండియా తిరిగి తన మాతృ సంస్థ టాటాల చేతిలోకి వెళ్లింది.…
రూ.18 వేల కోట్ల ఓపెన్ బిడ్తో ఎయిరిండియాను సొంతం చేసుకుంది టాటా సన్స్.. దీంతో 68 ఏళ్ల తర్వాత తిరిగి ఎయిరిండియా.. టాటాల చేతిలోకి వెళ్లినట్టు అయ్యింది.. డిసెంబర్ నుంచి టాటాల చేతిలోకి వెళ్లిపోనుంది ఎయిరిండియా.. అయితే, టాటాల చేతికి సంస్థ వెళ్లిపోతుండడంతో.. అసలు ఎయిరిండియాలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఏంటి? అనే ఆందోళన ఉద్యోగుల్లో మొదలైంది.. దీనిపై క్లారిటీ కూడా ఇచ్చారు.. ఏఐలో పని చేస్తున్న ఉద్యోగులను ఏడాది పాటు అలాగే కొనసాగించనుంది టాటా గ్రూప్..…
ఎయిరిండియా బిడ్ దక్కించుకుంది టాటా సన్స్.. ఎయిరిండియాపై కాసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది… రూ.18 వేల కోట్ల ఓపెన్ బిడ్తో ఎయిరిండియాను సొంతం చేసుకుంది.. దీంతో 68 ఏళ్ల తర్వాత తిరిగి ఎయిరిండియా.. టాటాల చేతిలోకి వెళ్లింది… అయితే, టాటా సన్స్ అధినేత జహంగీర్ రతన్ జీ దాదాబాయ్ టాటా.. భారత్లో విమానయాన సర్వీసులను ప్రారంభించారు.. 1938లో విదేశాలకు కూడా విమాన సర్వీసులను విస్తరించారు.. మొదట టాటా ఎయిర్ సర్వీసెస్ గా ఉండగా..…
పాతతరం విమానాలను వియానాయ సంస్థలు వేలం వేసి తుక్కుకింద అమ్మేస్తుంటాయి. ఇలానే ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన ఓ విమానాన్ని ఇటీవలే తుక్కుకింద విక్రయించారు. అలా విక్రయించిన విమానాన్ని ఢిల్లీలోని రహదారి గుండా తరలిస్తుండగా వంతెన కింద ఇరుక్కుపోయింది. వంతెన కింద ఇరుక్కుపోవడంతో ఆ దృశ్యాలను కొంతమంది వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వంతెన కింద ఇరుక్కున్న విమానాన్ని సేవల నుంచి ఎయిర్…
ఎయిర్ ఇండియాను టాటా సన్స్ హస్తగతం చేసుకోబోతున్నది. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ కోసం టాటా సన్స్ సంస్థ వేసిన బిడ్ ఒకే అయినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే ఓ ప్రకటన చేసే అవకాశం ఉన్నది. ఎయిర్ ఇండియాలో ప్రభుత్వంకు 75 శాతం వాటా ఉన్నది. భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను అమ్మేందుకు చాలా కాలంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. 2018 లో ఒకసారి కేంద్రం ఎయిర్ ఇండియాను అమ్మేందుకు…
సాధారణంగా పెంపుడు కుక్కలను విమానంలో అనుమతించరు. కానీ, ఇండియాలో ఏయిర్ ఇండియా సంస్థ ఒక్కటే పెంపుడు కుక్కలను బిజినెస్ క్లాస్లో అనుమతిస్తుంది. విమానంలో బిజినెస్ క్లాస్లో పెంపుడు జంతువులను తీసుకెళ్లడానికి టికెట్ సుమారు రూ.20 వేల వరకు ఉంటుంది. గరిష్టంగా రెండు పెంపుడు కుక్కలను తీసుకెళ్లవచ్చు. అయితే, ముంబై నుంచి చెన్నై వెళ్లేందుకు ఓ వ్యాపారి తన పెంపుడు కుక్కపిల్ల కోసం ఏకంగా 12 బిజినెస్ క్లాస్ టికెట్లను బుక్ చేసుకున్నాడు. బిజినెస్ జే క్లాస్లో 12…
కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత సివిల్ ఏవియేషన్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై హైదరాబాద్ నుంచి నేరుగా లండన్కు నాన్స్టాప్గా విమాన సర్వీసులను ప్రవేశపెడుతున్నట్టు ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ రోజు నుంచే ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈరోజు లండన్ నుంచి ఎయిర్ ఇండియా నాన్స్టాప్ విమానం హైదరాబాద్ చేరుకుంటుంది. రేపు హైదరాబాద్ నుంచి లండన్కు నాన్స్టాప్ విమానం బయలుదేరుతుంది. ఇప్పటి వరకు దుబాయ్, జర్మనీ మీదుగా…
భారత దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న. ఇప్పటి వరకు మొత్తం 48 మందికి భారత రత్న అవార్డులు పొందగా, ఇందులో 14 మందికి మరణానంతరం ఈ అవార్డులు పోందారు. భారత రత్న అవార్డులు పొందిన వారిలో అమర్త్య సేన్ కూడా ఒకరు. ఈ పురస్కారం పోందిన వారికి ఎయిర్ ఇండియా సంస్థ ఉచిత విమాన ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఉచిత ప్రయాణం వినియోగించుకున్న వారిలో అమార్త్యసేన్ ముందు వరసలో ఉన్నారు. ఆయన…
క్రెడిట్ కార్డులు, పాస్పోర్ట్లు, ఫోన్ నంబర్లతో సహా పదేళ్లకు సంబంధించిన విలువైన ఎయిర్ ఇండియా కస్టమర్ డేటా ఫిబ్రవరిలో భారీ సైబర్ నేరగాళ్లు దొంగలించినట్లు ఎయిర్లైన్స్ ప్రకటించింది. ఈ సంఘటనలో 2011 ఆగస్టు 26 నుండి 2021 ఫిబ్రవరి 3 మధ్య ఉన్న 45 లక్షల మంది కస్టమర్ల సమాచారం లీక్ అయినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. అయితే ఈ ఘటన జరిగిన మూడు నెలల తర్వాత ఇప్పుడు వెల్లడించింది ఎయిర్ ఇండియా. ప్యాసింజర్ సిస్టమ్ ఆపరేటర్…